అన్వేషించండి

Bandi Sanjay: బీజేపీలో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ, అడ్డంకిగా మారిన ఒక్క కండీషన్! - బండి సంజయ్

Telangana News | సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అవడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

No defections into BJP without resignation of MLAs says Bandi Sanjay | కరీంనగర్: ఇతర పార్టీల తరపున గెలిచిన ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరాలంటే కచ్చితంగా వారి పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తమతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ కేసులున్న నేతలను బీజేపీలోకి తీసుకునే అవకాశం లేదని బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ్ సర్క్యూట్ (Ramayan Circuit) కింద అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందన్నారు. కరీంనగర్- హసన్ పర్తి  రైల్వే లేన్ కోసం రూ.20 కోట్లతో చేపట్టిన సర్వే పనులు పూర్తైనట్లు తెలిపారు.
 
కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు స్పందించారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై 2 రాష్ట్రాల సీఎంల భేటీపై ఆయన మాట్లాడుతూ.. ఏపీ విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే  అవకాశం ఉన్నా, గత కేసీఆర్ ప్రభుత్వం (BRS Government) రాజకీయ లబ్ది కోసం సమస్యల్ని నాన్చిందన్నారు. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాగే వ్యవహరిస్తే విభజన సమస్యలు త్వరలోనే పరిష్కారం కానున్నాయి. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలా అని ప్రయత్నిస్తున్నారు. ఆ అవకాశం ఇవ్వొద్దని చంద్రబాబు, రేవంత్ లను బండి సంజయ్ కోరారు. సీఎంలు చర్చించిన విషయాలు కేంద్రం దృష్టికి రావాలన్నారు. 

ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికపై..
‘ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల విచారణకు, బీజేపీకి ఏం సంబంధం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి పరులను ఉపేక్షించదు. ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేతలు, కేసులన్న నేతలు బీజేపీలో చేరే ఛాన్స్ లేదు. ఇతర పార్టీల్లో గెలిచిన కాంగ్రెస్ లో చేరినట్లు.. రాజీనామా చేయకుండా బీజేపీలో చేరడం సాధ్యం కాదు. రాజీనామా చేసి బీజేపీకి రావాల్సిందే. కేశవరావు (కేకే)తో రాజీనామా చేయించిన కాంగ్రెస్ పెద్దలు ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించరు. పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరితేనే కాంగ్రెస్ కు గౌరవం. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే బీజేపీయే గెలుస్తుందని’ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై జాతీయ నాయకత్వం చూసుకుంటుందని, కొత్త వారికి ఆ పదవి ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదన్నారు. 

రామాయణ్ సర్క్యూట్ పై వివరాలు
ఇల్లంతకుంట ,కొండగట్ట అలయాలను రామాయణ  సర్క్యూట్ కింద అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చేందుకు సిద్ధం. గత ప్రభుత్వాన్ని అనేకమార్లు కోరినా కేసీఆర్ ప్రతిపాదనలు పంపలేదని తెలిపారు. కరీంనగర్ - హసన్ పర్తి  రైల్వేలైన్ నిర్మాణం కోసం సర్వే జరిగింది. త్వరలోనే రైల్వే లేన్ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటాం. రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి  చెందుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. 

రేవంత్ కోరితే కాదు, స్మార్ట్ సిటీ మిషన్ గడువుపై క్లారిటీ
కాంగ్రెస్ నేతలు, తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అడిగితే స్మార్ట్  సిటీ మిషన్ గడువును కేంద్రం ప్రభుత్వం పొడిగించలేదు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకే కేంద్రం నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగింపుతో కరీంనగర్ కార్పొరేషన్ కు మరిన్ని నిధులు రానున్నాయని’ కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతు
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Balka Suman Arrested: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరెస్టు- సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చర్యలు
IMD Weather Alert Telugu States 2026:తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు హై అలర్ట్! వచ్చే 48 గంటల్లో అక్క డ భారీ వర్షాలు... ఐఎండీ కీలక ప్రకటన!

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Abhishek Banerjee Attack: బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలిస్తాం: మమతా బెనర్జీ
బెంగాల్‌లో ట్రీట్మెంట్ అందడం లేదు.. అవసరమైతే అభిషేక్ బెనర్జీని హైదరాబాద్‌కు తరలింపు: మమతా బెనర్జీ
Karnataka New CM DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక ఏకగ్రీవం.. జూన్ 3న కర్ణాటక సీఎంగా ప్రమాణం
e- Shram Card 2026: అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
అసంఘటిత రంగాల్లోని కార్మికులకు రూ.2 లక్షల బీమా.. ఇ-శ్రమ్ కార్డు ప్రయోజనాలు, దరఖాస్తు విధానం
Drinker Sai OTT: ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
ట్రెండింగ్‌లో 'డ్రింకర్ సాయి'... ఓటీటీలో ధర్మ మహేష్ సినిమా ఫ్రీ ఫ్రీ ఫ్రీ... రెస్పాన్స్ సూపర్
PM SETU Scheme: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. దేశంలోనే తొలిసారిగా ఏపీలో పీఎం-సేతు పథకం అమలు
CM Vijay Condoles Ajith: అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
అజిత్ ఇంటికి సీఎం విజయ్... వెంట త్రిష కూడా... ఆప్త మిత్రుడికి పరామర్శ
IPL Best Ever Opening Pair: టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ.. మాజీ క్రికెట‌ర్ అనాల‌సిస్
టోర్నీ హిస్టరీలోనే గిల్, సాయి సుదర్శన్ బెస్ట్ ఓపెనింగ్ జోడీ..  ఫైనల్స్ లో వాళ్ల‌కే ఛాన్స్ ఎక్కువ..
Kurnool Tragedy: కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
కర్నూలులో విషాదం.. తుంగభద్ర నదిలో ఈతకు దిగి ఐదుగురు బంధువులు గల్లంతు
Embed widget