Breaking News: విజయవాడ: రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్టు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 24 నుంచి ప్రారభించాల్సిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను ఈ నెల 28న ఆయన ప్రారంభించనున్నారు. బీజేపీ సీనియర్నేత, యూపీ మాజీ సీఎం కల్యాణ్ సింగ్ మృతిచెందడం వల్ల పార్టీ పరంగా సంతాపదినాలు పాటిస్తుందని, ఆ కారణంగానే పాదయాత్రను వాయిదా వేసినట్లు బీజేపీ అధికారికంగా వెల్లడించింది. తొలుత ఈ పాదయాత్రను క్విట్ ఇండియా దినోత్సవం ఆగస్ట్ 9 నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ, అదే సమయంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడం, కీలక బిల్లులపై చర్చ వంటి అంశాల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్రను 24కు వాయిదా వేశారు. తాజాగా కల్యాణ్సింగ్ మరణంతో మరో నాలుగు రోజుల పాటు పాదయాత్ర వాయిదా పడింది.
Also Read: Sangareddy: రాఖీ కట్టించుకోనని మొండికేసిన అన్న.. చెల్లెలు అఘాయిత్యం, కాలనీలో షాకింగ్ ఘటన
విజయవాడ: రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్టు
బెజవాడలో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యాన్ని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ విజయవాడలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని మృతదేహం కారులో పడి ఉంది. ఆ మృతదేహాన్ని రాహుల్ దిగా గుర్తించిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు బెంగళూరులో కోగంటి సత్యాన్ని అరెస్టు చేశారు.
బీసీ కమిషన్ ఛైర్మన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ రావు
బీసీ మిషన్ ఛైర్మన్ గా వకుళాభరణం కృష్ణమోహన్ రావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వం శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్ర కమిషన్ లో సభ్యులుగా నియమించింది. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యుల హోదాలతో సమానంగా సదుపాయాలు ఉంటాయి.





















