అన్వేషించండి

Karimnagar News: డ్యూటీకి డుమ్మా కొట్టే టీచర్లకు బయోమెట్రిక్ విధానంతో చెక్!

 Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పాఠశాలలో బయోమెట్రిక్ విధానం మొదలు పెట్టనున్నారు. డ్యూటీకి డుమ్మాలు కొట్టే టీచర్లకతో ఈ విధానంతో చెక్ పెచ్చబోతున్నారు.

Karimnagar News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతినెలా వేలల్లో జీతాలు అందుకుంటూ.. వృత్తిపై నిబద్దతలేని కొందరు టీచర్లపై అదుపు తెచ్చేందుకు విద్యాశాఖ ఉన్నతాధికారులు పకడ్బందీగా ప్లాన్ చేశారు. హాజరు విషయంలో అవకతవగలకు పాల్పడుతూ తమ ఇష్టం వచ్చినట్టుగా వివరణలు ఇస్తున్న వారిని కంట్రోల్ చేసేందుకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు విధానం అమలుకు అంతా సిద్ధం చేశారు. సరైన సమయానికి విధులకు సక్రమంగా హాజరు కాని ఉపాధ్యాయులను దారిలో పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నం చాలా మందిలో ఆందోళన రేపుతోంది. సొంత పనులు వ్యాపారాలను చక్కబెట్టుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న ఉపాధ్యాయులతో పాటు, డిప్యూటేషన్ల పేరుతో కొనసాగుతున్న వారికి బయోమెట్రిక్ విధానం భయానికి గురి చేస్తుంది. 

ఆన్ డ్యూటీ, సర్దుబాట్ల పేరుతో డుమ్మాలు..

పాఠశాలకు ఇష్టం  వచ్చిన సమయాల్లో వెళ్లేవారు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దూర ప్రాంతాల్లోని బడుల్లో పనిచేస్తూ జిల్లా కేంద్రాల్లో సొంత గ్రామాల్లో ఉండేవారు నిర్మిత సమయానికి విధులకు హాజరయ్యే వారిలో వణుకు మొదలైంది. ప్రభుత్వం డిప్యూటేషన్ విధానాన్ని రద్దు చేసిన జిల్లాల్లో అడ్డదారుల్లో పలుకుబడి డిప్యూటేషన్లు, ఆన్ డ్యూటీ లు కొనసాగుతూనే ఉన్నాయి. పక్క జిల్లాలో పనిచేస్తున్న వారు కూడా కరీంనగర్ జిల్లాలో ఇప్పటికీ డిప్యుటేషన్ల పై పని చేస్తున్నారు. అన్టిల్ ఫర్దర్ ఆర్డర్ అని డిప్యూటేషన్ ఉత్తర్వులలో జిల్లా విద్యాశాఖ పేర్కొనడం ఇలాంటి వారికి కలిసి వస్తోంది. ఆన్ డ్యూటీల పేరుతో పలువురు సర్దుబాటు పేరుతో మరికొందరు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. బయోమెట్రిక్ హాజరు విధానం అమలుకు రంగం సిద్ధమవడంతో తమ పరిస్థితి ఏంటి అనే విషయంపై వారు ఆందోళన చెందుతున్నారు.

బయోమెట్రిక్ విధానంతో ఉపాధ్యాయులకు కళ్లెం..

ఇలాంటి వారు పనిచేస్తున్న పాఠశాలల్లో తప్పని సరిగా బయోమెట్రిక్ హాజరు చేయాల్సి ఉండడంతో పని చేస్తున్న బడులకు వెళ్లాల్సిందేనా అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ప్రత్యామ్నాయ మార్గాలను కూడా అన్వేషించే పనిలో కొందరు ఉన్నట్లు సమాచారం. జిల్లా విద్యాశాఖ ఎంఈఓ కార్యాలయాల్లో వివిధ రకాల కార్యక్రమాల అమలుకు ఆన్ డ్యూటీ పై కొనసాగుతున్న కొందరు ఉపాధ్యాయులు.. స్కూళ్ల వైపు వెళ్లడం లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. జిల్లాలోని 623 ప్రభుత్వ పాఠశాలబల్లో కొత్తగా బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తున్నారు. ఈ బడుల్లో ప్రస్తుతం 2,693 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలోని పాఠశాలల్లో అదనంగా ఉన్న 12 యంత్రాలను కరీంనగర్ కు తెప్పించారు. టెక్నీషియన్లు వాటిని అప్డేట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఈనెల రెండో వారం నుంచే అమలు..

