అన్వేషించండి

Maoists in Telangana: తెలంగాణలో మావోల కదలికలు, అప్రమత్తమై రివార్డులు ప్రకటించిన పోలీసులు

Maoists in Telangana: ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు గుర్తించిన పోలీసులు అప్రమత్తం అయ్యారు. పలువురు మావోల పేరిట రివార్డులు ప్రకటించి, జిల్లా మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు.

Maoists in Telangana: ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతానికే పరిమితమైన మావోయిస్టులు ఇటీవల కాలంలో జరిగిన పలు సంఘటనలతో కలకలం సృష్టిస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా ఉన్న వెంకటాపురంలో కాల్పుల సంఘటన మరువక ముందే చర్ల మండలంలో ఇన్‌ఫార్మర్‌ నెపంతో ఉప సర్పంచ్‌ను మట్టుబెట్టి పోలీసులకు సవాల్‌ విసిరారు. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తుండటం, మావోయిస్టు సానుభూతి పరులను గుర్తించి వారిని తిరిగి జన జీవన స్రవంతిలో కలిసేలా చేస్తుండటంతో ఇప్పటి వరకు మావోలు కదలికలు తగ్గుముఖం పట్టాయని అంతా బావించారు.

తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతంతోపాటు ఛత్తీస్‌గఢ్ సరిహద్దుగా ఉన్న చర్ల, వెంకటాపురం మండలాల్లో తమ ఉనికిని చాటుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు కొత్తగా రిక్రూట్‌మెంట్‌ చేసుకునే పనిలో భాగంగా అడవిలో ఉన్న గ్రామాలపై దృష్టి సారించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే భద్రాద్రి జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించిన చర్ల మండలంలోనే... ఇన్‌ ఫార్మర్‌ అన్న నెపంతో ఓ ఉప సర్పంచ్‌ను హత్య చేయడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. 

మైదాన ప్రాంతంపై సైతం మావోల దృష్టి.. 
ఓ వైపు పోలీసులకు సవాలు విసురుతూనే మరోవైపు మైదాన ప్రాంతాల్లో కార్యకలాపాలు సాగించేందుకు మావోలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గోదావరి పరివాహక ప్రాంతాన్ని తమ షెల్టర్‌ జోన్‌గా మార్చుకోవడంతోపాటు కొత్తగా రిక్రూట్‌మెంట్‌ చేసుకునే పనిలో పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. చర్ల నుంచి మంచిర్యాల వరకు ఉన్న గోదావరి ప్రాంతంలో అత్యధికంగా అడువులు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో అనువైన సమయంగా భావించి కార్యకలాపాలకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతానికే పరిమితమైన మావోయిస్టులను.. తెలంగాణలో కార్యకలాపాలు చేయకుండా నిలువరించేందుకు పోలీసులు వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. 

రూ.5 నుంచి 20 లక్షల వరకు రివార్డులు.. 
మైదాన ప్రాంతంలో కదలికలు పెంచిన మావోయిస్టులను గుర్తించిన పోలీసులు వారిపై రివార్డులతో ఉన్న పోస్టర్లను విడుదల చేశారు. గోదావరి పరివాహక ప్రాంతంలో మావోలు కనిపిస్తే వెంటనే సమాచారం అందించిన వారికి రివార్డు ప్రకటిస్తామని తెలిపారు. పోలీసులు విడుదల చేసిన జాబితాలో చర్ల - శబరి ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ, భద్రాద్రి కొత్తగూడెం – అల్లూరి సీతారామరావు జిల్లాల డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్‌ అలియాస్‌ కొయ్యాడ సాంబయ్య, మిలీషియా కమాండర్‌ బాబు అలియాస్‌ వెట్టి దేవా, చర్ల ప్లాటూన్‌ ఇన్‌చార్జ్‌ మధు అలియాస్‌ గజేందర్, ఏరియా కమిటీ మెంబర్‌ రాజేష్‌ అలియాస్‌ మడకం ఎర్రయ్య, సందీప్‌ అలియాస్‌ కోనయ్య, పద్దం నందయ్య అలియాస్‌ రామ్‌దా, రజిత అలియాస్‌ మడకం కోసిలు ఉన్నారు. వీరిపై రూ.20 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పోలీసులు రివార్డు ప్రకటించారు.

పోస్టర్ ను విడుదల చేసిన రోహిత్.. 
భద్రాచలం ఏసీపీ రోహిత్‌ రాజ్‌ ఈ పోస్టర్‌ను విడుదల చేశారు. అయితే మైదాన ప్రాంతంలో వీరి కదలికలు గుర్తించిన నేపథ్యంలోనే వీరిపై ఉన్న రివార్డుల పోస్టర్‌ను పోలీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలపై పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేయడంతో ఎలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది.  

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో భారత్‌పై ఇంగ్లాండ్ ఘన విజయం
TRS Chief Kavitha Reaction : కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
కొత్త పేరు ఇచ్చేది లేదు, న్యాయపోరాటం చేస్తా: ఈసీ అభ్యంతరాలపై కవిత తొలి రియాక్షన్!
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Telangana Police Recruitment 2026: తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!
తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ కొలువులు జాతర! ఐదు వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లికు ఏడుగురు మత్స్యకారులు గల్లంతు.. రంగంలోకి నేవీ, కోస్ట్‌గార్డ్!
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Monsoon Foods To Avoid : వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
వర్షాకాలంలో తినకూడని ఫుడ్స్ లిస్ట్.. చేపలు, రొయ్యలు, పీతలు, ఆకుకూరలు తినకూడదా?
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
టైర్‌పై 91, 94, XL అని ఎందుకు ఉంటుంది? టైర్ లోడ్ రేటింగ్ గురించి ప్రతి డ్రైవర్ తెలుసుకోవాల్సిన విషయాలు
మీ కారు టైర్‌పై ఉన్న లోడ్ రేటింగ్‌ను ఎప్పుడైనా గమనించారా? దీని అర్థం తెలిస్తే షాక్ అవుతారు!
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Ongole Crime News: టూర్‌కు వెళ్లిన ఫ్యామిలీ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
ఒంగోలులో ఓ ఇంట్లో భారీ చోరీ.. 700 గ్రాముల బంగారం, 8 కేజీల కేజీల వెండి మాయం!
Embed widget