By: ABP Desam | Updated at : 07 Apr 2022 05:13 PM (IST)
గవర్నర్ ఆరోపణలపై కేటీఆర్ స్పందన
తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య వివాదం అంతకంతకూ ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తనను తీవ్రంగా అవమానిస్తోందని కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వడం లేదని తమిళిసై ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ఫిర్యాదు చేశారు. అమిత్ షాతో ఏం చర్చించామో బయటకు చెప్పలేనని మీడియాతో గవర్నర్ చెప్పినప్పటికీ .. తర్వాత కొన్ని విషయాలు మీడియాకు లీక్ అయ్యాయి. తెలంగాణలో పరిస్థితులపై గవర్నర్ పూర్తి స్థాయి నివేదికను అమిత్ షాకు అందించినట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో డ్రగ్స్ కేసుల్లో సెలక్టివ్గా దాడులు చేస్తున్నారని.. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవడం లేదని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్ పిల్లలకు చాలా ప్రమాదకరమైనవని.. ఓ తల్లిగా బాధపడుతూ ఈ విషయం చెబుతున్నానన్నారు. అలాగే తెలంగాణలో అవినీతి ఇతర అంశాలను కూడా నివేదికలో గవర్నర్ ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది.
మరోసారి వివాదాల నాయక్ - ఎంపీ చేతిలో మైక్ లాగేసుకున్న ఎమ్మెల్యే !
కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయకపోవడం వల్లనే కక్ష పెంచుకుని తన పట్ల అగౌరవంగా వ్యవహరిస్తున్నారని తమిళిశై భావిస్తున్నారు. ఇదే అంశాన్ని మోదీ, అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. రాజ్భవన్లో తన తల్లిచనిపోయినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా రాలేదని.. స్వస్థలానికి తల్లి భౌతిక కాయాన్ని తరలించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయమని అడిగినా చేయలేదని తమిళిసై భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో డ్రగ్స్ కేసు సంచలనంగా మారింది. అదే సమయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ డ్రగ్స్ కేసును విచారణ చేయడానికి ముందుకు వచ్చినా ఆధారాలు ఇవ్వడం లేదు. దీనిపై తెలంగాణ ఉన్నతాధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఈడీ పిటిషన్ కూడా వేసింది. ఇలాంటి తరుణంలో గవర్నర్ డ్రగ్స్ కేసు గురించి కూడా కేంద్రానికి నివేదిక ఇవ్వడం సంచలనంగా మారే అవకాశం కనిపిస్తోంది.
ఢిల్లీలో గవర్నర్ చేస్తున్న విమర్శలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గవర్నర్తో తమకు ఎలాంటి పంచాయతీ లేదని ఆయన స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ ప్రతిపాదనకు ఆమోదం చెప్పలేదని .. ఇబ్బంది పెడుతున్నారని గవర్నర్ అంటున్నారని.. గత గవర్నర్ నరసింహన్ ఉన్నప్పుడు తమకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదురు కాలేదని కేటీఆర్ గుర్తు చేశారు. గవర్నర్ ఏదేదో ఊహించుకుని మాట్లాడుతూంటే తాము ఏం చేయగలమని కేటీఆర్ ప్రశ్నించారు.
Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ
Petrol Diesel Price 21th May 2022 : తెలుగు రాష్ట్రాలో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు, ఇవాళ్టి రేట్స్ ఇలా
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
Breaking News Live Updates : పిడుగురాళ్ల రైల్వే క్వార్టర్స్ లో హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?