అన్వేషించండి

Mallareddy Land Issue : పోలీసుల అదుపులో ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజశేఖర్ రెడ్డి - భూ వివాదమే కారణం !

Hyderabad News : భూవివాదం కేసులో మాజీ మంత్రి మల్లారెడ్డిని, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సుచిత్రలో తమ భూమిలో వేరే వారు ఫెన్సింగ్ వేశారని మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు


Telangana  News :  మాజీమంత్రి మల్లారెడ్డి , ఆయన అల్లురు రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌కు తరలించారు . సుచిత్ర పరిధిలోని సర్వే నెం.82లో భూ వివాదం నేపథ్యంలో…. ల్యాండ్‌ దగ్గరకు వచ్చి హల్‌చల్‌ సృష్టించారు మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డి. ఈ తరుణంలోనే… మల్లారెడ్డిని పేట్‌బషీరాబాద్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  .కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటానంటూ మల్లారెడ్డి వివాదం ఉన్న స్థలంలో వీరంగం సృష్టించారు.  పోలీసుల ముందే మల్లారెడ్డి అనుచరులు ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామన్నారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని 15 మంది తెలిపారు. స్థలంపై కోర్టు ఆర్డర్‌ ఉన్నందున సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు ఇరు వర్గాలకు సూచించారు.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా  సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో  మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలం కొర్టు వివాదంలో ఉంది. ఈ క్రమంలోనే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ మల్లారెడ్డి, ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి, తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన భారీ కేడ్లను తొలగించారు.అక్కడున్న రెండున్నర ఎకరాల భూమి తనదే అంటూ వాగ్వాదానికి దిగారు.  అందులో  1.06 గుంటల భూమి తమదంటూ మరో 15 మంది అడ్డుకున్నారు. ఒక్కొక్కరం 400 గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామని 15 మంది చెప్తున్నారు. కోర్టు సైతం తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు. పోలీసులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

 కోర్టు ఆర్డర్ ఉన్నందున సంఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరువర్గాలకు సర్ది చెప్పారు పోలీసులు. ఈ క్రమంలోనే మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ  ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు ఎంత చెప్పినా మల్లారెడ్డి ,రాజశేఖర్ రెడ్డి వినలేదు. దీంతో మల్లారెడ్డిని  అదుపులోకి తీసుకుని పేట్ బషీరాబాద్ పీఎస్ కు తరలించారు పోలీసులు.తర్వాత మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

మాజీ మంత్రి మల్లారెడ్డిపై చాలా కాలంగా భూ వివాదాలు ఉన్నాయి. ఆయన ఐదేళ్లు ఎంపీగా, ఐదేళ్లు మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయనపై చాలా ఆరోపణలు వచ్చినప్పటికీ.. అధికారంలో ఉండటంతో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. కానీ కోర్టు ఆదేశాలు  తప్పనిసరిగా కొన్ని కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత మరింత ఎక్కువగా ఆయనపై ఫిర్యాదులు వస్తున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
TGPSC Group1 Recruitment: తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
Andhra Pradesh: కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
Etvwin Web Series: ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ - రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై చర్చ
TGPSC Group1 Recruitment: తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
తగ్గేదేలే అంటున్న టీజీపీఎస్సీ, 1:50 నిష్పత్తిలోనే 'గ్రూప్‌-1' మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక
Andhra Pradesh: కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
కలకలం రేపుతున్న దస్త్రాలు దహనం ఘటన- కీలకంగా మారుతున్న డ్రైవర్‌ వాంగ్మూలం
Etvwin Web Series: ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
ఈటీవీ విన్ ఓటీటీ కోసం... చంద్రశేఖర్ యేలేటి వెబ్ సిరీస్!
Team India: 16 గంటల విమాన ప్రయాణంలో భారత క్రికెటర్లు ఏం చేశారంటే?
16 గంటల విమాన ప్రయాణంలో భారత క్రికెటర్లు ఏం చేశారంటే?
Bonalu in Hyderabad 2024: అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!
అమ్మకు బోనం.. ఆధ్యాత్మిక సంబురం మాత్రమే కాదు అంటు వ్యాధులు తరిమేసే ఆయుధం!
Team India Return: సగర్వంగా స్వదేశానికి వచ్చిన ఆటగాళ్ళు, ఎక్కడ చూసినా అభిమానుల సందడే
సగర్వంగా స్వదేశానికి వచ్చిన ఆటగాళ్ళు, ఎక్కడ చూసినా అభిమానుల సందడే
Trisha Krishnan : మీ డ్రెస్​ నచ్చి వేసుకుంటున్నారా? వేరే వాళ్లని ఇంప్రెస్ చేయడం వేసుకుంటున్నారా? త్రిష వేసిన ప్రశ్న మీకేనేమో
మీ డ్రెస్​ నచ్చి వేసుకుంటున్నారా? వేరే వాళ్లని ఇంప్రెస్ చేయడం వేసుకుంటున్నారా? త్రిష వేసిన ప్రశ్న మీకేనేమో
Embed widget