అన్వేషించండి

Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

Vemulawada: ప్రధాన ధర్మగుండం రెండున్నర ఏళ్ల క్రితమే కోవిడ్ విస్తృతంగా పెరుగుతుండడంతో ముందు జాగ్రత్త దృష్ట్యా మొదట్లోనే మూసివేశారు.

Vemulawada Rajanna Temple News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి మామూలు రోజుల్లోనే వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక శివరాత్రి, ఇతర ముఖ్యమైన పండుగల సమయంలో వీరి సంఖ్య లక్షలకు చేరుతుంది. చుట్టుపక్కల జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తమ ఇష్ట దైవాన్ని దర్శించుకోవడానికి వస్తారు. అయితే ఇంత ప్రాముఖ్యం ఉన్న ఈ ఆలయంలో ఇప్పుడు స్నానం చేయడానికి కూడా సరైన సౌకర్యాలు లేవు.

ధర్మగుండం పరిస్థితి ఇదీ..
ఆలయంలోని ప్రధాన ధర్మగుండం రెండున్నర ఏళ్ల క్రితమే కోవిడ్ విస్తృతంగా పెరుగుతుండడంతో ముందు జాగ్రత్త దృష్ట్యా మొదట్లోనే మూసివేశారు. అయితే అప్పటి నుండి కోవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గు ముఖం పట్టినప్పటికీ అధికారులు మాత్రం తిరిగి ధర్మగుండం (Dharmagundam) వాడుకలోకి తేకపోవడంతో భక్తుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మొదటి వేవ్ ప్రారంభమైన 2020 మార్చి 20వ తారీఖున ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ధర్మగుండం పూర్తిగా మూసివేశారు. ఇక కేవలం ప్రత్యేక ఉత్సవాల సమయంలో మాత్రమే అది కూడా కేవలం కొద్ది మంది భక్తులకు మాత్రమే అందుబాటులో ఉంచి ఆ తర్వాత మూసి వేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఆలయంలోనూ లేనివిధంగా ఇక్కడి అధికారులు వ్యవహరిస్తుండడంతో సౌకర్యాల పట్ల స్థానికేతర భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Vemulawada: ధర్మగుండం తెరవండయ్యా! రాజన్న భక్తుల వేడుకోలు - కొవిడ్ తర్వాత పట్టించుకోకుండా

ఇవీ ధర్మగుండం విశేషాలు
దాదాపుగా 80 అడుగుల పొడవు వెడల్పు 25 అడుగుల లోతుతో పది లక్షల లీటర్ల సామర్థ్యం గల ఈ ధర్మగుండంలో (Vemulawada Dharmagundam) ఒకేసారి 500 మంది వరకు భక్తులు స్నానాలు చేయవచ్చు. 40 మెట్లతో విశాలంగా ఉండే ఈ ధర్మగుండంలో ముఖ్యమైన పండుగ సమయంలో సాధారణ సామర్థ్యానికి దాదాపు కొన్ని రెట్ల సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరిస్తారు. ఇక అధికారులు పట్టించుకోకపోవడంతో ఆరు బయట ఉన్న కళ్యాణ కట్ట, వాహనాల పార్కింగ్ స్థలం , పార్వతిపురం నల్లాల వద్ద స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని భక్తులు తిరిగి వెళ్ళిపోతున్నారు. 

అయితే మగవారు ఎక్కడైనా స్నానాలు చేయగలరు కానీ యువతులు, మహిళల పరిస్థితి దారుణంగా ఉంది. తీవ్ర అసౌకర్యానికి గురైనా కూడా అధికారులు కనీస చలనం లేదు. సాధారణంగా దూర ప్రయాణాల తర్వాత స్నానాలు చేసే స్వామివారిని దర్శించుకుంటారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా అడ్జస్ట్ కావాల్సిన పరిస్థితి భక్తులకు అనివార్యమైంది. ధర్మగుండం తిరిగి ప్రారంభించాలని ఇప్పటికే ఆలయ అధికారులు రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్ కి ప్రతిపాదనలు పంపించారు. కానీ దీనిపై ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతి లభించకపోవడంతో ఆలయ అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఇప్పటికిప్పుడు ఆదేశాలు ఇచ్చినా తిరిగి వినియోగం లోకి తేవాలంటే సమయం పడుతుంది. కాబట్టి మరోవైపు పండుగలు సమీపిస్తున్న వేళ భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున తగిన చర్యలు తీసుకొని త్వరగా సమస్య పరిష్కరించాలని భక్తులు కోరుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
Pawan Kalyan Press Meet:రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!
రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!
Pawan Kalyan:
"గద్దర్‌కు మీరేం చేశారు? పాశం యాదగిరి కూడా విమర్శిస్తున్నారు" పవన్ కల్యాణ్‌ పంచ్‌లు 

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Press Meet: తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ 100 శాతం భూమిపుత్రుల జాగీరే.. కానీ మనసుల్లో విభజన రేఖలు వద్దు! - అమరావతిలో పవన్ కీలక వ్యాఖ్యలు
KTR vs Pawan Kalyan:
"పవన్‌ కల్యాణ్‌ను గౌరవిస్తా, అభిమానిస్తా, బిర్యానీ పెడతా కానీ..." కేటీఆర్ ఆసక్తికర కామెంట్స్‌
Imtiaz Ali : లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
లవ్ స్టోరీస్ తీసేందుకు ఇదే రైట్ టైం - యాక్షన్ మూవీస్ ట్రెండ్‌పై ఇంతియాజ్ అలీ రియాక్షన్
TTD Ghee Scam: టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
టీటీడీ కల్తీ నెయ్యి స్కామ్‌పై ఈడీ మెరుపు దాడులు- దేశవ్యాప్తంగా 15 చోట్ల సోదాలు.. రూ.45 కోట్ల ఆస్తులు సీజ్!
Karnataka Chief Minister DK Shivakumar : కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్! మంత్రులుగా 13 మంది ప్రమాణం 
Delhi Fire Accident: ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
ఢిల్లీ రెస్టారెంట్లో అగ్నిప్రమాదంలో 20 మంది మృతి.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ
Congress Internal Rifts: ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
ఇందిరమ్మ ఇళ్ల కోటా లొల్లి - పల్లెల్లో సెగ రేపుతున్న లబ్ధిదారుల ఎంపిక.. కాంగ్రెస్ నేతల్లోనే అంతర్గత కుమ్ములాటలు!
Peddi USA Collection : పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
పెద్ది ఓవర్సీస్ కలెక్షన్స్ - ప్రీ సేల్స్‌తో మిలియన్ డాలర్ మార్క్
Embed widget