అన్వేషించండి

Kagaznagar Minority School : మైనారిటీ గురుకుల పాఠశాల వద్ద ఆందోళన, అదనపు కలెక్టర్ వాహనం అడ్డగింత

Kagaznagar Minority School : కాగజ్ నగర్ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 53 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై పాఠశాల వద్ద తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.

Kagaznagar Minority School : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ మైనారిటీ గురుకుల పాఠశాల వద్ద ఆందోళన కొనసాగుతోంది. సోమవారం రాత్రి సుమారు 45 మంది విద్యార్థులు భోజనం వికటించి అస్వస్థతకు గురవడంతో వారిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మంగళవారం ఉదయం మైనారిటీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. 

గురుకల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. పురుగుల అన్నంతో పాటు ఉడికీ ఉడకని అన్నం తిని విద్యార్థులకు పెట్టడం వల్లే అస్వస్థతకు గురయ్యారని, అయినా పాఠశాల సిబ్బంది పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమయానికి మీడియా పోలీసులు రావడంతోనే విషయం బయటపడి వారిని పోలీసుల ఆధ్వర్యంలో స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారన్నారు. లేదంటే తమ పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులంటూ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన మైనారిటీ గురుకుల పాఠశాల సిబ్బందిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్న తల్లిదండ్రులు 
 
కాగజ్‌నగర్‌ మైనారిటీ గురుకులం విద్యార్థులు  అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ కాగజ్‌నగర్‌ మైనారిటీ గురుకుల పాఠశాలను పరిశీలించారు. గురుకులంలోని వంట గదిని, సామాన్లను పరిశీలించారు. కుళ్లిన పండ్లు, ఉడికీ ఉడకని అన్నంతో పాటు భోజనాన్ని గుర్తించారు. అనంతరం అదనపు కలెక్టర్ బయటికి వెళుతుండగా విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఏబీవీపీ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. మైనారిటీ గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే అస్వస్థతకు గురయ్యారని, వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు అరగంట పాటు మైనారిటీ గురుకులం పాఠశాల వద్ద ఆందోళన కొనసాగింది. ఆపై అదనపు కలెక్టర్ చాహత్ భాజ్ పాయ్ ఈ విషయంపై  తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. గురుకులాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని గురుకుల విద్యార్థులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు. 

విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తున్న తల్లిదండ్రులు

కాగజ్‌నగర్‌ మైనారిటీ గురుకులంలో నిన్న రాత్రి భోజనం వికటించి విధ్యార్థులు అస్వస్థతకు గురికావటంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్తున్నారు. మైనారిటీ గురుకులంలో మొత్తం 350 మంది విద్యార్థులున్నారు. ఇందులో నిన్న రాత్రి ముందుగా 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా, ఆ సంఖ్య 45 వరకు చేరింది. నేడు మొత్తం 53 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జిల్లా వైద్యాధికారి డా. ప్రభాకర్ రెడ్డి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరిశీలించారు. కొలుకున్న కొంతమంది విద్యార్థులను డిశ్చార్జ్ చేశారు. మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పలువురు విద్యార్థులను తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లిపోయారు.  

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ 

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మైనారిటీ గురుకులంలో సోమవారం రాత్రి 45 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం పట్ల బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ TRS ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తు ట్వీట్ చేశారు. గురుకులం విద్యార్థులు, మైనారిటీ బిడ్డలు చదువుకుంటామంటే TRS ప్రభుత్వం విషాహారం పెడుతుందని, TRS ప్రభుత్వాన్ని ఏం చేద్దాం.. అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీలో పెద్ది టికెట్‌ ధరల పెంపు- ప్రీమియర్ టికెట్ రూ. 600
ఏపీలో పెద్ది టికెట్‌ ధరల పెంపు- ప్రీమియర్ టికెట్ రూ. 600
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
Regional Sentiment politics: తెలంగాణలో మళ్లీ ప్రాంతీయ మంట - పవన్, చంద్రబాబులే టార్గెట్.. వ్యూహం ఎవరిది? ప్రజా స్పందన ఎలా ఉంది?
తెలంగాణలో మళ్లీ ప్రాంతీయ మంట - పవన్, చంద్రబాబులే టార్గెట్.. వ్యూహం ఎవరిది? ప్రజా స్పందన ఎలా ఉంది?
Revanth Reddy support to TDP cadre Telangana: రేవంత్ ఎన్టీఆర్ జపం - గ్రేటర్ ఎన్నికల లక్ష్యంగా మాస్టర్ ప్లాన్.. టీడీపీ ఓట్ బ్యాంక్‌పై కాంగ్రెస్ గురి!
రేవంత్ ఎన్టీఆర్ జపం - గ్రేటర్ ఎన్నికల లక్ష్యంగా మాస్టర్ ప్లాన్.. టీడీపీ ఓట్ బ్యాంక్‌పై కాంగ్రెస్ గురి!

వీడియోలు

Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్
RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
DK Shivakumar Swearing In Ceremony:యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
యంగ్ టీంతో సిద్ధమవుతున్న కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి డీకే శివకుమార్! జట్టులో నలుగురు డిప్యూటీ సీఎంలు!
DK Shivakumar Karnataka CM Challenges:కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
కర్ణాటక సీఎంగా ప్రమాణం చేయనున్న డీకే శివకుమార్‌కు సవాళ్ల స్వాగతం! ట్రబుల్ షూటర్ వాటిని ఎలా పరిష్కరిస్తారు?
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
Dasari Narayana Rao: దిక్కులేని దాసరి సమాధి... కుటుంబమే కాదు, ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు
దిక్కులేని దాసరి సమాధి... కుటుంబమే కాదు, ఇండస్ట్రీ కూడా పట్టించుకోలేదు
DK Shivakumar Swearing In: కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
కర్ణాటక కొత్త సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణస్వీకారం! రానున్న ఢిల్లీ పెద్దలు!
Tata Tiago Facelift Review: టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త కారులో నచ్చే 5 అద్భుతమైన ఫీచర్లు.. నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు
టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రివ్యూ: కొత్త కారులో నచ్చే 5 అద్భుతమైన ఫీచర్లు.. నిరాశ పరిచే 3 మైనస్ పాయింట్లు
Ajith Kumar : అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం - తల్లి మోహిని కన్నుమూత
June 1 Rule Changes 2026:బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
బిగ్ అలర్ట్! జూన్ 1 నుంచి మారే కీలక నియమాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం చూపే మార్పులు ఇవే!
Embed widget