అన్వేషించండి

Telangana Govt Schools: సర్కారు బడుల్లో సోలార్ ప్యానెల్స్ - విద్యుత్ భారం తగ్గించుకునేందుకు నయా ప్లాన్ !

Telangana Govt Schools: తెలంగాణలోని సర్కారు బడుల్లో సోలార్ ప్యానెల్స్ బిగించనున్నారు. విద్యుత్తు నిర్వహణ భారాన్ని తగ్గించేందుకు విద్యాశాఖ ఈ చర్యలు చేపట్టింది. 

Telangana Govt Schools: ఇప్పటికే పలు సంస్కరణలు చేపట్టిన విద్యాశాఖ మరో కీలక అడుగు వేస్తోంది. ప్రభుత్వ బడుల్లో విద్యుత్ నిర్వహణ భారాన్ని తగ్గించేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మన ఊరు మనబడి కింద అభివృద్ధి పనులు చేపట్టిన పాఠశాలల్లో సోలార్ విద్యుత్ నిర్వహణ సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా తెలంగాణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ రెడ్కో విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో సౌర విద్యుత్తు ఫలకలను ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తొలి విడుతలో 13 పాఠశాలల్లో ఫిక్స్ చేయనుండగా ఎంపిక చేసిన స్కూల్లో రెండు కిలోవాట్స్ సామర్థ్యం కలిగిన విద్యుత్ ఉత్పత్తి చేయనున్నారు. దీనికి సంబంధించి రెడ్కో అధికారులు సోమవారం నుంచి వివరాలు సేకరించినన్నారు. ఈ నివేదిక ఆధారంగా పాఠశాలల్లో నెట్ మీటరింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు.

మంజూరవుతున్న నిధుల్లో ఎక్కువగా కరెంట్ బిల్లుల చెల్లింపు..

ప్రభుత్వ స్కూళ్లకు కొన్ని నిధులే వస్తుండడంతో నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో కనీసం చాక్ పీస్ లను కూడా కొనుగోలు చేసుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం విద్యా సంవత్సరానికి సంబంధించి ఇటీవల సగం వాటా నిర్వహణ నిధులు మంజూరు చేశారు. వంద మంది లోపు విద్యార్థులు ఉంటే ఏడాదికి రూ.25 వేలల్లో సగం అంటే రూ.12,500, 100 మందికిపైగా ఉన్నవాటికి రూ.50,000 ఉండగా 25 వేలు మంజూరు చేయడం కాస్త ఊరటం కలిగిస్తోంది. మంజూరు అవుతున్న నిధుల్లో ఎక్కువగా కరెంట్ బిల్లుల చెల్లింపునకు ఖర్చు చేస్తున్నారు. కొన్ని నెలలుగా బిల్లు కట్టకపోవడం వల్ల బకాయిలు పెరిగిపోతుండడంతో పలుచోట్ల కనెక్షన్లు తొలగిస్తున్నారు. మౌలిక వసతులపై అధికారులు సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. సౌర పలకల ఏర్పాటు ఇతర పరిస్థితులపై సర్వే చేసి నివేదిక రూపొందించనున్నారు. ఈ క్రమంలోనే స్కూళ్లలో అవసరం, ఉత్పత్తిపై సాధ్యాసాధ్యాలను అంచనా వేయనున్నారు.

సోలార్ ప్యానెళ్ల ద్వారా గణనీయంగా తగ్గనున్న విద్యుత్ బిల్లులు..

ఇప్పటి వరకు ప్రభుత్వ సంస్థల్లో ఉత్పత్తి చేస్తున్న సౌర విద్యుత్ లో అవసరం మేరకు వాడుకొని మిగులిన దాన్ని వదిలేసే పరిస్థితి ఉంది. ఇకపై అలా కాకుండా విద్యుత్ వృథా చేయకుండా అవసరాల మేరకు వినియోగించుకొని మిగిలిన దాన్ని గ్రిడ్ ద్వారా డిస్కౌంట్లకు విక్రయించుకునే అవకాశం ఉంది. బడుల్లో కంప్యూటర్లు, ఫ్యాన్లు, మోటార్ నడవడానికి ఎక్కువ కరెంట్ వినియోగిస్తున్నారు. సౌర పలకలు ఏర్పాటుతో ప్రతి పాఠశాలలో రెండు కిలో వాట్స్ విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారు. ఒక కిలోవాటు ఉత్పత్తి చేయడానికి రూ.50,000 చొప్పున రెండింటికి కలిపి లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సోలార్ ద్వారా ఉత్పత్తి అయినా కరెంటును గ్రిడ్ కు అనుసంధానిస్తారు. బ్యాటరీ ఇన్వర్టర్ ద్వారా సౌర విద్యుత్తు నిలువ చేసుకుని పాఠశాలల్లో అవసరం మేరకు వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలో పెద్ద పల్లి జిల్లాలో 17 పాఠశాలలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో 18, కరీంనగర్ జిల్లాలో 27, జగిత్యాల జిల్లాలో 41 పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఈ పథకం గనుక అమలవుతే విద్యుత్తు ఖర్చులు గణనీయంగా తగ్గుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Pawan Kalyan: పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
పార్టీ పెట్టడానికి తెలంగాణే స్ఫూర్తి - యువత రాజకీయాల్లోకి రావాలి - కొండగట్టులో పవన్ పిలుపు
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
India Squad For NZ ODI Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
న్యూజిలాండ్ వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించిన BCCI, శ్రేయాస్ అయ్యర్ ఎంట్రీ.. వారిద్దరూ ఔట్
Amaravati houses ready: అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
అమరావతిలో అధికారులు, ప్రజాప్రతినిధుల ఇళ్లకు తుది మెరుగులు - ఏప్రిల్‌లో కేటాయిస్తామని మంత్రి నారాయణ ప్రకటన
JEE Advanced Exam 2026: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ డేట్ ఫిక్స్.. రిజిస్ట్రేషన్ చివరి తేదీ, రూల్స్ పూర్తి వివరాలు
8th Pay Commission: కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
కేంద్ర ఉద్యోగుల జీతం ఎప్పుడు పెరుగుతుంది? 8వ వేతన సంఘం సిఫార్సులపై ఉత్కంఠ
Embed widget