అన్వేషించండి

Bandi Sanjay: సంతలో పశువుల్లా అమ్ముడుపోయే ఆ ఎమ్మెల్యేలు ఆణిముత్యాలట: బండి సంజయ్ ఫైర్

టోపీ పెట్టుకని వచ్చి గప్పాలు కొట్టి ప్రజల నెత్తిన టోపీ పెట్టి పోయారని, మునుగోడు ప్రజలకిచ్చిన హామీలను ప్రస్తావించకుండానే సీఎం కేసీఆర్ పారిపోయారని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

మునుగోడు ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్/ బీఆర్ఎస్ కు సమాధిరాయి కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. మునుగోడు ప్రజలకిచ్చిన హామీలను ప్రస్తావించకుండానే సీఎం కేసీఆర్ పారిపోయారని ఎద్దేవా చేశారు. టోపీ పెట్టుకని వచ్చి గప్పాలు కొట్టి ప్రజల నెత్తిన టోపీ పెట్టి పోయారన్నారు. మోటార్లకు మీటర్ల సాకుతో మునుగోడు ఎన్నికలు అయిపోగానే మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచి రాష్ట్ర ప్రజలపై భారం మోపేందుకు సీఎం కేసీఆర్ స్కెచ్ వేశారని బండి వ్యాఖ్యానించారు. వంద కోట్లు పెట్టి ఆ ఎమ్మెల్యేలను కొంటారట.. వాళ్లు ఆణిముత్యాలట. వాళ్లంతా సెకండ్ హ్యాండ్ గాళ్లు.. ఇతర పార్టీల నుండి గెలిచి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయినోళ్లు... అసలా ఎమ్మెల్యేలను స్వేచ్ఛగా ఎందుకు వదిలేయడం లేదో ప్రజలకు చెప్పాలని కేసీఆర్ ప్రశ్నించారు.

మునుగోడు ప్రజలు గాడిదలెవరో, ఆవు ఎవరో నిర్ణయించుకున్నారని.. గాడిదలాంటి టీఆర్ఎస్ కు ఓటేయబోరన్నారు. టీఎన్జీవో నేతలు కొందరు టీఆర్ఎస్ కు మద్దతివ్వడంపట్ల బండి సంజయ్ మండిపడ్డారు.. ‘‘ఉద్యోగులను ఏం ఉద్దరించారని మద్దతు తెలుపుతున్నారు? 317 జీవోతో చెట్టుకొకరు పుట్టకొకరని చేసినందుకా? జీతాలే ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నందుకా?‘’అంటూ ప్రశ్నించారు.  మర్రిగూడలోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం, రాష్ట్ర అధికార ప్రతినిధులు సీహెచ్.విఠల్, జె.సంగప్ప, ఐటీ విభాగం కన్వీనర్ వెంకటరమణ, రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. పెట్రోలు, డీజిల్ ధరల గురించి మాట్లాడుతున్న కేసీఆర్.... వ్యాట్ పేరుతో లీటర్ పెట్రోలుపై రూ.30లు ఎందుకు దొబ్బుతున్నారు. వ్యాట్ పేరుతో ఏటా రూ.10 వేల కోట్లు ఎందుకు దోచుకుంటున్నవ్? నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే ఎందుకు తగ్గించవు? అని ప్రశ్నించారు బండి సంజయ్.
బండి సంజయ్ ప్రస్తావించిన అంశాలివే..
 -  ‘ఈరోజు కేసీఆర్ మళ్లీ కోతలు కోసిండు.... మునుగోడు ఎన్నికలున్నందున నియోజకవర్గానికి ఏం చేశావో చెప్పమని అడిగనం... కానీ ఆ ఊసే ఎత్తలేదు. గతంలో ఇచ్చిన హామీలతోపాటు మొన్న ఇచ్చిన హామీల గురించి మాట్లాడలేదు. గౌడ కులస్తుల గురించి ప్రస్తావనే లేదు. బెల్టు షాపులు పెట్టి, డ్రంకన్ అండ్ డ్రైవ్ పెట్టి వాళ్ల వ్రుత్తులు దెబ్బతీస్తావేమో... యాదవుల సమస్యలు మాట్లాడలేదు.. అంటే మొన్న అకౌంట్లో వేసిన గొర్ల పథకం పైసలు వాపస్ తీసుకుంటాడేమో.. వడ్డెరలు, విశ్వకర్మలు, ఎస్టీ, ఎస్టీల ప్రస్తావనే లేదు. కుమ్మరి, కమ్మరి సహా ఎవరి గురించి ప్రస్తావించలే. అంటే ఆ కులాలకు ఏమీ చేయనని చెప్పేసిండు.. కేసీఆర్ ముఖంలో భయం కన్పిస్తోంది. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నడు.. 

-  చేనేతల గురించి ప్రస్తావించిన కేసీఆర్... చేనేత సహకార ఎన్నికలు ఎందుకు జరపడం లేదు. నూలు వస్త్రాల రంగులపై 50 శాతం సబ్సిడీ ఏమైంది? చేనేత బంధు ఎంతమందికి ఇచ్చిండో చెప్పలేదు. జీఎస్టీ గురించి కేంద్రం నిర్వహించిన సమావేశంలో ఎందుకు మాట్లాడలేదు? జీఎస్టీ వేయాలని మంత్రి హరీష్ రావు చెప్పిన విషయం మర్చిపోయినవా?
-  శివన్నగూడెం, రోడ్లన్నీ చిన్న చిన్నపనులట... 15 రోజుల్లో గెలిపిస్తారట... అంత చిన్నవైతే 8 ఏళ్లుగా ఎందుకు పూర్తి చేయలేదు. అన్నీ అబద్దాలే... చివరకు ‘‘సూడు సూడు నల్లగొండ... గుండెపైన ఫ్లోరైడ్ బండ’’ నేనే రాసినని సిగ్గు లేకుండా కేసీఆర్ చెప్పుకుండు.. ఆ పాట రాసింది కోదాటి శ్రీను... అయినా సిగ్గు, శరం లేకుండా నేనే రాసినని అబద్దాలు చెప్పిండు..
-  మరి డబుల్ బెడ్రూం ఇండ్లు, దళిత బంధు, దళితులకు మూడెకరాలు ఎందుకు ఇయ్యలే? ఉద్యోగాలెందుకు ఇయ్యలే. ఈడ ఉద్యోగాలు రాక వేలాదిమంది యువత డ్రైవర్లుగా హైదరాబాద్ వలసపోయిండ్రు.
-  శివన్నగూడెం రిజర్వాయర్ పనులను కేంద్రం ఆపిందని పచ్చి అబద్దాలు వల్లించిండు... ఇప్పుడేమో 15 రోజుల్లో పూర్తి చేస్తానని కథలు చెబుతున్నడు. కిష్టరాంపల్లి, డిండి ప్రాజెక్టులు ఏమైనయ్... పాలమూరు-రంగారెడ్డి ఏమైంది? 
-  ఫ్లోరైడ్ సమస్యపైనా అబద్దాలు చెప్పిండు... క్రిష్ణా జలాలను హైదరాబాద్ తీసుకుపోయే సమయంలో మునుగోడు సహా ఫ్లోరోసిస్ ప్రాంతాలకు తెలంగాణ రాకముందే నీళ్లు వచ్చినయ్..
-  నువ్వు ఇంఛార్జ్ గా ఉన్న లెంకలపల్లి గ్రామ ప్రజలంతా ఆర్వో ప్లాంట్ ద్వారా నీళ్లు తాగుతున్నరు. మరి నీ మిషన్ భగీరథ నీళ్లు యాడికి పోయినయ్...
-  కేసీఆర్... ఈ సారైనా హామీలన్నీ అమలు చేస్తారేమో.. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానంటాడేమో అనుకున్న... టీఆర్ఎస్ అభ్యర్ధి ప్రజల్లో ఉంటాడట... అసలాయన అందుబాటులోనే ఉండరు. ఆయన ప్రజల్లో ఉంటే ఓట్లు కూడా పడవు.. ఆయన వస్తుంటేనే ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకునే దుస్థితి.
-  ఈరోజు కేసీఆర్ టోపీ పెట్టుకుని వచ్చిండు.. ప్రజలకు టోపీ పెట్టి పోయిండు. ఇన్నాళ్లు 4గురు ఎమ్మెల్యేలను ప్రగతి భవన్ లో గంప కింద కోడిలాగా కప్పిపెట్టిండు... యాడ పారిపోతరో.. నిజాలు ఎక్కడ బయటపడతాయోనని... సర్కస్ లో, జూలో జంతువులను పట్టుకొచ్చినట్లుగా ఇయాళ సభకు తీసుకొచ్చి మళ్లీ వెంట బెట్టుకుపోయిండు..
ఆ ఎమ్మె్ల్యేలు టీఆర్ఎస్ కు అమ్ముడుపోయినోళ్లు..
-  వంద కోట్లు పెట్టి ఆ ఎమ్మెల్యేలను కొంటారట.. వాళ్లు ఆణిముత్యాలట... వాళ్లంతా సెకండ్ హ్యాండ్ గాళ్లు... ఇతర పార్టీల నుండి గెలిచి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయినోళ్లు... అసలా ఎమ్మెల్యేలను స్వేచ్ఛగా ఎందుకు వదిలేయడం లేదు? 
-  సీబీఐ విచారణ జరగకుండా 51 జీవో ఎందుకు తీసుకొచ్చినవ్? అంత భయమెందుకు? తప్పు చేయకుంటే విచారణ జరిపించాలి కదా....
-  గత 8 ఏండ్లలో 36 కాదు.. 37 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువు లెక్క కొన్నది నువ్వు. ప్రతి ఏటా వడ్లు కొనేది ముమ్మాటికీ కేంద్రమే. పైసలిచ్చేది కేంద్రమే... కేసీఆర్ మాత్రం సంతలో పశువుల లెక్క ఎమ్మెల్యేలను కొంటున్నడు..
-  వడ్లు కేంద్రం కొనడం లేదు... కేంద్రం పైసలియ్యడం లేదని దమ్ముంటే ప్రమాణం చెయ్...మోటార్లకు మీటర్లట.. యాడ పెట్టినం? దుబ్బాకలో, హుజూరాబాద్ లో పెట్టినమా? మేం గెలిచిన చోట ఏమైనా పెట్టినమా? 
-  మోటార్లకు మీటర్ల సాకుతో మునుగోడు ఎన్నికల తరువాత కరెంట్ ఛార్జీలను కేసీఆర్ మళ్లీ పెంచబోతున్నడు. ఎందుకంటే 70 వేల కోట్ల నష్టాల్లో విద్యుత్ సంస్థలున్నయ్. జీతాలిచ్చే పరిస్థితి లేదు. వాటికి కారణం ముమ్మాటికీ కేసీఆరే... 
-  24 గంటలు కరెంట్ ఇస్తున్ననని గప్పాలు కొడుతుండు.. ఈరోజు మర్రిగూడలో 10 సార్లు కరెంట్ కట్ అయ్యింది. అయినా పచ్చి అబద్దాలు వల్లిస్తుండు..
-  బిడ్డ లిక్కర్ కేసు.. కొడుకు డ్రగ్స్ కేసు... టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయిండ్రు... మంత్రుల ఉంటారో ఉండరో నిత్యం అనుమానమే... సీఎం సీటు కోసం నిత్యం ఇంట్ల గోడవ... ఇవన్నీ దారి మళ్లించేందుకే కేసీఆర్ డ్రామాలు..
-  గాడిదకు గడ్డి వేసి బర్రె పాలియ్యమంటే ఇస్తదా? అన్నవ్ కదా.. అవును.. గాడిద ఎవరో, ఆవు ఎవరో ప్రజలకు తెలిసిపోయింది. మీలాంటి గాడిదలకు ఓటేయబోమని మునుగోడు ప్రజలు డిసైడ్ అయ్యారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.


మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan Targets CM Ramesh | విశాఖ వేదికగా బీజేపీపై జగన్ విమర్శలు..దేనికి సంకేతం..! | ABP DesamBJP MP Candidate Madhavi Latha |అదే మసీదులో ముక్కు నేలకు పెట్టి క్షమాపణలు కోరాలి..! | ABP DesamPawan Kalyan Assets | 5 ఏళ్లలో పవన్ కల్యాణ్ ఆస్తులు 191 శాతం పెరిగాయి.. ఇంత సంపాదన ఎలా వచ్చింది..?Pawan Kalyan Nomination From Pithapuram | పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ నామినేషన్ దాఖలు | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Comments: మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మేడిగడ్డ బ్యారేజీని మేమే రిపేర్ చేయిస్తం, వాళ్లు అడ్డొస్తే తొక్కుకుంటూ పోతాం - కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
YS Sharmila: మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
మోదీ ఎన్ని మంగళసూత్రాలు తెంచారు, జగన్ ఈ ఐదేళ్లు గాడిదలు కాశారా? - షర్మిల హాట్ కామెంట్స్
Tummala Nageswara Rao :  మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
మావోయిస్టుల మద్దతూ కోరుతున్న కాంగ్రెస్ - తెలంగాణ మంత్రి కామెంట్స్ వైరల్
IPL 2024: సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
సెంచరీతో రుతురాజ్‌ కెప్టెన్ ఇన్నింగ్స్‌, లక్నో లక్ష్యం 211
Pawan Kalyan Assets: నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ - అప్పులు రూ.64.26 కోట్లు, ఆస్తుల మాటేంటి!
Top 5 K Dramas: కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
కొరియన్ డ్రామాలు ఇష్టమా? అయితే ఈ టాప్ 5 లేటెస్ట్ వెబ్ సిరీస్‌లను ట్రై చేయాల్సిందే!
Diamonds in Mumbai: న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
న్యూడిల్స్ ప్యాకెట్‌లో డైమండ్స్, రూ.6 కోట్ల విలువైనవి స్వాధీనం
Pesticides in Protein Powder : మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
మీకు ప్రోటీన్ పౌడర్​ తీసుకునే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.. వాటిలో పురుగులమందులు కలుపుతున్నారట
Embed widget