అన్వేషించండి

Telangana: రైతు సమస్యలు, కరువుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు

Congress and BRS clash over drought : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు, తూటాలు పేలుతున్నాయి. కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీకి చెందిన మంత్రులు అంతే స్థాయిలో స్పందిస్తున్నారు.

Congress and BRS clash over drought : తెలంగాణలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటలు, తూటాలు పేలుతున్నాయి. రాష్ట్రంలో కరువు తాండవిస్తోందంటూ మాజీ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీకి చెందిన మంత్రులు అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్యటనల్లో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌ సూర్యాపేట, నల్గొండ, జనగామ జిల్లాల్లో పర్యటించి రైతులతో మాట్లాడారు. ఎండిపోయిన పంట పొలాల్లోకి వెళ్లిన కేసీఆర్‌ రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేసీఆర్‌ రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండి రైతన్న కన్నీళ్లు పెడుతుంటే.. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదని విమర్శించారు. రాజకీయాల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. ఢిల్లీ పర్యటనలతో కాలం గడుపుతున్నారంటూ మండిపడ్డారు. అధికారంలో ఉన్నా, లేకపోయినా రైతుల కన్నీళ్లను తుడిచేందుకు, పంట పొలాల్లో గుండె చెదురుతున్న రైతుల్లో ధైర్యాన్ని నింపేందుకు తాము అండగా ఉంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న కేసీఆర్‌.. కాంగ్రెస్‌ పార్టీ తెచ్చిన కరువుగా కేసీఆర్‌ ఆరోపించారు. కేసీఆర్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ మంత్రులు అంతే స్థాయిలో స్పందిస్తున్నారు. 

బీఆర్‌ఎస్‌ చెప్పేవన్నీ అబద్ధాలన్న మంత్రి ఉత్తమ్‌

తెలంగాణలో విద్యుత్‌ కోతలు, కరువుపై బీఆర్‌ఎస్‌ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలేనని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదన్న ఉత్తమ్‌.. కేసీఆర్‌కు పార్టీ మిగలదన్న భయం పట్టుకుందన్నారు. కేసీఆర్‌ కుటటుంబ సభ్యులు తప్ప బీఆర్‌ఎస్‌లో ఎవరూ ఉండరని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు. పార్లమెంట్‌ ఎన్నికల తరువాత బీఆర్‌ఎస్‌ కనుమరుగు అవుతుందన్నారు. విద్యుత్‌ విషయంలో బీఆర్‌ఎస్‌ చెబుతున్నవన్నీ అవాస్తవాలేనన్నారు. జనరేటర్‌ పెట్టుకుని మీటింగ్‌ పెట్టి.. టెక్నికల్‌ ప్రాబ్లం వస్తే కరెంట్‌ పోతే.. దానికి కరెంట్‌ పోయిందని కేసీఆర్‌ అబద్ధం చెప్పారన్నారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్ట్‌ అవుట్‌ డేటెడ్‌ టెక్నాలజీ అని, భద్రాద్రి పవర్‌ ప్రాజెక్ట్‌ వల్ల ప్రజలకే భారమని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. గడిచిన పదేళ్లలో పంట నష్టం జరిగితే కేసీఆర్‌ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఇరిగేషన్‌పై మాట్లాడే అర్హత కేసీఆర్‌కు లేదన్నారు. ప్రాజెక్టులను కేఆర్‌ఎంబీకి అప్పజెప్తామని కేసీఆర్‌ ఒప్పుకున్నారన్నారు. కేసీఆర్‌ ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలపై కుట్ర చేశారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. 

రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అన్న అద్దంకి

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్‌ నేత అద్దంకి దయాకర్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. గడిచిన పదేళ్లలో బయటకు రాని కేసీఆర్‌కు ఇప్పుడే రైతులు గుర్తుకు వచ్చారని విమర్శించారు. గతంలో రైతులు పడుతున్న ఇబ్బందులను కనీసం పట్టించుకోని కేసీఆర్‌.. ఇప్పుడు పొలం బాట పేరుతో హడావిడి చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నేతలు కాంగ్రెస్‌లో చేరుతుండడాన్ని సహించలేక కేసీఆర్‌ ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో పంటలు నష్టపోయిన రైతులకు ఎంత మొత్తాన్ని చెల్లించారో చెప్పాలని అద్దంకి డిమాండ్‌ చేశారు. ఏది ఏమైనా కరువు పేరుతో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీ మధ్య మాటలు, తూటాలు పేలుతున్నాయి.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hyderabad to Kanyakumari Amrit Bharat Express : హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
హైదరాబాద్‌ టూ కన్యాకుమారి; పట్టాలెక్కనున్న మరో అమృత్‌ భారత్‌, పుణ్యక్షేత్రాల దర్శనానికి సరికొత్త మార్గం!
Telangana News: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి ఎండ్ కార్డ్ పడినట్టేనా! సాయంత్రం కీలక పరిణామం!
Gas Price Hike: ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
ఇరాన్- ఇజ్రాయెల్ వార్ ఎఫెక్ట్‌! భారీగా పెరిగిన గ్యాస్‌ ధరలు! మీ ప్రాంతాల్లో ఉన్న రేటు తెలుసుకోండి!
Telangana Latest News: సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
సంక్షేమ పథకాలకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి! కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
T20 World Cup Prize Money: టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
టీమిండియాకు లభించే ప్రైజ్ మనీ ఎంత?.. రన్నరప్ సహా ఇతర జట్ల పరిస్థితి ఏంటీ!
Alcohol Banned Countries : ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
ఈ దేశాలలో మద్యం పూర్తిగా నిషేధం.. కానీ పర్యాటకులు మందు తాగొచ్చు, అదేమి లాజిక్
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
BYD కొత్త టెక్నాలజీ.. బ్లేడ్ బ్యాటరీతో సంచలనం - 5 నిమిషాల్లోనూ ఛార్జింగ్ రికార్డు
Droupadi Murmu Protocol Row: తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
తనను అవమానించారన్న ముర్ము, ప్రధాని మోదీ ఆగ్రహం- ప్రొటోకాల్ ఉల్లంఘించలేదన్న మమతా బెనర్జీ
Anakapalli Crime News: అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
అనకాపల్లి జిల్లాలో 65 తులాల బంగారం, నగదు చోరీ
Cooking Gas Saving Tips : గ్యాస్ ఆదా చేయాలంటే వంట చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఖర్చు తగ్గుతుంది
గ్యాస్ ఆదా చేయాలంటే వంట చేసేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. ఖర్చు తగ్గుతుంది
Vastu Tips : ఇంట్లో డబ్బులు ఉండట్లేదా? కారణాలు ఇవే.. ఈ మార్పులు చేసి చూడండి, ఖర్చులు తగ్గొచ్చు
ఇంట్లో డబ్బులు ఉండట్లేదా? కారణాలు ఇవే.. ఈ మార్పులు చేసి చూడండి, ఖర్చులు తగ్గొచ్చు
Embed widget