మిగిలిన యంత్రాలను కూడా రెండు మూడు రోజుల్లో అధికారులు కరీంనగర్ కు తెప్పిస్తున్నారు. వాటిలో పాఠశాల వారీగా ఉపాధ్యాయుల వివరాలను వేలి ముద్రలకు సంబంధించిన వివరాలను పొందుపరచనున్నారు. ఈ నెల రెండో వారం నుంచి బయోమెట్రిక్ విధానం అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. దీంతో వివిధ కారణాలతో బడికి డుమ్మా కొట్టి ప్రైవేటు కార్యకలాపాలు చేస్తున్న ఉపాధ్యాయుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి వీలుంది. ఒకవైపు విద్యా ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ సరికొత్త సౌకర్యాలను అందిస్తూ ఉంటే కొందరి టీచర్ల వ్యవహారం వల్ల పేద విద్యార్థులకు చదువు సమస్యాత్మకంగానే మారుతోంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Advertisement

వీడియోలు

Hong kong Apartments Fire Updates | 60ఏళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద అగ్నిప్రమాదం | ABP Desam
Gambhir Comments on Head Coach Position | గంభీర్ సెన్సేషనల్ స్టేట్‌మెంట్
World Test Championship Points Table | టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ స్థానం ఇదే
Reason for Team India Failure | భారత్ ఓటమికి కారణాలు ఇవే !
Rohit Sharma First Place in ICC ODI Rankings | అగ్రస్థానంలో
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan vs Jagadish Reddy: చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
చిచ్చు పెట్టిన దిష్టి వ్యాఖ్యలు - పవన్ కల్యాణ్‌పై బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు
Amaravati farmers: అమరావతి రైతులతో  చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో  పరిష్కారానికి హామీ
అమరావతి రైతులతో చంద్రబాబు సమావేశం - కీలక సమస్యలపై చర్చ - 6 నెలల్లో పరిష్కారానికి హామీ
TTD Adulterated ghee case: కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
కల్తీ నెయ్యి కేసులో మరో కీలక అరెస్టు - మొదటి సారి టీటీడీ జీఎం అరెస్ట్
Sri charani: మహిళల ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
మహిళల ఐపీఎల్‌ వేలంలో శ్రీచరణికి కోటి 30 లక్షలు - ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్న స్టార్ ప్లేయర్
Kalvakuntla Kavitha: ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
ఎలా ట్రెండింగ్‌లో ఉండాలో కవితకు బాగా తెలుసా? - ఇప్పుడంతా ఆమె గురించే చర్చ
Shiva Jyothi : శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
శ్రీవారి దర్శనం... యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డ్ బ్లాక్ - ఆ వార్తలపై క్లారిటీ!
2019 Group 2 Issue: గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
గ్రూప్-2 2019 ర్యాంకర్లకు భారీ ఊరట.. సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసిన డివిజన్ బెంచ్
Bruce Lee:  ఒక్క అంగుళంతో ప్రపంచాన్ని గెలిచిన యోధుడు!  బ్రూస్‌ లీ వన్-ఇంచ్ పంచ్ వెనుక రహస్యం ఏంటి..?
ది వన్-ఇంచ్ పంచ్: బ్రూస్‌లీని లెజెండ్‌గా మార్చిన ఒకే ఒక్క కిక్..! 
Embed widget