అన్వేషించండి

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు అమ్ముడుపోవడం అలవాటు, అదీ వాళ్ల చరిత్ర: మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

Munugodu Bypoll: అమ్ముడుపోవడం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు అలవాటేనంటూ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆనాడు తెలంగాణ ఉద్యమం సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి పంచన చేరి తెలంగాణకు ద్రోహం చేశారని, రాష్ట్ర ప్రజలు ఇది ఎన్నటికీ గుర్తుంచుకుంటారంటూ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. అమ్ముడుపోవడం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలకు అలవాటేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం ముష్టిపల్లిలో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దాసరి లక్ష్మయ్య, ఆయన అనుచరులు మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 

తమ సొంత జిల్లా నల్గొండకు రావాల్సిన కృష్ణా జలాలను నాటి సీఎం వైఎస్సార్ తన సొంత జిల్లా కడపకు తరలించుకుపోతుంటే కోమటిరెడ్డి సోదరులు ఏం చేశారని మంత్రి జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం పదవుల కోసం సోదరులిద్దరూ పెదవి విప్పలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా అనేది కేవలం కాంట్రాక్టుల కోసమేనని మునుగోడు ప్రజలు గమనించారని చెప్పారు. ఇలాంటి నేతల్ని నమ్ముకున్న వారికి ఏ మేలు జరగదని, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి.. ఇటీవల బీజేపీలో చేరడం తెలిసిందే. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ ఎంపీగా కొనసాగుతున్నారు.

కూసుకుంట్ల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి
మునుగోడు అభివృద్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే జరిగింది ఎన్నికల్లో ఓడిపోయినప్పటికి నియోజకవర్గ సమస్యల గురుంచి ఒక 300 సార్లు నా దగ్గరికి వచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారి కూడా నిధుల కోసం రాలేదన్నారు జగదీశ్ రెడ్డి. ముష్టిపల్లిలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌, టీఆర్ఎస్ మునుగోడు ఇన్‌ఛార్జి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వరరెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో వెనకేసిన అవినీతి సొమ్ముతో మునుగోడు ప్రజలను కొనుగోలు చేయాలని చూస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇప్పటికే ప్రజలకు గోడ గడియారాలు పంచుతున్నారని, మునుగోడు ప్రజలకు ఇంటికి కిలో బంగారం ఇచ్చినా సరే టీఆర్ఎస్ ను ప్రజలు ఓడిస్తారని కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు భయం మొదలైందని మొన్నటి మునుగోడు సభతో తేలిపోయిందని చెప్పారు. పొలాల్లో బోర్లకు మీటర్లు పెడతారంటూ రైతులను భయపెడుతున్నారని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనను అంతం చేయడం కోసం చేస్తున్న ధర్మయుద్ధంలో మునుగోడు ప్రజలే చివరికి విజయం సాధిస్తారని చెప్పారు.  
 Also Read: Komatireddy Rajagopal: గడియారాలు కాదు, కిలో బంగారం ఇచ్చినా ఓటమే! కేసీఆర్‌లో భయం - కోమటిరెడ్డి వ్యాఖ్యలు 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
NEET UG 2026 Counselling: ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
ఎంబీబీఎస్‌ ఆల్‌ ఇండియా కోటా కౌన్సెలింగ్‌ నేటి నుంచి ప్రారంభం! కొత్త రూల్స్‌ ఇవే!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Embed widget