అన్వేషించండి

Revanth Reddy : మంత్రి పువ్వాడ ఓ సైకో, కమ్మ కులం నుంచి బహిష్కరించాలి : రేవంత్ రెడ్డి

Revanth Reddy Khammam Tour : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పై రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు.

Revanth Reddy Khammam Tour : మంత్రి పువ్వాడ ఓ సైకో.. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై కేసులు పెట్టి రాక్షసానందం పొందుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు.  కాంగ్రెస్‌ పార్టీతో పెట్టుకుంటే మాడి మసైపోతారని రేవంత్‌రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు. వరంగల్‌లో జరిగే రాహుల్‌ గాంధీ సభ విజయవంతం కోసం ఖమ్మం నగరంలో కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ రైతాంగ పోరాటాలను ఖమ్మం జిల్లా నుంచే చేపట్టిందన్నారు. కార్యకర్తలను సంసిద్ధం చేసి రాహుల్ గాంధీ సభకు తరలి వచ్చేలా చేయాలన్నారు. 

వచ్చే ఎన్నికల్లో పువ్వాడకు బుద్ధి చెప్పాలి 

ఖమ్మం జిల్లా అంటే శీలం సిద్ధారెడ్డి, మల్లు అనంతరాములు, వెంగళరావు, నల్లమల గిరిప్రసాద్‌ వంటి నాయకులు గుర్తుకు వస్తారన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. వీరంతా ప్రజాసమస్యలపై పోరాటాలు చేసి అభివృద్ధికి పాటుపడ్డారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భట్టి, రేణుకాచౌదరి, సంభాని చంద్రశేఖర్‌ ప్రజా సమస్యలపై స్పందించారని చెప్పారు. అటువంటి జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్‌ భర్త ముస్తఫాపై, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పీడీయాక్ట్‌ పెట్టించి రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు. ఖమ్మం జిల్లా నుంచి మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ ఇందుకు కారణమన్నారు. అలాంటి సైకోలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో అటువంటి వారిని ఓడించాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు ఎవరి బెదిరింపులకు భయపడాల్సిన అవసరం లేదని, కాంగ్రెస్‌ పార్టీతో పెట్టుకుంటే మాడి మసైపోతారని అన్నారు. 

రాహుల్ సభ సక్సెస్ చేయాలి 

రైతులకు అండగా ఉండేందుకు వచ్చేనెల 6న హన్మకొండలో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభకు లక్షలాదిగా రైతులు, ప్రజలు, కార్యకర్తలు తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.  చనిపోతున్న రైతు కుటుంబాలను ఆదుకోవాలని, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయాలని, రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి కనీస మద్దతు ధర ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేస్తూ రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏఐసీసీ నాయకులు రాహుల్‌గాంధీ ఈ సభకు ముఖ్యఅతిథిగా వస్తున్నారని, కనీవిని ఎరుగని రీతిలో ఈ సభను విజయవంతం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి రైతులకు అండగా నిలబడాలని వరంగల్‌ కేంద్రంగా ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో భారీ ఎత్తున సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వానాకాలంలో రైతులు వరి వేయొద్దని, వరి పంట వేస్తే రైతుబంధు రద్దు చేస్తామని, ధాన్యం తాము కొనుగోలు చేయమని ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పారన్నారు. 

 కులం అడ్డుపెట్టుకుని రాజకీయాలు

మంత్రి పువ్వాడ చేసిన దుర్మార్గాలకు ఓ పిల్లవాడు బలైతే ఆయన ఓ సమావేశంలో కమ్మ కులాన్ని అడ్డుపెట్టుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కమ్మలకు ప్రధాన వృత్తి వ్యవసాయం, ఎవరొచ్చినా ఆదరించే కులం కమ్మకులం అన్నారు. అలాంటి కులంలో పుట్టి హింసకు పాల్పడి ప్రతిపక్ష పార్టీ నాయకులను, కార్యకర్తలను నిర్మూలించే వ్యక్తి తాను కమ్మ కులం అని ఎలా చెప్పుకుంటారని ప్రశ్నించారు. కమ్మ కులం నుంచి పువ్వాడ అజయ్‌ను బహిష్కరించాలని కోరారు. ఆయన చేసిన దుర్మార్గాలు, దోపిడీలపై, అధికారాన్ని అడ్డుపెట్టుకుని చేస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Telangana Man Buys Bike With 10 Rupee Coins: చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
చిల్లర కాదు బాస్.. ‘కాయిన్’ పవర్! రూ.1.10 లక్షల బైక్‌ను రూ.10 నాణేలతో కొనేసిన తెలంగాణ యువకుడు!
Harish Rao Irrigation Department Challenge: 3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగించు నీళ్లు ఎలా తేవాలో చూపిస్తా - సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్
3 నెలలు ఇరిగేషన్ శాఖ అప్పగించు నీళ్లు ఎలా తేవాలో చూపిస్తా - సీఎం రేవంత్‌కు హరీష్ రావు సవాల్
Pawan Kalyan : నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్
నీ చిరునవ్వు ధైర్యం ప్రేమ నా హృదయంలో నిలిచిపోతాయి - నిరంజన్ మృతిపై పవన్ ఎమోషనల్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Hyderabad Fake Liquor Gang: యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
యూట్యూబ్ చూసి ఇంట్లోనే మద్యం తయారీ -హైదరాబాద్‌లో ఖరీదైన బ్రాండ్ల పేరిట దందా.. ముఠా గుట్టురట్టు!
Vizag Gold Chain Theft Case: చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
చైన్ స్నాచర్లుగా మారిన తల్లీకొడుకులు -యూట్యూబ్ చూసి దిగిపోయారు..కానీ దొరికిపోయారు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Avinash Narne Wife Murder: అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
అమెరికాలో తెలుగు టెక్కీ సైకో బుద్ధి! భార్యను చంపి.. బాత్‌రూమ్‌లో బాడీ పెట్టి.. సీక్రెట్ లవర్ చాటింగ్‌తో దొరికిపోయాడు!
Renault Duster on EMI: 2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
2 లక్షల రూపాయల డౌన్ పేమెంట్‌తో రెనాల్ట్ డస్టర్ కొనుగోలు చేస్తే నెలవారీ EMI ఎంత?
Vizag Fishermen Missing Case: విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు గంగపుత్రులు మృతి చెందినట్టు ప్రకటన ! బాధితులకు పరిహారం అందజేసిన మంత్రి!
Embed widget