అన్వేషించండి

Karimnagar: కరీంనగర్‌లో తొలిసారిగా కిసాన్ గ్రామీణ మేళా, పాల్గొన్న ఎంఎస్పీ మెంబర్స్

కరీంనగర్ డైరీ ఛైర్మన్ రాజేశ్వరరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జలపతిరావు మాట్లాడుతూ పాడి పరిశ్రమ, సాగు పద్ధతులపై వివరించారు.

ఇప్పటివరకు శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని, దీంతో మరింత ఉత్పాదకతను సాధించవచ్చని కనీస మద్దతు ధర కమిటీ (MSP) ప్రతినిధి భూపేంద్ర సింగ్ మాన్ అన్నారు. గురువారం కరీంనగర్లో కిసాన్ జాగరణ మంచ్ అధ్యక్షుడు పొల్సాని సుగుణాకర్ రావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కిసాన్ గ్రామీణను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాలర్ తో పోల్చితే రూపాయి మారకం విలువ తగ్గుతుందని తెలిపారు. వ్యవసాయ ఎగుమతులు పెరుగుతున్నాయని.. స్వేచ్ఛ వాణిజ్యం వల్ల వ్యవసాయ రంగానికి మరింత ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. 

అందులో భాగంగానే కేంద్రం మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చిందని కొన్ని వర్గాలు వ్యతిరేకించడంతో ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకుందని అన్నారు. వ్యవసాయ రంగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మరో సభ్యుడు గుణవంత్ పాటిల్ మాట్లాడుతూ.. సాంప్రదాయ పంటల వల్ల రేట్లు తగ్గే అవకాశం ఉందని,  అలాంటప్పుడు ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్ళాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారని వివరించారు. భువనేశ్వర్ లో జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగిందన్నారు. వరి, గోధుమ పంటలను మాత్రమే పండిస్తూ కొనుగోళ్లకు ప్రభుత్వంపై ఆధారపడటం వల్ల మద్దతు ధర సమస్య వస్తుందని అన్నారు. 

మరో సభ్యుడు గుణి ప్రకాష్ మాట్లాడుతూ.. విజ్ఞానాన్ని వ్యవసాయానికి జోడించాలని చెప్పారు. సభకు అధ్యక్షత వహించిన మేళా కన్వీనర్ పొల్సాని సుగుణాకర్ రావు మాట్లాడుతూ రైతన్న లేకుంటే అన్నం లేదని అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. రైతులు పొలాలు అమ్ముకుంటుంటే రియల్టర్లు కొనుగోలు చేస్తున్నారని మార్కెట్లలో రైతులను మోసం చేస్తున్న పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, ఆధునిక పద్ధతులను రైతులకు వివరించాలనే ఉద్దేశంతో పాటు.. రైతు గ్రామీణ ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణలో మొదటిసారిగా మేళాను కరీంనగర్లో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 

కరీంనగర్ డైరీ ఛైర్మన్ రాజేశ్వరరావు, వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జలపతిరావు మాట్లాడుతూ పాడి పరిశ్రమ, సాగు పద్ధతులపై వివరించారు. వారి పత్తి మొక్కజొన్న ఇతర పంటలు విత్తనాలు సాగు విధానం పనిముట్లు యంత్రాలు అధిక దిగుబడి సాధించడానికి అవలంబించాల్సిన పద్ధతులపై శాస్త్రవేత్తలు, నిపుణులు, పొలాస వ్యవసాయ అధికారులు వివరించారు. కరీంనగర్ మార్కెట్లో కూరగాయలు అమ్మే మహిళలు మద్దతు ధర కమిటీ సభ్యులను పూలమాల, శాలువాతో సత్కరించారు. 

తర్వాత విక్రయదారుల సంఘం బాధ్యులు లక్ష్మీని కమిటీ సభ్యులు, నిర్వహకులు సన్మానించారు. సభ ఆధ్వర్యంలో కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న కిసాన్ గ్రామీణ మేళా సందడిగా మారింది. ఇందులో జాతీయ అంతర్జాతీయ స్థాయి పేరు గాంచిన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. మేళాకు ఉమ్మడి జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి రైతులు భారీగా తరలివచ్చారు. మేళాకు వచ్చిన వాళ్లంతా తిరుగుతూ స్టాళ్లను పరిశీలించడంతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన యంత్రాలు, పనిముట్లు, వాహనాల పనితీరు ఎరువులు విత్తనాలు ఇతర అంశాలపై ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మేళాలో వివిధ తయారీ సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. ఇందులో కొత్త యంత్రాలు, పనిముట్లు, డ్రోన్ లాంటివి ఉన్నాయి. వరి కోత, నాటు వేసే గడ్డిని కట్టలుగా కట్టే మొదలగు యంత్రాలను ప్రదర్శనలో ఉంచారు.

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేసి, తగిన చర్యల సూచనకు కమిటీ ఏర్పాటు
Bandi Sanjay vs Etala Rajender: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం! బండి, ఈటల మధ్య సయోధ్య చర్చలు! లక్ష్మణ్‌ ఇంట్లో భేటీ!
BRS Yuva Sangrama Sadassu: బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
బీఆర్‌ఎస్ యువ సంగ్రామ సదస్సుకు భారీగా తరలి వస్తున్న నేతలు! కీలక నేతల అరెస్టుతో టెన్షన్‌!
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్‌ను గజ్వేల్‌లోనే సమాధి చేస్తాం, నేనున్నంత వరకూ బీఆర్ఎస్ గెలవదు: సీఎం రేవంత్ రెడ్డి
Bhogapuram International Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు.. ప్రధాని మోదీ చేతుల మీదుగానే
Srikanth Best Hindi Film: ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
ఉత్తమ హిందీ చిత్రంగా శ్రీకాంత్ బొల్లా బయోపిక్.. తెలుగు తేజం కథకు జాతీయ గౌరవం!
Rohit Sharma News: లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
లార్డ్స్ మైదానంలో చెమ‌టోడ్చిన‌ రోహిత్ .. ఫ్యాన్స్ హంగామా మధ్య గంభీర్ తో సీక్రెట్ మీటింగ్ 
Nara Lokesh Meets Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
పవన్ కళ్యాణ్‌ను ఎంతో అప్యాయంగా పరామర్శించిన నారా లోకేష్.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Apple వినియోగదారులకు పండగే.. త్వరలో కొత్త OLED డిస్ప్లేతో కొత్త ఐప్యాడ్ మినీ లాంచ్
Raw NTR Press Meet: ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
ఎన్టీఆర్ ఆపేయమంటే ఆపేస్తా... అప్పటి వరకు 'ఊరు వాడ' కంటిన్యూ చేస్తా - 'రా ఎన్టీఆర్' ఫౌండర్ సాయిరూప్
CM Revanth Reddy: ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
ఆహార, ఔషధాల కల్తీల నిరోధానికి కఠిన చట్టం, CURE లో పైలెట్ ప్రాజెక్ట్: సీఎం రేవంత్ రెడ్డి
Embed widget