By: ABP Desam | Updated at : 08 Feb 2023 06:17 PM (IST)
Edited By: jyothi
కొండగట్టు ఆలయాభివృద్ధికి 100 కోట్ల నిధులు
Kondagattu Temple: జగిత్యాల జిల్లాలో కొలువై ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం వంద కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులను కేటాయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ లో జగిత్యాల జిల్లా పర్యటనలో సీఎం కేసీఆర్ కొండగట్టు అభివృద్ధికి రూ.100 కోట్లు విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి సన్నిధికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఆలయాన్ని అద్భుతంగా నిర్మించేందుకు రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే వచ్చి ఆగమశాస్త్రం ప్రకారం... భారతదేశంలోనే సుప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పిన ఎమ్మెల్యే
కొండగట్ట ఆలయ అభివృద్ధికి వంద కోట్ల రూపాయల నిధులను విడుదల చేసిన సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో దేవాలయాల అభివృద్ధికి చిన్నచూపు చూశారని తెలిపారు. సీఎం ప్రత్యేక దృష్టితో యాదాద్రి, వేములవాడ దేవస్థానాలు అభివృద్ధి చెందాయని వెల్లడించారు. సీఎం ప్రత్యేక చొరవతో కొండగట్ట దశ, దిశ మారనుందని వెల్లడించారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వేములవాడలో పార్కింగ్ ఇబ్బందులు తప్పాయని పేర్కొన్నారు. హిందుత్వ వాదిగా చెప్పుకునే ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క పైసా కూడా తీసుకురాలేదని విమర్శించారు.
కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి 100 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తు జివో జారి చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ గారికి, మంత్రి @KTRBRS గారికి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు @vinodboianpalli గారికి, ఎమ్మెల్సీ @RaoKavitha గారికి, @MPsantoshtrs గారికి కృతజ్ఞతలు. pic.twitter.com/5RDGBabBPh
— Sunke Ravishankar (@RavishankarTRS) February 8, 2023
అభివృద్ధి పట్ల చిత్తసుద్ధి ఉంటే కేంద్రం నుంచి తీసుకురావాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ వెల్లడించారు. కొండగట్టుకు నిధులు మంజూరుకు కృషి చేసిన మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ కవిత, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
కొత్త విధానంలో ఇంటర్ మూల్యాంకనం, ఫలితాల వెల్లడి ఎప్పుడంటే?
TS Constable Technical Papers: నేడే కానిస్టేబుల్ డ్రైవర్, మెకానిక్ టెక్నికల్ పరీక్షలు!
Inter Academic Calender: ఇంటర్ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఈ ఏడాది వచ్చే సెలవులివే!
TS Police SI Exam: ఏప్రిల్ 3 నుంచి ఎస్ఐ, ఏఎస్ఐ తుదిపరీక్ష హాల్టికెట్లు, పరీక్షలు ఎప్పుడంటే?
Medical Seats: కొత్తగా పది మెడికల్ పీజీ సీట్లు, కాకతీయ మెడికల్ కాలేజీకి కేటాయింపు!
RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ - కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..
Samantha : అమ్మది అలెప్పీ అయినా మలయాళం నేర్పలేదు - కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్
LSG Vs DC: వార్నర్ సేనను మట్టికరిపించిన లక్నో - 50 పరుగులతో ఘనవిజయం!
Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు