అన్వేషించండి

KCR Letter : నీతి ఆయోగ్ నిరర్థక సంస్థ - అందుకే హాజరు కావడంలేదని మోదీకి కేసీఆర్ లేఖ !

నీతిఆయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదని ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాశారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో నీతి ఆయోగ్‌లో నీతి అంత ఉందని స్పష్టం చేశారు.

 

KCR Letter : నీతి ఆయోగ్ నిరర్థక సంస్థగా మారిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. నాలుగు పేజీల లేఖలో ఆయన నీతిఆయోగ్ ఎలా నిరర్థకంగా మారిందో వివరించారు. ప్రణాళికా సంఘం స్థానంలో కోఆపరేటివ్ ఫెడరలిజం కోసం దీన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అయితే ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు కోఆపరేటివ్ ఫెడరలిజంని నిర్వీర్యం చేసేలా ఉన్నాయన్నారు. టీం ఇండియా పేరుతో ముఖ్యమంత్రులందరితో చర్చించి అభివృద్ధి అంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ఏర్పాటు చేశారని.. కానీ  నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఈ కారణంగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నామన్నారు.
KCR Letter : నీతి ఆయోగ్ నిరర్థక సంస్థ - అందుకే హాజరు కావడంలేదని మోదీకి కేసీఆర్ లేఖ !

నీతిఆయోగ్ వల్ల రాష్ట్రాలు మరింత బలడాల్సి ఉందని..దీని వల్ల దేశం మరింత ధృతంగా తయారవుతుందన్నారు. కానీ గత ఏడేళ్లుగా నీతి ఆయోగ్ ఆశలను నిర్వీర్యం చేసిందన్నారు. కేంద్రం నిర్ణయాలు రాష్ట్రాలను బలహీనం చేశాయని లేఖలో పేర్కొన్నారు.  మిషన్ కాకతీయకు రూ.5వేల కోట్లు గ్రాంట్ ఇవ్వాలని, మిషన్ భగీరథకు రూ.19,500 కోట్లు గ్రాంట్ ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది.. వీటిని పూర్తి చేసినా కేంద్రం నిధులు ఇవ్వలేదని  కేసీఆర్ లేఖలో గుర్తు చేశారు. అలాగే ఇటీవల రాష్ట్రాలు చేసే అప్పులపై కేంద్రం కొత్త నిబంధన తీసుకొచ్చింది.. ఈ కొత్త నిబంధనలతో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి బ్రేక్ పడుతుందన్నారు.
KCR Letter : నీతి ఆయోగ్ నిరర్థక సంస్థ - అందుకే హాజరు కావడంలేదని మోదీకి కేసీఆర్ లేఖ !
 
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది.. రూపాయి విలువ పడిపోయింది.. నిరుద్యోగంతో పాటు ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.. ఇలాంటి అంశాలపై కేంద్రం చర్చించడం లేదని.. దేశంలో నీతి ఆయోగ్ అనేది నిరర్ధక సంస్థగా మారిపోయింది.. నీతి ఆయోగ్‌లో మేథోమథనం జరగడంలేదు.. అదో భజన బృందంగా మారిపోయిందని విమర్శించారు. ప్రణాళికా సంఘం ఉన్నప్పుడు ప్రతీ అంశంపై విస్తృత చర్చ జరిగేదన్నారు. రాష్ట్రాలకు భాగస్వామ్యం ఉండేదన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రాలకు అసలు భాగస్వామ్యమే లేకుండా పోయిందని కేసీఆర్ లేఖలో అసంతృప్తి వ్యక్తం చేశారు. నీతి ఆయోగ్ సమావేశాల్లో అసలు ఉపయోగపడే చర్చలే లేవన్నారు. అందులే పాల్గొనే ముఖ్యమంత్రులకు మాట్లాడేందుకు కొన్ని నిమిషాల సమంయ కూడా కేటాయించడం లేదని కేసీఆర్ గుర్తు చేశారు.
KCR Letter : నీతి ఆయోగ్ నిరర్థక సంస్థ - అందుకే హాజరు కావడంలేదని మోదీకి కేసీఆర్ లేఖ !

దేశంలో అసహనం పెరిగిపోయిందని.. బుల్డోజర్లు, ఎన్ కౌంటర్లు, మత పరమైన వివాదాలు , అంతర్జాతీయ విమర్శలతో దేశానికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అయినా కేంద్రం ఇంత వరకూ చర్యలు తీసుకోలేదని స్పష్టం చేశారు. టీమ్ ఇండియా అనిచెబుతున్నారు కానీ నిర్ణయాలన్నీ వన్ సైడెడ్‌గా జరుగుతున్నాయన్నారు. చివరికి ప్రభుత్వాలు అప్పులు తీసుకునే విషయంలోనూ కట్టడి చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం నిర్ణయాలు రాష్ట్రాల అభివృద్దిపై ప్రభావం చూపిస్తున్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు.
KCR Letter : నీతి ఆయోగ్ నిరర్థక సంస్థ - అందుకే హాజరు కావడంలేదని మోదీకి కేసీఆర్ లేఖ !

వ్యసాయ చట్టాలతో వ్యవసాయ రంగం..  పవర్ సెక్టార్‌ను విద్యుత్ సంస్కరణల పేరుతో ధ్వంసం చేశారని కేసీఆర్ విమర్శించారు. ఆలిండియా సర్వీసెస్ రూల్స్ను కూడా రాష్ట్రాలకు వ్యతిరేకంగా మార్చేసే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రాలకు పన్నుల ద్వారా అధిక ఆదాయం.. కేంద్రానికి తక్కువ ఆదాయం ఉండాలన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రాల ఆదాయాలను కూడా కేంద్రం తీసుకుంటోందని ఇది ప్రజల్ని వంచించడమేనన్నారు. 

రాష్ట్రాలు అభివృద్ది చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ కారమంగా నీతిఆయోగ్ సమావేశానికి తాను హాజరు కావడం లేదని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.  

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Land Issues:తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
తెలంగాణలోనూ 22ఎ సమస్యలకు పరిష్కారం! శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
అత్యంత లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
కోకాపేటలో లగ్జరీగా Trump Towers.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో మరో మైలురాయి, ధర వింటే షాక్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
Embed widget