అన్వేషించండి

MahabubNagar MLC ByElection : గురువారమే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక - క్యాంపుల నుంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు !

Telangana News : మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ గురువారం జరగనుంది. ఇప్పటికే ఆయా పార్టీలు తమ ఓటర్లను క్యాంపులకు తీసుకెళ్లాయి.

MahbubNagar MLC by-election polling will be held on Thursday :  మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక గురువారం జరగనుంది. ఇందుకోసం మొత్తం 10 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,439 మంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఓటు వేయనున్నారు. కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బిఆర్ఎస్ నుంచి నవీన్ కుమార్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో ఉన్నారు.  కాంగ్రెస్ లో చేరి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎమ్మెల్సీ  కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.                               

గత కొన్ని నెలలుగా స్థానిక సంస్థలలో ఎన్నికైన వందలాది మంది ప్రజాప్రతినిధులు పార్టీలు మారుతుండటంతో.. మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ స్థానానికి క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయం రాజకీయ పార్టీలలో వ్యక్తమవుతోంది. మొత్తం 1,439 మునిసిపల్ వార్డు సభ్యులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వంటి స్థానిక సంస్థలకు ఎన్నికైన సభ్యులైన ఓటర్లు ఉండగా, వీరిలో దాదాపు 1,000 మందిని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీల నేతలు గోవా, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు తరలించినట్లు సమాచారం.జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో 70 శాతం మంది బీఆర్‌ఎస్‌కు చెందిన వారే. అయినా అధికారం పోవడంతో ఓట్లు వేస్తారో లేదో తెలియని పరిస్థితి ఉంది.  అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలందర్నీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గోవాకు తీసుకెళి  రెండు రోజుల నుంచి అక్కడే క్యాంపు రాజకీయాలు నడిపారు.                           

అధికారంలో ఉన్నప్పుడే స్థానిక సంస్థల ఎమ్మెల్సీని కాపాడుకోలేకపోయారు బీఆర్ఎస్ నేతలు. నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక ల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. అప్పట్లో నల్లగొండ జిల్లాలో జడ్పీటీసీలు, ఎంపీటీసీలందరూ బీఆర్‌ఎస్‌ వారే ఉన్నప్పటికీ… కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విజయం సాధించారు. అంటే కారు పార్టీకి చెందిన స్థానిక ప్రజా ప్రతినిధుల్లో ఎక్కువ మంది హస్తానికి ఓటేశారన్నమాట. అలాంటి పరిస్థితే ఇప్పుడూ ఎదురవుతుందని బీఆర్‌ఎస్‌ ఆందోళన చెదుతోంది.                         

మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 1,394 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటర్లుగా ఉండగా, వీరిలో బీఆర్‌ఎస్‌కు 823, కాంగ్రెస్‌కు 396, బీజేపీకి 88, బీఎస్పీకి ఒకటి, సీపీఐకి 4, సీపీఐ(ఎం)కు ఇద్దరు, ఎంఐఎంకు ఆరుగురు ఓటర్లు ఉన్నారు. ఇండిపెండెంట్లు 13 మంది ఉన్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే బీఆర్ఎస్ కు విజయం నల్లేరుపై నడకే. కానీ రేవంత్ రెడ్డి… వ్యూహాత్మకంగా నిన్నామొన్నటి వరకూ బీఆర్ఎస్ లో ఉన్న ఆర్థికంగా బలవంతుడు అయిన మన్నె జీవన్ రెడ్డిని అభ్యర్థిగా నిలిపారు. ఆయన మహబూబ్ నగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి శ్రీనివాసరెడ్డి సమీప బంధువు. నేరుగా పార్టీలే వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకు రానున్నాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
APSRTC employees: ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్‌గా మారిన ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ - వేరే శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం
Upcoming Smartphones in 2026: కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు.. Oppo నుంచి Vivo వరకు పూర్తి జాబితా
కొత్త సంవత్సరంలో మార్కెట్లోకి స్మార్ట్ ఫోన్లు.. Oppo నుంచి Vivo వరకు పూర్తి జాబితా
Chiranjeevi Venkatesh Song: చిరు - వెంకీల 'మెగా విక్టరీ మాస్' సాంగ్ రెడీ... రిలీజ్ ఎప్పుడంటే?
చిరు - వెంకీల 'మెగా విక్టరీ మాస్' సాంగ్ రెడీ... రిలీజ్ ఎప్పుడంటే?
Venkatrama and Co Calendar : వెంకట్రామా &కో క్యాలెండర్‌కు వందేళ్లు! ఇది క్యాలెండర్ కాదు, తెలుగువాడి ఎమోషన్
వెంకట్రామా &కో క్యాలెండర్‌కు వందేళ్లు! ఇది క్యాలెండర్ కాదు, తెలుగువాడి ఎమోషన్
Embed widget