అన్వేషించండి

Nirmala Sitharaman: 2 రోజుల కిందటే రామోజీరావు ఆరోగ్యంపై నరేంద్ర మోదీ ఆరా! అంతలోనే విషాదం: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman pays tribute to Ramoji Rao: రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థీవదేహానికి నిర్మలా సీతారామన్ నివాళులర్పించారు. ప్రధానిగా మరోసారి ప్రమాణం చేయనున్న మోదీ సందేశాన్ని చేరవేశారు.

Ramoji Rao in Ramoji Film City హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Cherukuri Ramoji Rao) పార్థీవదేహానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నివాళులు అర్పించారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన నిర్మలా సీతారామన్ హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు. అక్కడ రామోజీరావు పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆమె నివాళులర్పించారు. ప్రధానిగా మరోసారి ప్రమాణం చేయనున్న నరేంద్ర మోదీ సందేశాన్ని రామోజీరావు కుటుంబ సభ్యులకు నిర్మలా సీతారామన్ చేరవేశారు. రెండు రోజుల కిందటే మోదీ ఫోన్ చేసి రామోజీరావు ఆరోగ్యంపై ఆరా తీసినట్లు తెలిపారు. కానీ అంతలోనే విషాదం చోటుచేసుకుందని నిర్మలా సీతారామన్ అన్నారు.

రామోజీరావు మరణం తెలుగు ప్రజలతో పాటు జర్నలిజం రంగానికి తీరని లోటు అన్నారు. పలు రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ సందేశాన్ని చేరడానికి తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. రామోజీరావు జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. సినిమా రంగంలోనూ నిర్మాతగా ఎన్నో సందేశాత్మక సినిమాలు తీసి తనదైన మార్క్ చూపించారని పలు రంగాల్లో రామోజీరావు సేవల్ని గుర్తుచేశారు. 

రామోజీరావు ఫ్యామిలీకి మోదీ సందేశం.. 
రామోజీరావు మృతి తెలుగు వారికి మాత్రమే కాదు, దేశంలోని మీడియాకు, చిత్రపరిశ్రమకు తీరని లోటు అన్నారు. రామోజీరావు మరణంపై నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని నిర్మలమ్మ చెప్పారు. కుటుంబసభ్యులను కలిసి పరామర్శించాలని, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలపాలని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని రామోజీరావు ఫ్యామిలీకి అందించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తాను ఇక్కడికి వచ్చానని, రామోజీ కుటుంబసభ్యులను పరామర్శించాలని మోదీ తనను ఇక్కడికి పంపించారని చెప్పారు.

రామోజీరావు చేసిన సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా రామోజీరావు పద్మ విభూషణ్‌ను అందుకున్నారని తెలిసిందే.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Kavitha New Party: సర్వోదయ తెలంగాణ - కవిత పార్టీ నినాదం - ఏప్రిల్ 25న ప్రకటన
సర్వోదయ తెలంగాణ - కవిత పార్టీ నినాదం - ఏప్రిల్ 25న ప్రకటన
Telangana Praja Jagruthi: కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
కవిత ప్రజా జాగృతి బీఆర్ఎస్ ఓటు బ్యాంకుకు గండం - గులాబీ శ్రేణుల్లో గుబులు!
Telangana SSC Exams: తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
తెలంగాణలో టెన్త్ బోర్డ్ ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నారా? విద్యా కమిషన్ చేసిన సిఫార్సులివే
Hyderabad Traffic Diversions: నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!
నేడు హైదరాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర.. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు, అటువైపు వెళ్లొద్దు..!

వీడియోలు

Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam
Shubman Gill Message to Critics | విమర్శకులకు శుభ్‌మన్ గిల్ స్ట్రాంగ్ కౌంటర్ | ABP Desam
Pat Cummins Update on IPL 2026 Return | SRH ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ | ABP Desam
White Ball Turns Pink in PSL 2026 | పాక్ క్రికెట్ పరువు తీసిన పింక్ బాల్ | ABP Desam
Preity Zinta apologises to Jitesh Sharma | జితేశ్‌ శర్మకు సారీ చెప్పిన ప్రీతి జింటా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం చట్టవిరుద్ధం కాదు - అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
Nellore Latest News: నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
నెల్లూరు టీడీపీ నేతల వీడియోలు వైరల్‌! గెస్ట్‌ హౌస్‌లో నాగినీ డ్యాన్స్‌! సోషల్ మీడియాలో విమర్శలు!
Commercial gas: హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
హర్మూజ్ నుంచి వస్తున్న నౌకలు - కమర్షియల్ గ్యాస్ సరఫరా70 శాతానికి పెంపు - పరిస్థితి చక్కబడినట్లేనా?
Bellamkonda Sai Sreenivas : ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
ఏప్రిల్‌లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కావ్య ఎంగేజ్మెంట్ - పెళ్లి ఎప్పుడు, ఎక్కడో తెలుసా?
GST scam busted: ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
ఫేక్ కంపెనీలతో రూ.217 కోట్ల జీఎస్టీ స్కాం - ముఠా పట్టివేత - తెర వెనుక బడా వ్యక్తులు?
Another new airport for Delhi: ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
ఢిల్లీకి మరో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు - నోయిడా విమానాశ్రయం ప్రారంభానికి రెడీ
IPL 2026 Schedule: ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌పై ఈ పది విషయాలు గుర్తించారా? LSGకి అన్యాయం?
Kerala Elections 2026: కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
కేరళలో మారుతున్న సంప్రదాయ రాజకీయం - త్రిముఖ పోరుగా మారిన అసెంబ్లీగా ఎన్నికలు
Embed widget