అన్వేషించండి

KCR Nalgoda Tour: నేడు నల్గొండకు సీఎం కేసీఆర్ - ఎమ్మెల్యే ఇంట్లో భోజనం, తర్వాత సభకు హాజరు

Nalgonda: ఇటీవల నకిరేకల్​ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ మరణించారు. వారు నిర్వహిస్తోన్న సంతాప సభకు సీఎం కేసీఆర్​​ హాజరవుతారు.

CM KCR Nalgonda Tour: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. నార్కట్ ​పల్లిలో నిర్వహించనున్న ఓ సంతాప సభకు హాజరు అవుతారు. ఇటీవల నకిరేకల్​ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తండ్రి నర్సింహ మరణించారు. వారు నిర్వహిస్తోన్న సంతాప సభకు సీఎం కేసీఆర్​​ హాజరవుతారు. ఇందుకోసం ఈ రోజు (ఏప్రిల్ 28) ఉదయం 11 గంటలకు ఆయన హెలికాప్టర్ ద్వారా ప్రగతి భవన్ నుంచి నార్కట్‌ పల్లికి చేరుకుంటారు.

నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటికి చేరుకొని వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం వారితోనే కలిసి మధ్యాహ్న భోజనం చేస్తారు. సంతాప సభలో పాల్గొన్న అనంతరం తిరిగి హైదరాబాద్‌ కు బయలుదేరతారు. సీఎం కేసీఆర్‌ వెంట మంత్రులు జగదీశ్‌ రెడ్డి, నిరంజన్‌రెడ్డి, నల్గొండ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక నేతలు ఉండనున్నారు.

దేశ రాజకీయాలపై కేసీఆర్ నజర్

దేశానికి కావాల్సింది ఫ్రంట్‌లు.. టెంట్‌లు కాదని రాజకీయ ఎజెండాలోనే పెను మార్పులు రావాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో దేశ రాజకీయాల్లో తన పాత్ర ఖచ్చితంగా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణా ఉద్యమంలా దేశ రాజకీయాల్లో టీఆర్ ఎస్ ముందుకు వెళ్ళడం ఖాయమని కేసీఆర్ ధఈమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఆర్థిక పరిస్థితిపై సీఎంకేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క పిలుపు ఇస్తే రూ. ఆరు వందల కోట్ల విరాళాలు వస్తాయన్నారు. ఇప్పటికే పార్టీకీ అద్భుతమైన నిధులు సమకూర్చుకున్నామని ప్రకటించారు. 865 కోట్ల నిధులు టీఆర్ ఎస్ ఖాతాలో ఉన్నాయని కేసీఆర్ ప్రకటించారు. ఈ నిధుల్ని ఎస్‌బీఐ , బ్యాంక్ ఆఫ్ బరోడాలో దాచామని కేసీఆర్ ప్రకటించారు. మిగిలినవి స్థిరాస్థి రూపంలో ఉన్నాయి. ఢిల్లీలో తెలంగాణా భవనం సిద్ధం కాబోతోందని ప్రకటించారు. మొత్తంగా టీఆర్ఎస్‌కు రూ. వెయ్యి కోట్ల ఆస్తులున్నాయన్నారు. 

టీఆర్ఎస్ విజయంపై వస్తున్న  కారు కూతలు పట్టించుకోవద్దని కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే.. ఏ మాత్రం సందేహం వద్దన్నారు. కన్సల్టెంట్ ను పెట్టుకున్నామని.. వారు చేసిన సర్వేలోనే 90 సీట్లు వస్తాయని తేలిందన్నారు.  భారత దేశంలోనే తెలంగాణా ధనిక రాష్ట్రం కాబోతోందని ప్రకటించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కసారి కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచలేదని కానీ కేంద్రమే పదే పదే టాక్సులు పెంచిందన్నారు. అదే పనిగా ఎక్సైజ్ టాక్స్‌ను పెంచిన కేంద్రం ఇప్పుడు  రాష్ట్రలను ట్యాక్స్ తగ్గించమని అడగటం సిగ్గు చేటని మండిపడ్డారు. కరోనాపై మీటింగ్ పెట్టి పెట్రోల్, డీజిల్‌పై టాక్స్‌లు తగ్గించాలని కోరడంఏమిటని ప్రశ్నించారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana RTC Protest : మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
మార్చి 26 నుంచి ఆర్టీసీ బస్‌లకు బదులు రోడ్డెక్కనున్న సిబ్బంది! 31 డిమాండ్‌లతో సర్కారుకు సమ్మె నోటీసు!
RGUKT Admissions 2026: తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
తెలంగాణ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ అడ్మిషన్లు సందడి షురూ! 2026-27 విద్యాసంవత్సర షెడ్యూల్ విడుదల!
Telangana Tenth Class Exams: తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
తెలంగాణ పదో తరగతి పరీక్షలకు అంతా సిద్ధం! ఈ రూల్స్ తెలుసుకోకుంటే ఎగ్జామ్ రాయలేరు!
Supreme Court: తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్‌! ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు! బీఆర్‌ఎస్‌కు షాక్!
తెలంగాణ స్పీకర్ నిర్ణయమే ఫైనల్‌! ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ ముగించిన సుప్రీంకోర్టు! బీఆర్‌ఎస్‌కు షాక్!

వీడియోలు

Gas Cylinders Effect | హాస్టల్స్ లో వివాదంగా మారిన సాంబార్ రైస్..! వెరైటీ టిఫిన్స్ బంద్ | ABP Desam
Josh Hazlewood to Miss IPL 2026 | ఐపీఎల్ 2026కు స్టార్ పేసర్ దూరం? | ABP Desam
Surya Kumar Yadav Apologizes to Axar Patel | అక్షర్ పటేల్‌కు క్షమాపణలు చెప్పిన సూర్య | ABP Desam
Did Dhoni Ruin Yuvraj Singh’s Career? | యువరాజ్ కెరీర్‌ను ధోనీ నాశనం చేశాడా? | ABP Desam
IPL 2026 First Phase Schedule | ఐపీఎల్ 2026 సమరానికి షెడ్యూల్ ఖరారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Srikakulam Latest News: ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
ఉద్దానానికి కొత్త ఊపిరి! పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌లో తొలి కిడ్నీ మార్పిడి విజయవంతం!
Kakinada Latest News:కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
కాకినాడ జిల్లాలో పులి కలకలం: మన్యం ఊళ్లలో గుబులు- బయటకు రావాలంటే వణుకుతున్న జనం!
Ram Gopal Varma : అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
అమితాబ్ 'సర్కార్ 4'పై బిగ్ అప్డేట్ - ఆ సినిమా నా పాపాలన్నీ కడిగేస్తుంది... రామ్ గోపాల్ వర్మ
Iran Warns US: ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
ఖార్గ్ ద్వీపంపై దాడి తర్వాత రగిలిపోతున్న ఇరాన్! చమురు ఉత్పత్తి కేంద్రాలను టచ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక! 
Jason Sanjay: దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
దళపతి విజయ్‌కు షాక్ ఇవ్వబోతున్న కొడుకు... జాసన్ సంజయ్ అంత పని చేస్తాడా?
Pithapuram Latest News: చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
చంద్ర‌బాబుకే గుర్తింపు లేదంటే ఇక మా ప‌రిస్థితేంటి? పిఠాపురంలో వర్మకు మళ్లీ కోపమొచ్చింది! 
Vijay Sethupathi: 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ... విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే?
200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ... విజయ్ సేతుపతి ఏం చెప్పారంటే?
Dhanush D56 Movie : ధనుష్ మూవీలో డ్రాగన్ బ్యూటీ? - క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా...
ధనుష్ మూవీలో డ్రాగన్ బ్యూటీ? - క్రేజీ ఆఫర్ కొట్టేసిందిగా...
Embed widget