అన్వేషించండి

KTR in Sircilla: సొంత ఇలాకా సిరిసిల్లలో కేటీఆర్‌కు చేదు అనుభవం! మహిళా రైతు ప్రశ్నల వర్షం

Telangana News: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సొంత నియోజకవర్గం సిరిసిల్లలో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ మహిళా రైతు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ను నిలదీశారు.

Woman Farmer questions KTR in Sircilla- సిరిసిల్ల: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కేటీఆర్ కు సొంత ఇలాకా సిరిసిల్ల నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. ఎన్నో ఏళ్లుగా సమస్యలు ఎదుర్కొంటున్నాం, ఇంకెప్పుడు పరిష్కారం చూపిస్తారని ఓ మహిళా రైతు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను నిలదీశారు. త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపిస్తామని కేటీఆర్ ఆ మహిళా రైతును సముదాయించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


KTR in Sircilla: సొంత ఇలాకా సిరిసిల్లలో కేటీఆర్‌కు చేదు అనుభవం! మహిళా రైతు ప్రశ్నల వర్షం

ఎన్నడు ఇస్తరు.. కేటీఆర్ ను ప్రశ్నించిన మహిళా రైతు

సిరిసిల్ల పరిధిలోని పెద్దూరులో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెడికల్ కాలేజీకి ఇచ్చిన వ్యవసాయ భూములపై  బోనాల లక్ష్మీ అనే ఓ మహిళా రైతు ఈ సందర్భంగా కేటీఆర్ ను ప్రశ్నించారు. మెడికల్ కాలేజీ కోసం రెండు ఎకరాలు భూమి ఇచ్చానని, అందుకు పరిహారం ఇవ్వలేదని తమకు న్యాయం జరగలేదని కేటీఆర్ ను ఆమె నిలదీశారు. కలెక్టర్ కు చెప్పి న్యాయం చేపిస్తానని కేటీఆర్ ఆమెను సముదాయించే ప్రయత్నం చేశారు. అయితే తన డబుల్ బెడ్ రూం ఇంకెప్పుడు ఇస్తారు అని మహిళా రైతు ప్రశ్నించడంతో కేటీఆర్ అవాక్కయ్యారు. గవర్నమెంట్ కు భూమి ఇస్తే కచ్చితంగా ప్లాట్ వస్తుందని, ఆందోళన చెందవద్దన్నారు. మార్కెట్లో వసతులు, సెక్యూరిటీ సరిగ్గా లేవని.. తమను బెదిరిస్తున్నారని మహిళా రైతు కేటీఆర్ కు చెప్పి వాపోయారు.  

సిరిసిల్లలోని స్థానిక రైతు బజార్‌లో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించగా.. కూరగాయలు అమ్ముకునే రైతులు కేటీఆర్ దృష్టికి పలు సమస్యల్ని తీసుకువచ్చారు. మార్కెట్లో ఎండకు తట్టుకోలేకపోతున్నామని, చలువ పందిర్లు ఏర్పాటు చేయాలని కోరారు. వేసవి కాలం కనుక తాగునీరు సైతం అందించాలని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చాలని కోరారు. 24 గంటల్లో తాత్కాలికంగా ఏర్పాట్లు చేసి, త్వరలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

గుడి ముఖ్యమైతే కేసీఆర్ ఎప్పుడో యాదాద్రి ఆలయం కట్టారు..
పేదల కోసం కొట్లాడే వాళ్లకు మాట్లాడే వాళ్లకు ఓటేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో సిరిసిల్ల వాళ్లు కూడా ఓట్లేస్తే బీజేపీ వాళ్లు ఏం చెబుతున్నారు. రాముడి గుడి కట్టినం, మాకు ఓటేయండి అంటున్నారు. అయితే కేసీఆర్ యాదాద్రిలో అద్భుతమైన ఆలయం కట్టలేదా, అభివృద్ధి చేయకుండా ఓట్లు అడిగే వాళ్లకు ఓట్లు వేయవద్దన్నారు.  రోడ్లు వేసినం, కాలేజీలు తెచ్చినం, నీళ్లు ఇచ్చినం, రాజన్న సిరిసిల్ల చేశామన్నారు. నవీన శిల్పులతో అద్భుతమైన శిల్పకళతో యాదాద్రిలో గుడి కట్టడం మాత్రమే కాదు, ఆధునిక దేవాలాయాల్లాంటి ప్రాజెక్టులు కట్టి వాటికి దేవుళ్ల పేర్లే పెట్టామని గుర్తుచేశారు.

రాజరాజేశ్వర సాగర్, రంగనాయక సాగర్,  మల్లన్న సాగర్ అని పేర్లు పెట్టాం. కొందరు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. హిందువు అయితే మాకు ఓటేయండని బీజేపీ వాళ్లు అంటున్నారు. వాళ్లు రాకముందు హిందువులు లేరా, దేవుళ్లు లేరా అని ప్రశ్నించారు. బండి సంజయ్ అనే వ్యక్తి ఎన్నికల తరువాత ఒక్కసారి కూడా కనిపించలేదని, ఆయనకు మళ్లీ ఓట్లు ఎందుకు వేయాలని కేటీఆర్ ప్రశ్నించారు. అకౌంట్లు తెరిస్తే ఖాతాల్లో లక్షల రూపాయల ధనం వేస్తామన్న ప్రధాని మోదీ ఏం చేశారు. రాజధర్మం పాటించి ప్రభుత్వం పేదలను పట్టించుకోవాలి కానీ మతం పేరిట రాజకీయాలు చేయడం తగదన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News:ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం అద్భుతంగా పని చేస్తోంది--కళ్లు నెత్తికెక్కే ఓడిపోయాం- కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Kaleshwaram Project: కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
కాళేశ్వరం నీళ్లు వదలకుంటే హైదరాబాద్‌లో బిందెల యుద్ధమే :ABP Desamతో మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ టి. వెంటేశం
Telangana Latest News: 9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 
9,000 రూపాయల ఖరీదు చేసే డ్రోన్ 91 రూపాయలకే! టీబీ రోగుల పాలిట వరంలా సేవలు! 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget