అన్వేషించండి

Gouravelli Project: ఉద్రిక్తంగా హుస్నాబాద్ బంద్, బండి సంజయ్ ఎంట్రీతో గవర్నర్‌ వద్దకు పంచాయతీ!

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన నిర్వాసితులకు అక్కడికి చేరుకున్న స్థానిక టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది

Siddipet District: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గౌరవెల్లిలో ఆదివారం నుండి వరుసగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. దీంతో భారీ ఎత్తున చేరుకున్న పోలీసు బలగాలు భూనిర్వాసితులపై లాఠీఛార్జ్ చేశాయి. దీనికి నిరసనగా నిర్వాసితులు అంతా కలిసి హుస్నాబాద్ బంద్ కి పిలుపు ఇచ్చారు. దీంతో భారీ ఎత్తున చేరుకుంటున్న భూ నిర్వాసితులను ఎక్కడికక్కడ పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో నిరసన కారులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగాయి. కొందరు నిరసనకారులు గాయాలపాలవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఎక్కడిక్కడ అరెస్టులు చేసినా పలువురు హుస్నాబాద్ చేరుకోగలిగారు. వీరంతా కలిసి ఎమ్మెల్యే ఒడితేల సతీష్ కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడానికి బయల్దేరి వెళ్లారు. 

మరోవైపు, కొంతమంది నిరసనకారులు హుస్నాబాద్ సీఐ కార్యాలయాన్ని ముట్టడించేందుకు వెళ్లడంతో మరింత పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగిన నిర్వాసితులకు అక్కడికి చేరుకున్న స్థానిక టిఆర్ఎస్ నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు. ఈ సమయంలోనే ఏసీపీకి స్వల్ప గాయాలయ్యాయి. స్థానిక ఎస్ఐ శ్రీధర్ కూడా స్వల్పంగా గాయపడ్డారు. 

పోలీసుల లాఠీచార్జిలో ఒక మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక హుస్నాబాద్ హన్మకొండ రహదారిని దిగ్బంధించి అక్కడ వంటావార్పు మొదలుపెట్టారు నిరసనకారులు. ఎమ్మెల్యే సతీష్ కుమార్ వచ్చి తమ గోడు వినేవరకు వరకూ తాము వదిలేది లేదని స్పష్టం చేశారు. మరోవైపు పరిష్కారం చేసే అవకాశం ఉన్నా కావాలనే అటు అధికారులు ఇటు నాయకులు దీనిని తాత్సారం చేస్తూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామరస్యంగా సమస్యను పరిష్కరించడానికి తాము సిద్ధంగా ఉన్నా ఎందుకు లాఠీఛార్జి చేశారు అంటూ పోలీసులపై తిరగబడ్డారు. 

బాధితులకు బండి సంజయ్ పరామర్శ
లాఠీఛార్జి నిరసిస్తూ పలు పార్టీల నేతలు ఆందోళనలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు నిరసనకారులకు మద్దతు తెలపగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రంగంలోకి దిగారు. నిన్న రాత్రి 11 గంటలకు భూనిర్వాసితులను పరామర్శించిన బండి సంజయ్ అక్కడి పరిస్థితిని హైదరాబాదులో ఉన్న గవర్నర్ కు వివరించేలా ప్లాన్ చేశారు. నిర్వాసితులలో కొందరిని గవర్నర్‌తో కలిపించి అక్కడ పోలీసులు చేసిన దమనకాండను వివరించాలని సూచించారు. పార్టీ పరంగా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడానికి పార్టీ నుండి లీగల్ సెల్, డాక్టర్ సెల్ బృందాలను క్షేత్రస్థాయికి వెళ్లి సహాయంగా నిలవాలని ఆదేశించారు. దీంతో ఇప్పటివరకు కేవలం హుస్నాబాద్, సిద్దిపేటకే పరిమితమైన నిర్వాసితుల నిరసన ఇక హైదరాబాద్‌కు చేరుకోనుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget