అన్వేషించండి

Who is Dusharla Satyanarayana: అతడు అడవిని సృష్టించాడు.. ప్రకృతి కోసం ప్రాణాలను సైతం ఎదిరించిన ధీశాలి.. నల్లగొండ వాటర్‌మ్యాన్‌ కథ మీకు తెలుసా..?

నల్గొండ నీటి కష్టాలపై జల సాధన సమితి ద్వారా పోరాడి, తన 70 ఎకరాల భూమిని 5 కోట్ల మొక్కలతో అడవిగా మార్చిన వ్యక్తి దుశర్ల సత్యనారాయణ. ప్రకృతి కోసం ఆయన త్యాగాలు ఎంతో స్ఫూర్తిదాయకం.

Satyanarayana JSS Founder | తెలంగాణకు చెందిన ప్రముఖ వ్యక్తి, ప్రకృతి ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ పేరు గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, ప్రకృతి మీద ప్రేమతో ఉద్యోగానికి రాజీనామా చేసి, ఓ అడవినే సృష్టించిన గొప్ప మనసున్న వ్యక్తిగా పేరుగాంచారు. కానీ 72 ఏళ్ల ప్రకృతి ప్రేమికుడు, నల్గొండ వాటర్ మ్యాన్‌గా పేరుగాంచిన దుశర్ల సత్యనారాయణపై ఇటీవల దాడి జరిగింది. తన అడవిలో చెట్లను నరుకుతున్న వారిని అడ్డుకున్నందుకు, పొరుగు గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆయనపై విచక్షణారహితంగా దాడి చేశారు. గాయపడిన ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన సేవల్ని గుర్తించిన వారు, తెలిసిన వారు దుశర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన గొప్పతనం తెలిస్తే అలా దాడిచేసే వారు కాదని అంటున్నారు.

బ్యాంకు జాబ్ మానేసి సమాజసేవకు అంకితం 
1954 మార్చి 12న సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపూర్ గ్రామంలో జన్మించిన దుశర్ల సత్యనారాయణ కేవలం ఒక వ్యక్తిగా కాకుండా ఒక వ్యవస్థగా ఎదిగారు. ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుండి అగ్రికల్చర్ బి.ఎస్.సి పూర్తి చేశారు. మొదట్లో ఆంధ్రా బ్యాంక్, తరువాత యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నత ఉద్యోగాలు నిర్వహించారు. అయితే, తన కళ్ల ముందే రైతులు పడుతున్న కష్టాలు, ముఖ్యంగా నల్గొండ జిల్లాను పీడిస్తున్న ఫ్లోరోసిస్, నీటి సమస్యలు ఆయనను నిలకడగా ఉండనివ్వలేదు. 1980లోనే తన ఉద్యోగాన్ని వదిలివేసి, సమాజ సేవకు తన జీవితాన్ని అంకితం చేశారు.


Who is Dusharla Satyanarayana: అతడు అడవిని సృష్టించాడు.. ప్రకృతి కోసం ప్రాణాలను సైతం ఎదిరించిన ధీశాలి.. నల్లగొండ వాటర్‌మ్యాన్‌ కథ మీకు తెలుసా..?

జల సాధన సమితి - ఫ్లోరోసిస్ సమస్యపై పోరాటం
నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య సృష్టిస్తున్న బీభత్సాన్ని చూసి చలించిన దుశర్ల సత్యనారాయణ జల సాధన సమితి (JSS) ని స్థాపించారు. కలుషిత నీటి వల్ల వేలాది మంది ప్రజలు వికలాంగులుగా మారుతుంటే, ప్రభుత్వాల నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయని ఆయన ఎండగట్టారు. 1992లో నల్గొండ నుంచి శ్రీశైలం వరకు, యాదగిరిగుట్ట వరకు పాదయాత్రలు చేపట్టి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చారు. 1996లో నల్గొండ లోక్‌సభ స్థానానికి ఏకంగా 682 మందితో నామినేషన్లు వేయించి, ఎన్నికల సంఘం దిగివచ్చేలా చేశారు. నల్గొండ లోక్‌సభ స్థానానికి ఎన్నికను నెలరోజులకు వాయిదా వేసింది. 

ప్రధాని వాజ్‌పేయిని కదిలించిన దుశ్చర్ల

ఫ్లోరైడ్ బాధితులతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 17సార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టి సమస్యను జాతీయ స్థాయిలో తెలిసేలా చేశారు. ఆయన పోరాటంలో అత్యంత కీలక ఘట్టం, 2003లో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయి ఛాంబర్‌లో ఫ్లోరైడ్ బాధితులు అంశుల స్వామి, కొత్తపల్లి నర్సింహలను టేబుల్‌పై పడుకోబెట్టి సమస్య తీవ్రతను వివరించారు. ఆ సంఘటనతో కదిలిపోయిన ప్రధాని వెంటనే పైపులైన్ పనులకు ఆదేశాలిచ్చారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు విషయంలో దుశర్ల చేసిన పోరాటం మరువలేనిది.

70 ఎకరాల అద్భుత అడవి సృష్టికర్త
దుశర్ల సత్యనారాయణ జీవితంలో మరో అద్భుత ఘట్టం ఆయన 70 ఎకరాల కృత్రిమ అడవిని సృష్టించడం. తనకున్న పూర్వీకుల భూమి 70 ఎకరాలను అడవిగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కోట్ల రూపాయల విలువచేసే భూములను రియల్ ఎస్టేట్ పరం చేయకుండా, అటు వారసులకు కూడా ఇవ్వకుండా దానిని ప్రకృతికి కానుకగా ఇచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి విత్తనాలను సేకరించి తీసుకొచ్చి ఏకంగా 5 కోట్లకు పైగా మొక్కలను నాటిన ఆయన, ఆ భూమిని ఒక అడవిగా, జీవవైవిధ్య కేంద్రంగా మార్చారు. ఈ అడవిలో నెమళ్లు, కోతులు, అడవి పందులు, ముళ్లపందులు సహా 32 రకాలకు పైగా పక్షులు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. కోతుల కోసం ప్రత్యేకంగా సజ్జలు, దుంపలు పండిస్తున్నారు, పక్షుల కోసం ఏడు తామర కుంటలను తవ్వించి వర్షపు నీటిని నిల్వ చేస్తున్నారు. ఈ అడవిలోని ఒక్క పండును కూడా ఆయన వ్యాపారానికి వాడుకోకపోవడం విశేషం. అది కేవలం ప్రకృతికే సొంతం అని ఆయన గట్టిగా నమ్ముతారు. 

దుశ్చర్లకు గుర్తింపు, పురస్కారాలు
పర్యావరణ ప్రేమికుడు దుశర్ల సత్యనారాయణ ప్రకృతి కోసం చేసిన నిస్వార్థ సేవకు గాను అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. 2022లో జాతీయ నదుల పునరుజ్జీవ సదస్సులో నీటి సంరక్షకుడు అవార్డు అందుకున్నారు. 2024లో గవర్నర్ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. తెలంగాణ గవర్నర్‌ అవార్డ్స్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌తో పాటు రూ.2లక్షల నగదును గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ చేతుల మీదుగా అందుకున్నారు. 2025లో సాక్షి ఎక్సలెన్స్ ఇన్ ఎన్విరాన్మెంట్ అవార్డుకు ఎంపికయ్యారు. 

అడవిని రక్షించే ప్రయత్నం చేసిన ఆయనపై దుండగులు దాడి చేయడం దురదృష్టకరం అని చెప్పాలి. పర్యావరణం పట్ల దుశర్ల సత్యనారాయణ చూపిస్తున్న నిబద్ధత రాబోయే తరాలకు ఒక దిక్సూచి వంటిది. వందల కోట్ల ఆఫర్లు వచ్చినా లొంగకుండా ప్రకృతి కోసం తన 70 ఎకరాలను అంకితం చేసిన యోధుడిపై దాడిని అంతా వ్యతిరేకిస్తున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kishan ReddY Latest News:
"రేవంత్ రెడ్డి హయాంలో ప్రశ్నపత్రాల లీకేజ్‌- రాజీనామా చేయాలి" కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ 
Cheruvugattu Fire Accident: చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
చెర్వుగట్టు పుణ్యక్షేత్రంలో భారీ అగ్నిప్రమాదం.. 17 షాపులు దగ్దం- రూ.2.5 కోట్ల ఆస్తి నష్టం
Breaking News: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఆమోదం.. కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి
Breaking News: హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 
హైడ్రాపై హైకోర్టు మరోసారి ఆగ్రహం- అధికారులకు సంకెళ్లు వేయాలని కామెంట్స్ 

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget