అన్వేషించండి

Bandi Sanjay: బీజేపీలో చేరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ, అడ్డంకిగా మారిన ఒక్క కండీషన్! - బండి సంజయ్

Telangana News | సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ అవడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరడంపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

No defections into BJP without resignation of MLAs says Bandi Sanjay | కరీంనగర్: ఇతర పార్టీల తరపున గెలిచిన ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరాలంటే కచ్చితంగా వారి పదవులకు రాజీనామా చేయాల్సిందేనని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తమతో టచ్ లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం రాజీనామా చేస్తేనే బీజేపీలో చేర్చుకుంటామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి స్పష్టం చేశారు. ఈడీ, సీబీఐ కేసులున్న నేతలను బీజేపీలోకి తీసుకునే అవకాశం లేదని బండి సంజయ్ చెప్పారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కొండగట్టు, ఇల్లందకుంట ఆలయాలను రామాయణ్ సర్క్యూట్ (Ramayan Circuit) కింద అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందన్నారు. కరీంనగర్- హసన్ పర్తి  రైల్వే లేన్ కోసం రూ.20 కోట్లతో చేపట్టిన సర్వే పనులు పూర్తైనట్లు తెలిపారు.
 
కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదివారం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. మీడియా అడిగిన పలు ప్రశ్నలకు స్పందించారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలపై 2 రాష్ట్రాల సీఎంల భేటీపై ఆయన మాట్లాడుతూ.. ఏపీ విభజన చట్టంలోని పలు అంశాలకు పరిష్కారం లభించే  అవకాశం ఉన్నా, గత కేసీఆర్ ప్రభుత్వం (BRS Government) రాజకీయ లబ్ది కోసం సమస్యల్ని నాన్చిందన్నారు. ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇలాగే వ్యవహరిస్తే విభజన సమస్యలు త్వరలోనే పరిష్కారం కానున్నాయి. ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఈ భేటీని అడ్డం పెట్టుకుని మళ్లీ ప్రజలను ఎట్లా రెచ్చగొట్టాలా అని ప్రయత్నిస్తున్నారు. ఆ అవకాశం ఇవ్వొద్దని చంద్రబాబు, రేవంత్ లను బండి సంజయ్ కోరారు. సీఎంలు చర్చించిన విషయాలు కేంద్రం దృష్టికి రావాలన్నారు. 

ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేరికపై..
‘ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థల విచారణకు, బీజేపీకి ఏం సంబంధం లేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవినీతి పరులను ఉపేక్షించదు. ఈడీ, సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న నేతలు, కేసులన్న నేతలు బీజేపీలో చేరే ఛాన్స్ లేదు. ఇతర పార్టీల్లో గెలిచిన కాంగ్రెస్ లో చేరినట్లు.. రాజీనామా చేయకుండా బీజేపీలో చేరడం సాధ్యం కాదు. రాజీనామా చేసి బీజేపీకి రావాల్సిందే. కేశవరావు (కేకే)తో రాజీనామా చేయించిన కాంగ్రెస్ పెద్దలు ఆ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలతో ఎందుకు రాజీనామా చేయించరు. పార్టీ ఫిరాయించే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజా తీర్పు కోరితేనే కాంగ్రెస్ కు గౌరవం. ఒకవేళ ఉప ఎన్నికలు జరిగితే బీజేపీయే గెలుస్తుందని’ బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై జాతీయ నాయకత్వం చూసుకుంటుందని, కొత్త వారికి ఆ పదవి ఇవ్వకూడదనే నిబంధన ఏమీ లేదన్నారు. 

రామాయణ్ సర్క్యూట్ పై వివరాలు
ఇల్లంతకుంట ,కొండగట్ట అలయాలను రామాయణ  సర్క్యూట్ కింద అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చేందుకు సిద్ధం. గత ప్రభుత్వాన్ని అనేకమార్లు కోరినా కేసీఆర్ ప్రతిపాదనలు పంపలేదని తెలిపారు. కరీంనగర్ - హసన్ పర్తి  రైల్వేలైన్ నిర్మాణం కోసం సర్వే జరిగింది. త్వరలోనే రైల్వే లేన్ నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటాం. రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి  చెందుతుందని బండి సంజయ్ పేర్కొన్నారు. 

రేవంత్ కోరితే కాదు, స్మార్ట్ సిటీ మిషన్ గడువుపై క్లారిటీ
కాంగ్రెస్ నేతలు, తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అడిగితే స్మార్ట్  సిటీ మిషన్ గడువును కేంద్రం ప్రభుత్వం పొడిగించలేదు. రాజస్తాన్, మధ్యప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి వస్తున్న అభ్యర్థన మేరకే కేంద్రం నిర్ణయం తీసుకుంది. స్మార్ట్ సిటీ మిషన్ గడువు పొడిగింపుతో కరీంనగర్ కార్పొరేషన్ కు మరిన్ని నిధులు రానున్నాయని’ కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనంతమిళనాడు డిప్యుటీ సీఎంగా ఉదయ నిధి స్టాలిన్, ప్రకటించిన డీఎమ్‌కే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR About Hydra: దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
దమ్ముంటే నాలాల మీదున్న జీహెచ్ఎంసీ బిల్డింగ్, హైడ్రా ఆఫీసులు కూల్చండి: కేటీఆర్ డిమాండ్
HYDRA: రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు -  హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
రూల్స్ తెలుసా రంగనాథ్‌. అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఇంటికెళ్తారు - హైడ్రా చీఫ్‌పై హైకోర్టు ఆగ్రహం
Tamilnadu Politics :  విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
విజయ్ వర్సెస్ ఉదయనిధి - తమిళనాడు రాజకీయం మారిపోతోందా ?
New DSC In Telangana: కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
కొత్త డీఎస్సీపై గుడ్ న్యూస్! వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు- రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Virus Attack: ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
ఏపీలో మళ్లీ హ్యాండ్ ఫుట్ మౌత్ వ్యాధి కలకలం- విజయవాడ, గుంటూరు, విశాఖలో కేసులు
Mithun Chakraborty: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డు... అఫిషియల్‌గా అనౌన్స్ చేసిన కేంద్ర ప్రభుత్వం
KTR News: కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, ఆ బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
కేసీఆర్ ఫ్యామిలీ కూడా బాధితులే, నిర్వాసితుల బాధలు మాకంటే ఎవరికి బాగా తెలుసు: కేటీఆర్
Tesla Workers : సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
సిక్ ‌లీవులు పెడితే ఇంటికి మేనేజర్లు - టెస్లా ఉద్యోగులను రాచి రంపాన పెడుతున్న ఎలన్ మస్క్
Embed widget