అన్వేషించండి

Breaking News: విజయవాడ: రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్టు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

LIVE

Key Events
Breaking News: విజయవాడ: రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్టు

Background

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ కుమార్‌ పాదయాత్ర మరోసారి వాయిదా పడింది. ఈ నెల 24 నుంచి ప్రారభించాల్సిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను ఈ నెల 28న ఆయన ప్రారంభించనున్నారు. బీజేపీ సీనియర్‌నేత, యూపీ మాజీ సీఎం కల్యాణ్‌ సింగ్‌ మృతిచెందడం వల్ల పార్టీ పరంగా సంతాపదినాలు పాటిస్తుందని, ఆ కారణంగానే పాదయాత్రను వాయిదా వేసినట్లు బీజేపీ అధికారికంగా వెల్లడించింది. తొలుత ఈ పాదయాత్రను క్విట్‌ ఇండియా దినోత్సవం ఆగస్ట్‌ 9 నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ, అదే సమయంలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుండడం, కీలక బిల్లులపై చర్చ వంటి అంశాల నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్రను 24కు వాయిదా వేశారు. తాజాగా కల్యాణ్‌సింగ్‌ మరణంతో మరో నాలుగు రోజుల పాటు పాదయాత్ర వాయిదా పడింది.

Also Read: Sangareddy: రాఖీ కట్టించుకోనని మొండికేసిన అన్న.. చెల్లెలు అఘాయిత్యం, కాలనీలో షాకింగ్ ఘటన

20:53 PM (IST)  •  23 Aug 2021

విజయవాడ: రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్టు

బెజవాడలో సంచలనం సృష్టించిన వ్యాపారవేత్త రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యాన్ని పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాహుల్ విజయవాడలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అతని మృతదేహం కారులో పడి ఉంది. ఆ మృతదేహాన్ని రాహుల్ దిగా గుర్తించిన తర్వాత పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ మేరకు బెంగళూరులో కోగంటి సత్యాన్ని అరెస్టు చేశారు.

19:15 PM (IST)  •  23 Aug 2021

బీసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ గా వ‌కుళాభ‌ర‌ణం కృష్ణ‌మోహ‌న్ రావు

బీసీ మిష‌న్ ఛైర్మన్ గా వ‌కుళాభ‌ర‌ణం కృష్ణమోహన్ రావును నియ‌మిస్తూ రాష్ట్ర  ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా ప్రభుత్వం శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్ర కమిషన్ లో సభ్యులుగా నియమించింది. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ క‌మీష‌న్ సభ్యుల హోదాలతో సమానంగా స‌దుపాయాలు ఉంటాయి.

19:03 PM (IST)  •  23 Aug 2021

School Re Open: తెలంగాణలో మోగనున్న బడి గంట.. సెప్టెంబర్‌ ఒకటి నుంచి ఆఫ్‌లైన్ బోధన స్టార్ట్.. ఎవరెవరికి అంటే?

తెలంగాణలో బడిగంట సెప్టెంబర్‌ ఒకటి నుంచి మోగనుంది. కరోనా నిబంధనలు పాటిస్తూనే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. థర్డ్‌ వేవ్‌తో ప్రమాదం లేదంటున్న వైద్యుల సూచనలతో విద్యాశాఖాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. ఎనిమిదో తరగతి నుంచి పీజీ వరకు ఆఫ్‌లైన్‌ తరగతుల నిర్వహణకు అంతా రెడీ చేశారు. ఉత్తర్వులు కూడా విద్యాశాఖ జారీ చేసింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యక్ష తరగతులు ఆగస్టు 16నుంచి ప్రారంభమయ్యాయి. 

19:00 PM (IST)  •  23 Aug 2021

వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించాలి..కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించాలని కేఆర్‌ఎంబీకి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు రాష్ట్ర ఈఎన్‌సీ లేఖ రాశారు. తాగునీటి కోసం వినియోగించే జలాలు 20 శాతం మాత్రమే లెక్కించాలని లేఖలో పేర్కొన్నారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 20 శాతంగానే లెక్కించాలని తెలిపారు. ఈ మేరకు వెలిగొండ ప్రాజెక్ట్ పనులను నిలిపివేయించాలని కేఆర్‌ఎంబీ ఛైర్మన్ కు తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు.

18:59 PM (IST)  •  23 Aug 2021

Telangana EMCET: 25న తెలంగాణ ఎంసెట్ ఫలితాలు!

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ సన్నహాలు చేస్తోంది. బుధవారం విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇంజనీరింగ్ అడ్మిషన్ ప్రక్రియలో ఇంటర్ వెయిటేజ్‌ అందుకే వీలైనంత త్వరగా ఫలితాలు రిలీజ్‌ చేసి అడ్మిషన్లు జరిపించాలని చూస్తున్నారు. గతంలో ఇంటర్‌లో 45 శాతం మార్కులు ఉంటేనే అడ్మిషన్‌కి అర్హత ఉండేది. కరోనా ఉద్ధృతి కారణంగా ఇంటర్ పరీక్షలు జరగలేదు. దీంతో ఎంసెట్‌లో క్వాలిఫై అయితే చాలు సీటు వచ్చే అవకాశం ఉంది. 

