అన్వేషించండి

BRS Joinings : బీఆర్ఎస్‌లో చేరిన ఒడిషా మాజీ సీఎం సహా కీలక నేతలు - మహాభారత్‌ను నిర్మిద్దామని కేసీఆర్ పిలుపు !

ఒడిషా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ సహా పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహా భారత్‌ను నిర్మిద్దామని వారికి కేసీఆర్ పిలుపునిచ్చారు.


BRS Joinings :  ఒడిశా మాజీ ముఖ్య‌మంత్రి గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో గిరిధ‌ర్‌కు సీఎం కేసీఆర్ పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. గిరిధ‌ర్‌తో పాటు 12 మంది మాజీ ఎమ్మెల్యేలు, న‌లుగురు మాజీ ఎంపీలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్‌లో చేరిన వారిలో హేమ గమాంగ్, జ‌య‌రాం పాంగీ, రామ‌చంద్ర హ‌న్ష్‌డా, బృందావ‌న్ మ‌జ్హీ, న‌బీన్ నంద‌, రాథా దాస్, భ‌గీర‌థి సేతి, మ‌య‌దార్ జేనా ఉన్నారు. గిరిధర్ గమాంగ్‌ను  బీఆర్ఎస్ ఒడిషా శాఖ అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉంది. 
   
దేశంలోని అన్ని వ‌ర్గాలు సంతోషంగా ఉండేలా ఒక మ‌హాన్ భార‌త్ నిర్మిద్దాం అని బీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. స‌క‌ల మాన‌వాళి సంక్షేమ‌మే బీఆర్ఎస్ స్వ‌ప్నం అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. దేశ భ‌విష్య‌త్ కోస‌మే బీఆర్ఎస్ ఆవిర్భ‌వించింద‌ని తేల్చిచెప్పారు. ఒడిశా మాజీ సీఎం గిరిధ‌ర్ గ‌మాంగ్ బీఆర్ఎస్ పార్టీలో చేరిన సంద‌ర్భంగా తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేసీఆర్ ప్ర‌సంగించారు.  రైతులు దేశ రాజ‌ధాని స‌రిహ‌ద్దుల్లో 13 నెల‌ల ఉద్య‌మం ఎందుకు చేశారు. ఇప్ప‌టికీ రైతుల‌కు ఒక భ‌రోసా ఇవ్వ‌లేక‌పోయింది కేంద్రం. అందుకే అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ అనే నినాదాన్ని ఎత్తుకున్న‌ది బీఆర్ఎస్. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను గెలిపించండి.. దేశంలో నీళ్లు, క‌రెంట్ ఎందుకు రావో నేను చూస్తాను. మ‌న‌సు పెట్టి ప‌ని చేస్తే ఏదైనా సాధ్య‌మే. తెలంగాణ‌కు అందుకు సాక్ష్యమని... తెలంగాణ‌లో సాధ్య‌మైంది.. దేశ‌మంత‌టా ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించారు. 

తెలంగాణ‌లో ప్ర‌తి ఇంటికి తాగునీరు ఇస్తున్నాం.. దేశ‌మంతా ఎందుకు ఇవ్వ‌లేం. తెలంగాణ‌లో రైతు ఆత్మ‌హ‌త్య‌లు ఆగిపోయాయి.. వ‌ల‌స‌లు వాప‌స్ వ‌స్తున్నాయి. నేను చెప్పేది ధ‌న్ కీ బాత్ కాదు.. మ‌న్ కీ బాత్. క‌రెంట్‌కు దేశంలో కొద‌వ లేదు.. 4 ల‌క్ష‌ల మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంది. అన్ని ధ‌ర‌లు పెంచుకుంటూ పోవాలి.. జ‌నం జేబులు కొట్టేయాల‌నేదే కేంద్రం యావ‌. పేదోడి క‌డుపు కొట్టాలి.. ఉన్నోడి జేబులు నింపాలి.. దేశంలో న‌డుస్తున్న‌ది ఇదే. రైతులు కూడా చ‌ట్ట‌స‌భ‌ల్లోకి కూడా రావాలి. రైతులు నాగ‌లి ప‌ట్ట‌డ‌మే కాదు.. రాజ్యాంగాన్ని న‌డిపే నాయ‌కులుగా మారాల‌న్నారు కేసీఆర్. 

ఎన్నిక‌ల్లో గెల‌వ‌డ‌మే నాయ‌కుల‌కు ల‌క్ష్యంగా మారిందని కేసీఆర్ పేర్కొన్నారు. ఏదో ర‌కంగా ఓట్లు సంపాదించుకోవ‌డ‌మే రివాజుగా మారింది. స్వాతంత్ర్యం ఇచ్చి 75 ఏండ్లు అవుతున్న‌ప్ప‌టికీ తాగ‌డానికి నీళ్లు ఇవ్వ‌ట్లేదు. ఒడిశా మ‌హాన‌దిలో ఎంత శాతం నీళ్ల‌ను వాడుకుంటున్నా. ఈ 75 ఏండ్ల‌లో మ‌నం ఏం సాధించిన‌ట్టు? జాతి, ధ‌ర్మం పేరు చెప్పి గెలిచే వారు ఏం చేస్తారు? పెద్ద పెద్ద ఉప‌న్యాసాలు ఇస్తారు.. కానీ తాగ‌డానికి గుక్కెడు నీళ్లు ఇవ్వ‌రని మండిప‌డ్డారు కేసీఆర్. అమెరికా, చైనా అభివృద్ధి చెందిన దేశాల కంటే వ‌న‌రులు ఎక్కువ ఉన్నాయి. కానీ మ‌న దేశం అభివృద్ధి చెంద‌డం లేదు. భార‌త్ త‌న ల‌క్ష్యాన్ని మ‌రిచింద‌ని పేర్కొన్నారు. దేశ యువ‌త అమెరికా వెళ్లేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. అమెరికా గ్రీన్ కార్డు వ‌స్తే సంబురాలు చేసుకుంటున్నారు. దేశంలో స‌రిప‌డా నీళ్లున్నా పొలాల‌కు మ‌ళ్ల‌వు, స‌రిప‌డా క‌రెంట్ ఉన్న చీక‌ట్లు తొల‌గ‌వు. ప్ర‌భుత్వాలు మారినా రైతులు, కార్మికుల ప‌రిస్థితి మార‌లేదు. దేశంలో గుణాత్మ‌క మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని కేసీఆర్ అన్నారు.

ఒడిషా నుంచి కీలక నేతల రాకతో తెలంగాణ భవన్ సందడిగా మారింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Chicken Price Hike May 2026: చికెన్ రేట్లకు రెక్కలు - కిలో రూ.350 దాటిన ధర.. సామాన్యుడికి నాన్‌వెజ్ భారమే!
చికెన్ రేట్లకు రెక్కలు - కిలో రూ.350 దాటిన ధర.. సామాన్యుడికి నాన్‌వెజ్ భారమే!
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Bandi Bhageerath POCSO Case: బండి బగీరథ్ కేసుపై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు - అలా చేయాల్సిందేనని డిమాండ్ !
బండి బగీరథ్ కేసుపై మంచు మనోజ్ సంచలన వ్యాఖ్యలు - అలా చేయాల్సిందేనని డిమాండ్ !
Tanikella Bharani : మోదీ గారిని కలిశా... ముట్టుకున్నా... చేతిని ముద్దాడా - తనికెళ్ల భరణి ఎమోషనల్
మోదీ గారిని కలిశా... ముట్టుకున్నా... చేతిని ముద్దాడా - తనికెళ్ల భరణి ఎమోషనల్

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget