అన్వేషించండి

Governor Vs TRS Govt : గవర్నర్ గతాన్ని మర్చిపోకండి - తమిళి సై వక్ర బుద్ధితో మాట్లాడారు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Governor Vs TRS Govt : తెలంగాణలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం నడుస్తోంది. తాను తలచుకుంటే అసెంబ్లీ రద్దు అయ్యేదని గవర్నర్ తమిళి సై అంటే గతం మర్చిపోకండి అని మంత్రులు అంటున్నారు.

Governor Vs TRS Govt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గ‌వ‌ర్నర్ త‌మిళి సై చేసిన వ్యాఖ్యల‌ను మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ఖండించారు. నేను త‌ల‌చుకుంటే అసెంబ్లీ ర‌ద్దు అయ్యేది అనే విధంగా త‌న‌ ప‌రిధి దాటి వ్యాఖ్యలు చేశార‌ని, ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తులు అలాంటి వ్యాఖ్యలు చేయ‌డం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్‌ రాంలాల్‌ కూలదోసిన త‌ర్వాత ఎలాంటి ప్రజాగ్రాహాన్ని చ‌విచూశారో మ‌నంద‌రికీ తెలిసిందేనన్నారు. గతంలో గ‌వ‌ర్నర్ గా ఉన్న న‌ర‌సింహన్ గౌర‌వ‌ప్రదంగా వ్యవ‌హ‌రించార‌ని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయ‌న్ను అంతే గౌర‌వించింద‌ని పేర్కొన్నారు. గ‌వర్నర్ త‌మిళి సై త‌న గౌర‌వాన్ని కాపాడుకోవాల‌ని సూచించారు. ప్రోటోకాల్ పాటించ‌లేద‌ని చెప్పడం అర్ధర‌హిత‌మ‌ని, ఎక్కడ ఎవ‌రు ఎలా అవ‌మానించారో చెప్పాల‌న్నారు. యాదాద్రి ప‌ర్యట‌న‌కు 20 నిమిషాల ముందే రాజ్ భ‌వ‌న్ నుంచి సమాచారం అందిందన్నారు. అయిన‌ప్పటికీ య‌దగిరిగుట్ట  చైర్మన్ గ‌వ‌ర్నర్ త‌మిళి సైకి స్వాగ‌తం ప‌లికార‌న్నారు. గ‌తంలో  బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలుగా ప‌ని చేసిన‌ తమిళి సై  బీజేపీకి అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని తెలిపారు.

గవర్నర్ చరిత్ర మర్చిపోకూడదు 

"గవర్నర్ తమిళి సై దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసిన తర్వాత వక్రబుద్ధితో మాట్లాడుతున్నారు. ఒక మహిళా గవర్నర్ ను అవమానపరిచారని ఆరోపిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ అసెంబ్లీని రద్దు చేసేదానిని అన్నారు. గవర్నర్ చరిత్ర మర్చిపోకూడదు. ఎన్టీఆర్ ప్రభుత్వంపై అప్పటి గవర్నర్ రాంలాల్ చేసిన పనికి ప్రజాగ్రహానికి గురయ్యారన్నారు. గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి సహకరించి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులు అయ్యారు. ఆయనను ప్రభుత్వం కూడా అంతే మర్యాదగా చూసుకుంది. ప్రొటోకాల్ పాటించాలంటే కొన్ని గంటల ముందు చెప్పాలి. గతంలో గవర్నర్ పదవులకు ఐపీఎస్, ఐఏఎస్, ఉన్నత స్థాయిల్లో ఉన్న వ్యక్తులను నియమించేవారు. కానీ బీజేపీ వచ్చాక ఆ పార్టీ నేతలను నియమిస్తున్నారు. తమిళి సై తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతను నిర్వహించారు. గవర్నర్ కు రాజ్యాంగ పరంగా ఉన్న గౌరవం ఇస్తాం. మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి" అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 

ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ 

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం అంతకంతకూ ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తనను తీవ్రంగా అవమానిస్తోందని కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని తమిళి సై ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఫిర్యాదు చేశారు. అమిత్ షాతో ఏం చర్చించారో బయటకు చెప్పలేనని మీడియాతో గవర్నర్ చెప్పినప్పటికీ తర్వాత కొన్ని విషయాలు మీడియాకు లీక్ అయ్యాయి. తెలంగాణలో పరిస్థితులపై గవర్నర్ పూర్తి స్థాయి నివేదికను అమిత్ షాకు అందించినట్లుగా తెలుస్తోంది.  ముఖ్యంగా తెలంగాణలో డ్రగ్స్ కేసుల్లో సెలక్టివ్‌గా దాడులు చేస్తున్నారని.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ పిల్లలకు చాలా ప్రమాదకరమైనవని.. ఓ తల్లిగా బాధపడుతూ ఈ విషయం చెబుతున్నానన్నారు. అలాగే తెలంగాణలో అవినీతి ఇతర అంశాలను కూడా నివేదికలో గవర్నర్ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
KCR Vs Revanth: రేవంత్ అసెంబ్లీ సవాల్ - కేసీఆర్‌ వెళ్తారా?
రేవంత్ అసెంబ్లీ సవాల్ - కేసీఆర్‌ వెళ్తారా?
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
Telangana Assembly Sessions: ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Embed widget