అన్వేషించండి

Ponnam vs Gangula: ధాన్యం కొనుగోళ్లపై బహిరంగ చర్చకు వస్తారా, మంత్రి గంగులకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లలో మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నది అవాస్తవాలే అని విమర్శించారు.

- ఆధారాలతో సహా నిరూపిస్తాం
- కొన్నామని చెప్తున్నది ఎంత..? అసలు కొన్నది ఎంత..?
- మీరు చెప్పిన కొనుగోలు కేంద్రానికే వెళ్దాం
- రైతులు ఏడుస్తుంటే మీ అనుచరులు డాన్సులు చేస్తారా..?
- 11 జిల్లాల్లో ఒక్క మెట్రిక్ టన్ను ధాన్యమైనా కొనుగోలు చేశారా..?
- మంత్రి గంగులకు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్

ధాన్యం కొనుగోళ్లపై మంత్రి గంగుల కమలాకర్ కు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ధాన్యం కొనుగోళ్లలో మంత్రి గంగుల కమలాకర్ చెప్తున్నది అవాస్తవాలే అని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఐకెపి సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ గారు అవస్తవాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి గంగుల కమలాకర్ చెబుతున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వ పౌరసరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్ వివరాల ప్రకారం తేదీ 27 ఏప్రిల్ 2023 నాటికి రాష్ట్రవ్యాప్తంగా కేవలం 4 లక్షల 81 వేల 44 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందన్నారు. అందులో 11 జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ధాన్యపు గింజ కొనుగోలు జరగలేదని, ఆరు జిల్లాల్లో 1 మెట్రిక్ టన్నుల లోపు, ఎనిమిది జిల్లాల్లో 2000 మెట్రిక్ టన్నుల లోపు మిగతా ఏడు జిల్లాల్లో నిజామాబాద్ 1 లక్షా 50 వేల 016 మెట్రిక్ టన్నులు, కామారెడ్డి 26,042 మెట్రిక్ టన్నులు, జనగాం 3696 మెట్రిక్ టన్నులు, ఖమ్మం 8198 మెట్రిక్ టన్నులు, నల్గొండ 1,59,040 మెట్రిక్ టన్నులు, సూర్యాపేట 52,702 మెట్రిక్ టన్నులు, వనపర్తి 14,816 మెట్రిక్ టన్నులు, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ జిల్లాలో కేవలం 2,267 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందని స్పష్టం అవుతుందన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్.

ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలులో జాప్యం చేయడం వలన, ముందస్తుగా తీసుకోవలసిన జాగ్రత్తలు, చేయవలసిన ఏర్పాట్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవడం వలన అకాల వర్షాలతో రోడ్లపై కుప్పలుగా పోసిన ధాన్యం వర్షం నీటిలో కొట్టుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో రోడ్లపై పోసిన వరి ధాన్యం ఇందుకు నిదర్శనం, ఈ పరిస్థితుల్లో రైతులను కదిలిస్తే కన్నీరు పెడుతున్నారని పొన్నం ప్రభాకర్ అన్నారు. రైతులను ఆదుకోవలసిన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నష్టపరిహారం ప్రకటించకపోగా, తడిసిన ధాన్యాన్ని కొనకుండా, తాలు, తరుగు, తేమ పేరుతో కోతలు విధిస్తూ రైతులను ఆవేదనకు గురిచేస్తుందని ఆరోపించారు.

ఒక కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోనే దాదాపు నాలుగు లక్షల మెట్లు టన్నుల ధాన్యం లభ్యమవుతుండగా మంత్రి ఈ ప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ దాదాపు నెలరోజుల నుండి ధాన్యం కొనుగోలు సెంటర్ల వద్ద అందుబాటులో ఉన్నప్పటికీ  కొనుగోలు చేసింది కేవలం 2,267 ధాన్యం మాత్రమే కొనడం మంత్రి పాలనకు నిదర్శనం అన్నారు పొన్నం.

ఇప్పటికైనా బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ ధాన్యం కొనుగోలు విషయంలో అవస్తవాలను చెబుతూ అటు రైతులను ఇటు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం మానుకోవాలని మంత్రి గంగుల కమలాకర్ కు మాజీ ఎంపీ పొన్నం సూచించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలతో నష్టపోయిన రైతులకు ఎకరానికి 25 వేల రూపాయల పరిహారం అందించడంతోపాటు, కనీసం మద్దతు ధరతో పాటు తడిసిన ధాన్యం కొనుగోలు చేసి ప్రభుత్వం, పౌరసరఫరాల శాఖ మంత్రి రైతుల పట్ల తమకున్న చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కోరారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paripoornananda Swami on Hindupuram Seat | హిందూపురం స్వతంత్ర అభ్యర్థిగా స్వామి పరిపూర్ణానంద | ABPWhy did K. Annamalai read the Quran | బీజేపీ యంగ్ లీడర్ అన్నామలై ఖురాన్ ఎందుకు చదివారు..?  | ABPKadiyam Srihari and kadiyam Kavya joins into Congress | కడియంకు రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ | ABP DesamSun Stroke  Symptoms and Treatment | వడదెబ్బ తగిలిన వ్యక్తికి ఓఆర్ఎస్ నీళ్లు ఇవ్వొచ్చా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy vs KTR: కేటీఆర్‌ చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు! - ఫోన్ ట్యాపింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి
కేటీఆర్‌కు సిగ్గుండాలి! చర్లపల్లి జైలులో చిప్పకూడు తింటాడు - ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి
KTR: 'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
'పార్టీ మారుతున్న నేతలు కేసీఆర్ కాళ్లు పట్టుకున్నా తిరిగి చేర్చుకోం' - గ్యారెంటీలు గారడీలయ్యాయంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Anantapur TDP: అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
అనంతపురం టీడీపీలో భగ్గుమన్న అసంతృప్తి- పార్టీ ఆఫీసుపై దాడి, ఫర్నిచర్‌ దహనం
Tecno Pova 6 Pro 5G: బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
బ్యాక్ డిజైన్ హైలెట్‌గా మార్కెట్లోకి వచ్చిన టెక్నో పోవా 6 ప్రో 5జీ - ధర ఎంతంటే?
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Tamilisai: ఎన్నికల్లో 5 సార్లు తన ఓటమిపై తమిళిసై సంచలన వ్యాఖ్యలు
Chandrababu Prajagalam :  టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్  -  ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
టీడీపీది విజన్ , వైసీపీ ది పాయిజన్ - ప్రజాగళం బహిరంగసభల్లో చంద్రబాబు విమర్శలు
Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ
Ticket For Raghurama :  ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు -  ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు - ఎన్డీఏ కూటమిలో విస్తృత చర్చ
Embed widget