15:46 PM (IST)  •  23 Aug 2021

Etela Rajendra: ఈటల పర్యటనలో ఫొటోలు తీసిన ఏఎస్‌ఐ.. తిరగబడ్డ బీజేపీ శ్రేణులు

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్‌లో మాజీ మంత్రి ఈటల పర్యటనలో వివాదం చోటు చేసుకుంది. ఓ ఏఎస్‌ఐ ఫొటోలు తీయడం వివాదానికి దారి తీసింది. ఈటల సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏఎస్‌ఐ ఫొటోలు తీశాడు. దీన్ని గమనించిన బీజేపీ శ్రేణులు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే తోపులాట జరిగింది. దీంతో ఏఎస్‌ఐ చొక్కా చనిగిపోయింది. ఏఎస్‌ఐ ఎవరి ఆదేశాలతో ఫొటోలు తీశారని..దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. 

14:21 PM (IST)  •  23 Aug 2021

బల్లి పడిన ఆహారం తిని 27 మంది విద్యార్థులకు అస్వస్థత

విజయనగరం జిల్లాలో బల్లి పడిన ఆహారం తిని 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పార్వతీపురం పురపాలక పాఠశాలలో ఆహారంలో బల్లిపడింది. అస్వస్థతకు గురైన విద్యార్థులను  పాఠశాల సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.

14:45 PM (IST)  •  23 Aug 2021

Srikakulam Accident: శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం.. ఆర్మీ జవాన్‌ అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా నలుగురు మృతి

శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్ అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పలాస మండలం సుమ్మదేవి జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు మృతి చెందారు. ఆర్మీ జవాను మృతదేహానికి ఎస్కార్టుగా బొలెరో వాహనంపై వెళ్తుండగా రైల్వే ట్రాక్ సమీపంలో వాహనం టైరు పేలింది. ఈ కారణంగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఎచ్చెర్లకు చెందిన నలుగురు ఏఆర్ కానిస్టేబుళ్లు అక్కడికక్కడే చనిపోయారు.

12:45 PM (IST)  •  23 Aug 2021

ఎవరి పని తీరు బాగుందో చెప్పండి కిషన్ రెడ్డి గారూ..

‘‘తలసరి ఆదాయం విషయంలో దేశ వృద్ధి రేటు గత ఆరేళ్లలో 48.7 శాతంగా ఉంది. తెలంగాణ విషయంలో అది 91.5 శాతంగా ఉంది. దేశంలోనే తలసరి ఆదాయం వృద్ధి రేటులో మనమే రెండో స్థానంలో ఉన్నాం. కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి వారు ఎవరి పనితీరు బాగుందో చెప్పాలి’’ అని కేంద్ర మంత్రిని హరీశ్ రావు ప్రశ్నించారు.

12:39 PM (IST)  •  23 Aug 2021

దేశం కన్నా తెలంగాణ తలసరి ఆదాయమే ఎక్కువ

‘‘తెలంగాణ తలసరి ఆదాయం విషయంలో 2020-21 ఏడాదికి గానూ రూ.2,37,632 గా ఉంది. జాతీయ సరాసరి తలసరి ఆదాయంతో పోల్చితే 1.84 రెట్లు ముందున్నాం. దేశ తలసరి ఆదాయం రూ.1,28,829 గా ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,632 గా ఉంది. దేశ తలసరి ఆదాయం కంటే ఎక్కువగా ఉంది. దేశంలోనే మూడో అతిపెద్ద తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉంది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 10వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు దేశంలోనే మూడో స్థానంలోకి వచ్చింది.’’ అని హరీశ్ రావు తెలిపారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

CM Jagan on YS Avinash Reddy | వివేకా హత్య కేసులో అవినాష్ నిర్దోషి అన్న సీఎం జగన్ | ABP DesamTirupati YSRCP MP Candidate Maddila Gurumoorthy| తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి గురుమూర్తితో ఇంటర్వ్యూSRH vs RCB Match Preview IPL 2024 | సన్ రైజర్స్ బ్యాటర్లను ఆర్సీబీ బౌలర్లు వణికిస్తారేమో.! | ABPAxar Patel All round Show vs GT | గుజరాత్ మీద మ్యాచ్ లో ఎటు చూసినా అక్షర్ పటేలే |DC vs GT | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandragiri Tension : చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత  - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
చంద్రగిరి అభ్యర్థుల నామినేషన్లలో ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ పరస్పర దాడులు
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
ప్రధాని మోదీ స్పీచ్‌పై ఈసీ తీవ్ర అసహనం, వివరణ ఇవ్వాలని బీజేపీకి నోటీసులు - కాంగ్రెస్‌కి కూడా
Chandrababu Vs Jagan : తోబుట్టువు కట్టుకున్న చీరపైనా  విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
తోబుట్టువు కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఓ ముఖ్యమంత్రా ? - జగన్ పై చంద్రబాబు ఫైర్
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
సుప్రీంకోర్టుకీ ఓ వాట్సాప్ నంబర్, ఇకపై సమాచారం అంతా అందులోనే
ITR 2024: అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
అన్ని రకాల ఆదాయాలపై టాక్స్‌ కట్టక్కర్లేదు, ఈ విషయాలు తెలిస్తే చాలా డబ్బు ఆదా
JioCinema: గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
గుడ్ న్యూస్ చెప్పిన జియో సినిమా.. సబ్‌స్క్రిప్షన్ రేట్లు భారీగా తగ్గింపు, మరి ఐపీఎల్?
Tamannaah: తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
తమన్నాకు సైబర్ సెల్ నుంచి నోటీసులు - ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు రమ్మంటూ...
Pithapuram News: పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
పిఠాపురంలో జనసైనికులను టెన్షన్ పెడుతున్న బకెట్‌- పవన్ పేరుతో కూడా తిప్పలే!
Embed widget