అన్వేషించండి

Nirmala Sitharaman: 2 రోజుల కిందటే రామోజీరావు ఆరోగ్యంపై నరేంద్ర మోదీ ఆరా! అంతలోనే విషాదం: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman pays tribute to Ramoji Rao: రామోజీ ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థీవదేహానికి నిర్మలా సీతారామన్ నివాళులర్పించారు. ప్రధానిగా మరోసారి ప్రమాణం చేయనున్న మోదీ సందేశాన్ని చేరవేశారు.

Ramoji Rao in Ramoji Film City హైదరాబాద్: ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Cherukuri Ramoji Rao) పార్థీవదేహానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) నివాళులు అర్పించారు. న్యూఢిల్లీ నుంచి వచ్చిన నిర్మలా సీతారామన్ హైదరాబాద్ లో రామోజీ ఫిల్మ్ సిటీకి చేరుకున్నారు. అక్కడ రామోజీరావు పార్థీవదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆమె నివాళులర్పించారు. ప్రధానిగా మరోసారి ప్రమాణం చేయనున్న నరేంద్ర మోదీ సందేశాన్ని రామోజీరావు కుటుంబ సభ్యులకు నిర్మలా సీతారామన్ చేరవేశారు. రెండు రోజుల కిందటే మోదీ ఫోన్ చేసి రామోజీరావు ఆరోగ్యంపై ఆరా తీసినట్లు తెలిపారు. కానీ అంతలోనే విషాదం చోటుచేసుకుందని నిర్మలా సీతారామన్ అన్నారు.

రామోజీరావు మరణం తెలుగు ప్రజలతో పాటు జర్నలిజం రంగానికి తీరని లోటు అన్నారు. పలు రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ సందేశాన్ని చేరడానికి తాను ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. రామోజీరావు జర్నలిజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు. సినిమా రంగంలోనూ నిర్మాతగా ఎన్నో సందేశాత్మక సినిమాలు తీసి తనదైన మార్క్ చూపించారని పలు రంగాల్లో రామోజీరావు సేవల్ని గుర్తుచేశారు. 

రామోజీరావు ఫ్యామిలీకి మోదీ సందేశం.. 
రామోజీరావు మృతి తెలుగు వారికి మాత్రమే కాదు, దేశంలోని మీడియాకు, చిత్రపరిశ్రమకు తీరని లోటు అన్నారు. రామోజీరావు మరణంపై నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని నిర్మలమ్మ చెప్పారు. కుటుంబసభ్యులను కలిసి పరామర్శించాలని, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలపాలని నరేంద్ర మోదీ ఇచ్చిన సందేశాన్ని రామోజీరావు ఫ్యామిలీకి అందించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున తాను ఇక్కడికి వచ్చానని, రామోజీ కుటుంబసభ్యులను పరామర్శించాలని మోదీ తనను ఇక్కడికి పంపించారని చెప్పారు.

రామోజీరావు చేసిన సేవల్ని గుర్తించిన భారత ప్రభుత్వం దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌తో సత్కరించింది. 2016లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులమీదుగా రామోజీరావు పద్మ విభూషణ్‌ను అందుకున్నారని తెలిసిందే.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Assembly: మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
మండలి నుంచి BRS ఎమ్మెల్సీలపై సస్పెన్షన్ వేటు.. గందరగోళం మధ్య నిర్ణయం తీసుకున్న చైర్మన్
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
KCR Disqualification: అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
అసెంబ్లీకి రాని కేసీఆర్ - రేవంత్ అనర్హతా వేటు వ్యూహం అమలు చేస్తారా?
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం

వీడియోలు

కోహ్లీ భాయ్ సెట్ అయితే అంతే ఓటమికి గల కారణాలు చెప్పిన ఇషాన్
IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Gold Man: హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
హైదరాబాద్ గోల్డ్ మ్యాన్ గుట్టురట్టు.. మెరిసేదంతా రోల్డ్ గోల్డ్ అని తేల్చిన ఐటీ అధికారులు
YSRCP Family Politics: కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
కుటుంబ వివాదాలతో రాజకీయం - జగన్ వ్యూహాత్మక తప్పిదం - ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయా?
Andhra Pradesh: ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో శ్రీకారం చుట్టనున్న సీఎం చంద్రబాబు
ఉగాది కానుక.. ఏపీలో 2.5 లక్షల ఇండ్లు పంపిణీ- సూళ్లూరుపేటలో పాల్గొనున్న సీఎం చంద్రబాబు
Sonam Kapoor : రెండోసారి తల్లయిన బాలీవుడ్ హీరోయిన్ - నలుగురితో న్యూ జర్నీ అంటూ...
రెండోసారి తల్లయిన బాలీవుడ్ హీరోయిన్ - నలుగురితో న్యూ జర్నీ అంటూ...
MK Stalin DMK Manifesto: మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
మహిళలు, వృద్ధులకు నెలకు 2000, ఉచిత విద్యుత్, ల్యాప్‌టాప్.. DMK మేనిఫెస్టో విడుదల
Visakhapatnam Crime News: డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
విశాఖలో డీప్ ఫ్రిజ్‌లో డెడ్‌బాడీ.. భార్య లేని సమయంలో ప్రియురాలిని పిలిచి ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
How to Escape from Locked Car: ప్రమాదం తర్వాత మీ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అయితే, బయటపడేందుకు చిట్కాలు
ప్రమాదం తర్వాత మీ కారు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ జామ్ అయితే, బయటపడేందుకు చిట్కాలు
MLA Rajgopal Reddy: నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
నిధులన్నీ సీఎం, మంత్రుల నియోజకవర్గాలకే! ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసహనం
Embed widget