అన్వేషించండి

KTR About NEET Exam: పరీక్షా పే చర్చ అంటారు, సమస్య వస్తే స్పందించరా? నీట్ ఎగ్జామ్ పై కేంద్రానికి బహిరంగ లేఖ

KTR Letter On NEET Exam | ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో పరీక్షా పే చర్చ అంటారు, సమస్య వస్తే మాత్రం స్పందించరా? అంటూ నీట్ ఎగ్జామ్ సమస్యపై కేంద్రానికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

BRS working President KTRs Open Letter to central govt on NEET Exam| హైదరాబాద్: నీట్ ఎగ్జామ్ 2024 వ్యవహారాన్ని బీఆర్ఎస్ అంత తేలికగా తీసుకోవడం లేదు. కష్టపడి చదివే తమ పిల్లలు కేంద్రం నిర్వహణ లోపంతో నష్టపోతున్నారని, తమ పిల్లలు డాక్టర్ కావాలని కలలు కన్న తల్లిదండ్రుల ఆశలపై నీట్ పరీక్షా వ్యవహారం నీళ్లు చల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బిహార్ లో 30 లక్షల చొప్పున నీట్ ఎగ్జామ్ పేపర్లు అమ్ముకున్నారని, ఇప్పటికే పదుల సంఖ్యలో అరెస్టులు జరుగియాని వార్తలొస్తున్నా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందంటూ మండిపడ్డారు.  

నీట్ పై మొదట్నుంచీ కేంద్రం నిర్లక్ష్య వైఖరి 
నీట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం మొదట్నుంచీ అత్యంత నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తోందని కేటీఆర్ విమర్శించారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన నీట్ ఎగ్జామ్ (NEET Exam 2024) పై ఆరోపణలు, అనుమానాలు వ్యక్తమవుతున్నా ప్రధాని మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం దారుణమన్నారు. విద్యార్థులతో పరీక్షా పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని మోదీ.. కీలకమైన నీట్ ఎగ్జామ్ పై మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. నీట్ ఎగ్జామ్ నిర్వహణ, లోపాలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశారు. విద్యార్థులకు, లక్షలాదిమంది తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని ఎన్డీయే సర్కార్ కు రాసిన లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. 

అంత మందికి ఫస్ట్ ర్యాంక్ సాధ్యమా? 
నీట్ ఎగ్జామ్ లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావటం అనుమానాలకు తావిస్తోంది. ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి 8 మందికి  ఏకంగా 720 మార్కులు రావడం గమనిస్తే.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. ఒక్క మార్కు తేడాతో విద్యార్థుల ర్యాంకులు, జీవితాలు మారిపోతాయి. ఎంతోమంది అవకాశాలు కోల్పోతారు. కానీ ఒకే సెంటర్ లో ఇంతమంది విద్యార్థులకు రికార్డు మార్కులు రావడం ఎలా సాధ్యమని కేటీఆర్ ప్రశ్నించారు. రిజల్ట్స్ ను సైతం 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించటంపై అనుమానాలు ఉన్నాయి. నీట్ ఎగ్జామ్ వ్యవహారం బయటకు రాగానే విచారణకు ఆదేశించాల్సిన కేంద్రం ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. పైగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఏ సమస్య లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

లక్షలాది విద్యార్థులు ఎన్ని ఫిర్యాదులు చేసినా, పలువురు ప్రముఖులు సుప్రీంకోర్టులో కేసు వేసినా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేంత వరకు కేంద్రం ఈ సమస్యను పట్టించుకోకపోవటంపై ఆశ్చర్యం కలిగిస్తోంది. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) చిత్రమైన సమాధానాలు చెప్పింది. ఈ ఏడాది 1563 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతున్నారు. నీట్ లాంటి ఎగ్జామ్ లకు గ్రేస్ మార్కులు కలిపే విధానమే లేకున్నా, ఎందుకిలా చేశారో సమాధానం చెప్పాలి. 1563 మంది విద్యార్థులకే ఏ ప్రాతిపదికన గ్రేస్ మార్కులు ఇచ్చారో చెప్పాలి. +4, -1 విధానం ఉండే ఈ ఎగ్జామ్ లో సాధ్యం కాని రీతిలో కొందరికి 718, 719 మార్కులు రావటం కూడా మొత్తం గ్రేస్ మార్కుల విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు వాటిని తొలగించడం, చేయడం లేదు, మళ్లీ ఎగ్జామ్ రాయిస్తారా క్లారిటీ ఇవ్వడం లేదని మండిపడ్డారు.  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget