అన్వేషించండి

Telangana News: బీ"ఆర్‌"ఎస్‌ది ఫెవికాల్ బంధం- ట్రిపుల్ ఆర్‌ వసూళ్లను మించేలా డబుల్ ఆర్ వసూళ్లు - వేములవాడ ప్రచార సభలో మోదీ విమర్శలు

Telugu News: వేములవాడలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి మోదీ పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌పై విరుచుకు పడ్డారు. వాళ్లంతా కుటుంబ కోసమే శ్రమిస్తారని ఆరోపించారు.

Modi Vemulawada Tour: వేములవాడలో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. పదేళ్లలో తన పనితనం చూసి ఈసారి ఓట్లు వేయాలన్నారు మోదీ. ఇక్కడ ఉన్న పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. వాళ్లకు ప్రజల బాగోగులు పట్టబోవని విమర్శించారు. ప్రజల తరఫున మొదటి నుంచి ఇక్కడ పోరాటాలు చేస్తోంది ఒక్క బీజేపీ మాత్రమే అన్నారు. 

బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసును తొక్కిపెట్టిందని పూర్తిగా విచారణ జరపలేదన్నారు మోదీ. కాంగ్రెస్ కూడా అదే చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరంలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించిందని గుర్తు చేశారు. ఇప్పుడు దాన్ని విచారణ చేయకుండా కాలయాపన చేస్తోందని విమర్శించారు. 

తెలుగులో ట్రిపుల్ ఆర్‌ సినిమా వచ్చిందని... దాని కంటే ఇప్పుడు డబుల్ ఆర్‌ ట్యాక్స్ గురించి చర్చ సాగుతోందన్నారు ప్రధాని. ట్రిపుల్ ఆర్‌ వసూళ్ల కంటే ఎక్కువ ఈ వసూళ్లు ఉన్నాయని ఎద్దేవా చేశారు.  తెలంగాణలో ఇప్పుడు అమలు అవుతున్న ఆర్‌ ఆర్‌ ట్యాక్స్ గురించి దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందని అన్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు దీని గురించి మాట్లాడుకుంటున్నారన్నారు. ప్రతి పిల్లాడికి కూడా తెలుసు అన్నారు. ఇక్కడ ఆర్‌ అనే వ్యక్తి తెలంగాణను లూటీ చేసి ఢిల్లీలో ఉన్న ఆర్‌కు ఇస్తున్నారని ఆరోపించారు. 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు తొలి ప్రాధాన్యం కుటుంబమేనన్నారు ప్రధానమంత్రి మోదీ. బీజేపీకి మాత్రం తొలి ప్రాధాన్యం దేశమే ఉంటుందని తెలిపారు. కుటుంబ వల్ల, కుటుంబం కోసం, కుటుంబం చేత నినాదంతోనే ఈ రెండు పార్టీలు పని చేస్తాయని అన్నారు. అందుకే ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మబొరుసు అన్నారు. 
తెలంగాణ ప్రజల కలలను రెండు పార్టీలు కాలరశాయాన్నారు మోదీ. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అద్భుతాలు జరుగుతాయని అంతా భావించారు కానీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ వాటిని చిదిమేశారన్నారు. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ ఆస్తులు కూడబెట్టేందుకు మాత్రమే పని చేస్తున్నాయన్నారు. 
రెండు పార్టీలది ఫెవికాల్ బంధమన్నారు మోదీ. వారి ఆటలను, ఆర్‌ పని తీరును ప్రజలు గమనిస్తున్నారని కచ్చితంగా ఈ ఎన్నికల్లో రెండు పార్టీలకు గట్టిగానే ప్రజలు బుద్ది చెబుతారని అన్నారు మోదీ. మాజీ ప్రధాని పీవీ కుటుంబాన్ని కూడా గౌరవించుకోలేదన్నారు. ఆపని చేసింది ఒక్క బీజేపీ మాత్రమే అన్నారు. ఆయన్ని గౌరవించకపోగా... తీవ్రంగా అవమానించిందని ఆరోపించారు. 

అంతకు ముందు వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధానమంత్రి మోదీ ప్రత్యేక పూజలు చేశారు. కోడెలు దానం ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. 

నిన్న హైదరాబాద్ చేరుకున్న ప్రధామంత్రి మోదీని మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుటుంబం కలిసింది. పీవీకి భారత రత్న ప్రకటించనందుకు థాంక్స్ చెప్పింది. ఈ సందర్భంగా చాలా అంశాలపై మాట్లాడుకున్నట్టు మోదీ ట్వీట్ చేశారు. 

Image

Image

Image

Image

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
హిమాచల్ ప్రదేశ్‌ ఘోర ప్రమాదం- లోయలో పడ్డ బస్‌, ఏడుగురు మృతి
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Telangana NEET Cutoff: తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
తెలంగాణలో ఎంబీబీఎస్ సీటు రావాలంటే నీట్‌ ర్యాంక్ ఎంత ఉండాలి? పూర్తి కటాఫ్ వివరాలు ఏంటీ?
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Metro RTC Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
హైదరాబాద్‌ వాసులకు గుడ్‌ న్యూస్! ఆర్టీసీ, మెట్రోకు ఒకటే పాస్ ! ఎప్పటి నుంచి ప్రారంభం?
Cheyutha Pensions: తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
తెలంగాణలో చేయూత పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు?
Amaravati Latest News: అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
అమరావతి పనుల్లో కార్మికుడి మృతిపై వరల్డ్ బ్యాంకు బృందం ఆగ్రహం- విచారణకు కమిటీ ఏర్పాటు 
Kavitha BC Vote Bank: బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
బీసీలను ఓటు బ్యాంక్‌గా చేసుకోవడమే కవిత టార్గెట్ - కేసీఆర్ తరహాలోనే ప్రయత్నాలు - వర్కవుట్ అవుతుందా?
లక్ష రూపాయలకే E3 Trion ఎలక్ట్రిక్ స్కూటర్.. 82km స్పీడ్‌, 165km రేంజ్‌, AI ఫీచర్లు
ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ భలే ఉందే! రేటు లక్ష రూపాయలే.. ఏకంగా 165km రేంజ్‌!
TDP vs JSP Social Media War: టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
టీడీపీ వర్సెస్ జనసేన - బయట దోస్తీ.. సోషల్ మీడియాలో ఘోరమైన కుస్తీ! ఎవరు సాల్వ్ చేస్తారు?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?
జెన్-జెడ్ తుఫాన్: సీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతుందా? 2027లో భారత రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి?బోతున్నాయి?
Korean Kanakaraju Collection Day 1: కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
కొరియన్ కనకరాజు ఫస్ట్ డే కలెక్షన్స్... వరుణ్ తేజ్‌కు డీసెంట్ ఓపెనింగ్... ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Embed widget