అన్వేషించండి

Revanth Reddy : రాజగోపాల్ రెడ్డి చరిత్రహీనుడు, కాంట్రాక్ట్ ఒప్పందాల కోసమే బీజేపీలోకి - రేవంత్ రెడ్డి

Revanth Reddy : కాంట్రాక్ట్ ఒప్పందాల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ద్రోహం చేసి బీజేపీలోకి వెళ్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మునుగోడు గడ్డపై కాంగ్రెస్ జెండాఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

Revanth Reddy : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీనీ కేసులతో వేధిస్తుంటే అండగా ఉండాల్సిన టైంలో కాంట్రాక్ట్ ఒప్పందాల కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో జంప్ అయ్యారని తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రజలను ఒకసారి మోసం చేసిన వ్యక్తి మరోసారి మోసం చేయడని గ్యారెంటీ ఏంటని రేవంత్ ప్రశ్నించారు. గతంలో పాల్వాయి స్రవంతికి ఇవ్వాల్సిన టికెట్‌ను రాజగోపాల్‌రెడ్డికి ఇచ్చారన్నారు. వారి త్యాగాలు రాజగోపాల్ రెడ్డి ఎందుకు గుర్తులేదవని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా మునుగోడు నియోజవర్గంలోని చుండూరులో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై విమర్శలు చేశారు.  

అమిత్ షా జైలుకు వెళ్లలేదా? 

బీజేపీలోకి ఎందుకు వెళ్లారో రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నెల రోజులు జైల్లో ఉన్న తన నాయకత్వంలో పనిచేయలేని వ్యక్తి 90 రోజులు జైల్లో ఉన్న అమిత్‌షాతో ఎలా పనిచేస్తారో సమాధానం చెప్పాలన్నారు. మునుగోడు ప్రజల కోసమే రాజీనామా చేశానని చెబుతున్న రాజగోపాల్ రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధికి మోదీ, అమిత్ షాను అడిగి నిధులు తీసుకొస్తారా అని ప్రశ్నించారు. కష్టకాలంలో ఉన్న పార్టీకి అండగా ఉండాల్సిన టైంలో పార్టీకి ద్రోహం చేసి వెళ్లినపోయిన రాజ్‌గోపాల్‌కు మునుగోడు ప్రజలు గుణపాఠం చెప్పాలని రేవంత్ పిలుపునిచ్చారు. ఒక్క ఎమ్మెల్యే పోయినంత మాత్రాన కాంగ్రెస్‌కు ఎలాంటి నష్టం లేదన్నారు.  

టీఆర్ఎస్ 120 కేసులు పెట్టింది 

2014 నుంచి ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ పార్టీ తనపై 120 కేసులు పెట్టిందని అయినా భయపడకుండా నిలబడ్డానని రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ను ఓడించే వరకు పోరాటం చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీనే తెలంగాణ తల్లి అన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అసలు కాంగ్రెస్ అధికారంలోకి రాలేదన్న బాధ లేదన్నారు. ప్రజల సంక్షేమం కోస తప్ప అధికారం ముఖ్యం కాదని అభిప్రాయపడిన సోనియా గాంధీని మోదీ, అమిత్‌షా ఈడీ కేసులతో వేధిస్తుంటే పోరాటం చేయాల్సింది పోయి అమిత్‌షాతో కాంట్రాక్ట్ ఒప్పందాలు చేసుకున్నారని రాజ్‌గోపాల్‌పై రేవంత్ మండిపడ్డారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనే దమ్ములేకే ఈడీ కేసులతో వేధిస్తున్నారని ఆరోపించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి అన్యాయంగా నోటీసులు ఇచ్చారన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget