అన్వేషించండి

Bandi Sanjay: ఐపీఎల్ కప్ బీజేపీదే, కాంగ్రెస్‌కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు: బండి సంజయ్ హాట్ కామెంట్స్

Telangana Politics: క్రికెట్ ఐపీఎల్ లాగే దేశంలో ఇండియన్ పొలిటికల్ లీగ్ నడుస్తోందని, మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ టీమ్ 400 సీట్లతో ఘన విజయం సాధిస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Bandi Sanjay Confident over NDA win 400 seats: కరీంనగర్: క్రికెట్ లో ఐపీఎల్ తరహాలోనే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (IPL)  మ్యాచ్ నడుస్తోందని, నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం 400ల స్థానాలతో  హ్యాట్రిక్ కొట్టనుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో I.N.D.I.A కూటమిని ఎన్డీఏ టీమ్ చిత్తుగా ఓడిస్తుందని జోస్యం చెప్పారు. కేంద్రంలో మాదిరిగానే రాష్ట్ర రాజకీయాల్లోనూ తెలంగాణ పొలిటికల్ లీగ్ ఆట మొదలైందన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో 17 మంది సభ్యుల టీం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ గుంట నక్కల్ని ఓడించడం తథ్యమన్నారు.

చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై 
కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్ లో శనివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ‘బూత్ విజయ సంకల్ప్ అభియాన్’ సమావేశం జరిగింది. చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటైనయ్... అయినా 2 పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి టీపీఎల్ కప్ ను గెలిచి, ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అతి తక్కువ వ్యవధిలో కాంగ్రెస్ అత్యంత ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న ఏకైక పార్టీగా నిలిచిందన్నారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల రాశులు పోసినా కొనడం లేదని, తాలు, తరుగు పేరుతో దోచుకునేందుకు దళారులు సిద్ధమైనా సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీల అమలు అని తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. 

Bandi Sanjay: ఐపీఎల్ కప్ బీజేపీదే, కాంగ్రెస్‌కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు: బండి సంజయ్ హాట్ కామెంట్స్

తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) గేమ్ 
దేశమంతా క్రికెట్ లో ఐపీఎల్ జోష్ నడుస్తోంది. రాజకీయాల్లోనూ ఇండియా పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోంది. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన ఎన్డీఏ టీమ్ I.N.D.I.A కూటమి టీమ్ ను చిత్తుగా ఓడించి 400 పాయింట్లతో కప్ గెలవబోతోంది. ఇక్కడ తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) గేమ్ మొదలైంది. ఇందులో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి టీంలో బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాధవీలత, గోమాస శ్రీనివాస్, కొండా వెంకటేశ్వర్ రెడ్డి, బీవీ పాటిల్, సైదిరెడ్డి, వినోద్ రావు, బూర నర్సయ్యగౌడ్, నగేశ్, భరత్ సహా 17 మంది సభ్యులం ఉన్నాం. కాంగ్రెస్ కు ఇంకా ఆటగాళ్లే దొరకడం లేదు. బీఆర్ఎస్ కు టీమ్ సభ్యులున్నా నిరాశలో ఉన్నారు. - బండి సంజయ్ 

6 గ్యారంటీలు అమలు చేశారా? 
వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు మోసం చేశారు.. రైతులు అరిగోస పడుతున్నరు. పంట నష్టం రాకపోగా.. ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రాశులు పోసినా కొనే నాధుడు లేడు. దళారులు దోచుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు.. వడ్లకు కనీస మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. రూ.3 లక్షల వడ్డీలేని రుణం ఇస్తామని దగా చేసింది. రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోవడంతో రైతులను బ్యాంకర్లు డిఫాల్టర్లుగా ప్రకటించాయి. మహిళలకు మహాలక్ష్మీ పథకంతో రూ.2,500లు ఇస్తామని చెప్పిన హామీ నెరవేర్చలేదు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ అని నమ్మించి మోసం చేశారు. అర్హులైన పేదలకు జాగాతోపాటు రూ.5 లక్షల నగదు సాయం చేస్తామన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇవ్వలేదు. రైతులకు ఎకరాకు రూ.15 వేల భరోసా అందడం లేదు.   - బండి సంజయ్ 

‘కరీంనగర్ పార్లమెంట్ కోసం రూ.12 వేల కోట్లకుపైగా తీసుకొచ్చి ప్రధానితో జాతీయ రహదారుల విస్తరణ పనులు ప్రారంభించాం. తమ వల్లే అని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణానికి నాటి BRS ప్రభుత్వం నిధులియ్యకుంటే... సేత బంధన్ స్కీం ద్వారా కేంద్రం నుంచి మొత్తం నిధులు తీసుకొచ్చాను. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ నేతలు కొబ్బరికాయ కొట్టారు. స్మార్ట్ సిటీ నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చిన ఘనత బీజేపీదే. కరీంనగర్ లో చేసిన అభివృద్ధిపై బుక్ లెట్ ముద్రించి ఇంటింటికీ పంపిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ శ్వేతపత్రం కావాలంటున్నారు. బీఆర్ఎస్ పై మేం పోరాడితే కాంగ్రెస్ ఫలాలు అనుభవిస్తోందని’ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Paadi Kaushik Reddy Controversy: కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
కౌశిక్ రెడ్డికి వివాదాలు అలవాటుగా మారాయా? బీఆర్‌ఎస్‌కు నష్టమా? లాభమా?
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం కీలక విమర్శలు- లక్షల కోట్ల ప్రజాధనం వృథా, ప్లానింగ్ లోపాలే కారణమని వెల్లడి!
Revanth vs Vijayasanthi: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఎప్పుడు? రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీసిన విజయశాంతి!

వీడియోలు

Vaibhav Suryavanshi RR vs CSK IPL 2026 | వైభవ్ కు సలహా ఇచ్చిన జైస్వాల్ | ABP Desam
Rohit Suggestions to Hardik IPL 2026 | హిట్ మ్యాన్ వ్యూహంతో ముంబై విజయం | ABP Desam
Rohit Sharma Fastest Half Century IPL 2026 | ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ | ABP Desam
Rohit Dance in Front of Injured Rahane | రహానే కింద పడిపోతే.. రోహిత్ డాన్స్ | ABP Desam
Rahane Innings KKR vs MI IPL 2026 | వాంఖడేలో కేకేఆర్ పరుగుల విధ్వంసం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS MLA Padi Kaushik Reddy: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సీఐడీ నోటీసులు.. వెనక్కి తగ్గేది లేదంటూనే ప్రభుత్వంపై ఆరోపణలు
Bihar Stampede: ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
ఆలయంలో తొక్కిసలాట, 8 మంది భక్తులు మృతి.. సీఎం నితీష్ కుమార్ దిగ్భ్రాంతి
Third Temple In Israel: ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
ఇజ్రాయెల్‌లో మూడో టెంపుల్ గొడవేంటి..? మెస్సియా కోసం యూదుల ఎదురుచూపులు.. ఇరాన్‌తో యుద్ధంలో నెతన్యాహు మతం సెంటిమెంట్
Manisharma : హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
హార్మోనియం దుమ్ము దులిపి మరీ ట్యూన్స్ - చెన్నై లవ్ స్టోరీ సాంగ్స్‌పై మణిశర్మ రియాక్షన్
Explosion at Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు
AP Capital Amaravati: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత.. రేపే పార్లమెంటులోకి కీలక బిల్లు.. సర్వత్రా ఉత్కంఠ
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
ఫుల్ ట్యాంక్‌తో 1200 కి.మీ.. Toyota Innova Hycross ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చేస్తోంది
Today LPG, CNG, PNG Costs : LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
LPG, CNG, PNG సిలిండర్ల కొత్త ధరలు.. హైదరాబాద్లోనే గ్యాస్ కాస్ట్ ఎక్కువ
Embed widget