By: ABP Desam | Updated at : 07 Sep 2022 08:29 PM (IST)
నాగార్జు సాగర్ ఎడమ కాలువకు గండి
నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడింది. దీంతో నల్గొండ జిల్లా నిడమనూరు మండలం భయంగుప్పెట్లో ఉంది. ఇప్పటికే మూడు గ్రామాలు నీట మునిగాయి. ఇప్పుడు మరిన్ని గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరిక అందరినీ కంగారు పెట్టిస్తోంది.
ముప్పారం సమీపంలో సాగర్ ఎడమ కాలువక గండి పడింది. మట్టికట్ట బలహీన పడటం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగే సమయంలో కాల్వలోకి సుమారు ఏడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు తెలుస్తోంది. స్థానిక రైతు ఇచ్చిన సమాచారంతో అధికారులకు అసలు విషయం తెలిసింది. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. నీటి విడుదల ఆపేశారు.
సాగర్ కాల్వకు నీటి విడుదల గత నెల జులై 28 నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు విడుదల చేసిన నీరు పూర్తిగా గండి ద్వారానే వృథా అయ్యే అవకాశం ఉంది. శివారు ప్రాంతంలో ఉన్న పొలాల కోసం నీటిని విడుదల చేశారు. ఇప్పుడు ఆ నీరు ఆ రైతులకు చేరక పోగా... గండిపడిన ప్రాంతంలోని పొలాలు మునిగిపోయాయి. నీట మునిగి పొలాల్లో ఉన్న వరి నాట్లు పూర్తిగా మునిగిపోతే చాలా నష్టపోతామంటున్నారు రైతులు. ఇంకా ఎన్ని ప్రాంతాల్లో పొలాలు నీట మునుగుతాయో అనే టెన్షన్ రైతులను వెంటాడుతోంది. ఇప్పటికే వందల ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
TS Elections: తెలంగాణ ఎన్నికలు, విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు, ఉత్తర్వులు జారీ
Telangana Elections 2023 Live News Updates: తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం, మూగబోయిన మైకులు
Elections 2023 News: సోషల్ మీడియాలోనూ పొలిటికల్ యాడ్స్ నో పర్మిషన్, ఇక్కడ మాత్రమే చేసుకోవచ్చు - వికాస్ రాజ్
MLC Kavitha News: ఎమ్మెల్సీ కవిత దెబ్బకు అక్కడ బీజేపీ అంతా ఖాళీ! 70కి పైగా రోడ్ షోలు, యాత్రలు
Revanth Reddy: ఈసారి కాంగ్రెస్ గెలుపే టార్గెట్! 63 నియోజకవర్గాలు, 87 సభల్లో రేవంత్ రెడ్డి ప్రచారం
Uttarakhand Tunnel Rescue: టన్నెల్ రెస్క్యూ పనులు పూర్తి, మరికాసేపట్లో బయటకు రానున్న 41మంది కార్మికులు: సీఎం ధామి
Telangana Elections 2023 : కేటీఆర్ ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూకుడు - అంతా తానై నడిపించిన వర్కింగ్ ప్రెసిడెంట్ !
Mansoor Ali Khan: పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
Telangana Elections Holiday: పోలింగ్ రోజు సెలవు ఇవ్వని కంపెనీలపై చట్ట ప్రకారం చర్యలు: సీఈవో వికాస్ రాజ్
/body>