అన్వేషించండి

Governor Vs TRS Govt : గవర్నర్ గతాన్ని మర్చిపోకండి - తమిళి సై వక్ర బుద్ధితో మాట్లాడారు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Governor Vs TRS Govt : తెలంగాణలో గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం నడుస్తోంది. తాను తలచుకుంటే అసెంబ్లీ రద్దు అయ్యేదని గవర్నర్ తమిళి సై అంటే గతం మర్చిపోకండి అని మంత్రులు అంటున్నారు.

Governor Vs TRS Govt : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గ‌వ‌ర్నర్ త‌మిళి సై చేసిన వ్యాఖ్యల‌ను మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ఖండించారు. నేను త‌ల‌చుకుంటే అసెంబ్లీ ర‌ద్దు అయ్యేది అనే విధంగా త‌న‌ ప‌రిధి దాటి వ్యాఖ్యలు చేశార‌ని, ఉన్నతమైన హోదాలో ఉన్న వ్యక్తులు అలాంటి వ్యాఖ్యలు చేయ‌డం సరికాదన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని నాటి గవర్నర్‌ రాంలాల్‌ కూలదోసిన త‌ర్వాత ఎలాంటి ప్రజాగ్రాహాన్ని చ‌విచూశారో మ‌నంద‌రికీ తెలిసిందేనన్నారు. గతంలో గ‌వ‌ర్నర్ గా ఉన్న న‌ర‌సింహన్ గౌర‌వ‌ప్రదంగా వ్యవ‌హ‌రించార‌ని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయ‌న్ను అంతే గౌర‌వించింద‌ని పేర్కొన్నారు. గ‌వర్నర్ త‌మిళి సై త‌న గౌర‌వాన్ని కాపాడుకోవాల‌ని సూచించారు. ప్రోటోకాల్ పాటించ‌లేద‌ని చెప్పడం అర్ధర‌హిత‌మ‌ని, ఎక్కడ ఎవ‌రు ఎలా అవ‌మానించారో చెప్పాల‌న్నారు. యాదాద్రి ప‌ర్యట‌న‌కు 20 నిమిషాల ముందే రాజ్ భ‌వ‌న్ నుంచి సమాచారం అందిందన్నారు. అయిన‌ప్పటికీ య‌దగిరిగుట్ట  చైర్మన్ గ‌వ‌ర్నర్ త‌మిళి సైకి స్వాగ‌తం ప‌లికార‌న్నారు. గ‌తంలో  బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షురాలుగా ప‌ని చేసిన‌ తమిళి సై  బీజేపీకి అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని తెలిపారు.

గవర్నర్ చరిత్ర మర్చిపోకూడదు 

"గవర్నర్ తమిళి సై దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసిన తర్వాత వక్రబుద్ధితో మాట్లాడుతున్నారు. ఒక మహిళా గవర్నర్ ను అవమానపరిచారని ఆరోపిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ అసెంబ్లీని రద్దు చేసేదానిని అన్నారు. గవర్నర్ చరిత్ర మర్చిపోకూడదు. ఎన్టీఆర్ ప్రభుత్వంపై అప్పటి గవర్నర్ రాంలాల్ చేసిన పనికి ప్రజాగ్రహానికి గురయ్యారన్నారు. గవర్నర్ నరసింహన్ ప్రభుత్వానికి సహకరించి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యులు అయ్యారు. ఆయనను ప్రభుత్వం కూడా అంతే మర్యాదగా చూసుకుంది. ప్రొటోకాల్ పాటించాలంటే కొన్ని గంటల ముందు చెప్పాలి. గతంలో గవర్నర్ పదవులకు ఐపీఎస్, ఐఏఎస్, ఉన్నత స్థాయిల్లో ఉన్న వ్యక్తులను నియమించేవారు. కానీ బీజేపీ వచ్చాక ఆ పార్టీ నేతలను నియమిస్తున్నారు. తమిళి సై తమిళనాడులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతను నిర్వహించారు. గవర్నర్ కు రాజ్యాంగ పరంగా ఉన్న గౌరవం ఇస్తాం. మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి" అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 

ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ 

తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం అంతకంతకూ ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తనను తీవ్రంగా అవమానిస్తోందని కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని తమిళి సై ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఫిర్యాదు చేశారు. అమిత్ షాతో ఏం చర్చించారో బయటకు చెప్పలేనని మీడియాతో గవర్నర్ చెప్పినప్పటికీ తర్వాత కొన్ని విషయాలు మీడియాకు లీక్ అయ్యాయి. తెలంగాణలో పరిస్థితులపై గవర్నర్ పూర్తి స్థాయి నివేదికను అమిత్ షాకు అందించినట్లుగా తెలుస్తోంది.  ముఖ్యంగా తెలంగాణలో డ్రగ్స్ కేసుల్లో సెలక్టివ్‌గా దాడులు చేస్తున్నారని.. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ పిల్లలకు చాలా ప్రమాదకరమైనవని.. ఓ తల్లిగా బాధపడుతూ ఈ విషయం చెబుతున్నానన్నారు. అలాగే తెలంగాణలో అవినీతి ఇతర అంశాలను కూడా నివేదికలో గవర్నర్ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం.. మే 28న సిద్ధరామయ్య రాజీనామా!
 Nara Lokesh Big Announcement: మహిళలకు 33శాతం సీట్లు  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన లోకష్
మహిళలకు 33శాతం సీట్లు..!  మహానాడులో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టిన నారాలోకేష్
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Allu Arjun: అల్లు అర్జున్ అభిమానికి AAFA సాయం... సర్జరీ కోసం డబ్బులు, బన్నీ వాసు భరోసా
అల్లు అర్జున్ అభిమానికి AAFA సాయం... సర్జరీ కోసం డబ్బులు, బన్నీ వాసు భరోసా

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mahesh Babu: 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Driving Without Insurance: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
AP FDC Chairman: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
Embed widget