అన్వేషించండి

Bandi Sanjay: ఐపీఎల్ కప్ బీజేపీదే, కాంగ్రెస్‌కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు: బండి సంజయ్ హాట్ కామెంట్స్

Telangana Politics: క్రికెట్ ఐపీఎల్ లాగే దేశంలో ఇండియన్ పొలిటికల్ లీగ్ నడుస్తోందని, మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ టీమ్ 400 సీట్లతో ఘన విజయం సాధిస్తుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

Bandi Sanjay Confident over NDA win 400 seats: కరీంనగర్: క్రికెట్ లో ఐపీఎల్ తరహాలోనే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (IPL)  మ్యాచ్ నడుస్తోందని, నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బీజేపీ టీం 400ల స్థానాలతో  హ్యాట్రిక్ కొట్టనుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో I.N.D.I.A కూటమిని ఎన్డీఏ టీమ్ చిత్తుగా ఓడిస్తుందని జోస్యం చెప్పారు. కేంద్రంలో మాదిరిగానే రాష్ట్ర రాజకీయాల్లోనూ తెలంగాణ పొలిటికల్ లీగ్ ఆట మొదలైందన్నారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో 17 మంది సభ్యుల టీం.. కాంగ్రెస్, బీఆర్ఎస్ గుంట నక్కల్ని ఓడించడం తథ్యమన్నారు.

చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటై 
కరీంనగర్ లోని రాజశ్రీ గార్డెన్ లో శనివారం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ‘బూత్ విజయ సంకల్ప్ అభియాన్’ సమావేశం జరిగింది. చీకటి ఒప్పందాలతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటైనయ్... అయినా 2 పార్టీలను చిత్తుచిత్తుగా ఓడించి టీపీఎల్ కప్ ను గెలిచి, ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వబోతున్నామని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. అతి తక్కువ వ్యవధిలో కాంగ్రెస్ అత్యంత ప్రజావ్యతిరేకత ఎదుర్కొన్న ఏకైక పార్టీగా నిలిచిందన్నారు. రైతులంతా కొనుగోలు కేంద్రాల వద్ద వడ్ల రాశులు పోసినా కొనడం లేదని, తాలు, తరుగు పేరుతో దోచుకునేందుకు దళారులు సిద్ధమైనా సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు. వంద రోజుల్లో 6 గ్యారంటీల అమలు అని తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. 

Bandi Sanjay: ఐపీఎల్ కప్ బీజేపీదే, కాంగ్రెస్‌కు ప్లేయర్స్ కూడా దొరకడం లేదు: బండి సంజయ్ హాట్ కామెంట్స్

తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) గేమ్ 
దేశమంతా క్రికెట్ లో ఐపీఎల్ జోష్ నడుస్తోంది. రాజకీయాల్లోనూ ఇండియా పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోంది. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బరిలోకి దిగిన ఎన్డీఏ టీమ్ I.N.D.I.A కూటమి టీమ్ ను చిత్తుగా ఓడించి 400 పాయింట్లతో కప్ గెలవబోతోంది. ఇక్కడ తెలంగాణ ప్రీమియర్ లీగ్ (టీపీఎల్) గేమ్ మొదలైంది. ఇందులో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి టీంలో బండి సంజయ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, మాధవీలత, గోమాస శ్రీనివాస్, కొండా వెంకటేశ్వర్ రెడ్డి, బీవీ పాటిల్, సైదిరెడ్డి, వినోద్ రావు, బూర నర్సయ్యగౌడ్, నగేశ్, భరత్ సహా 17 మంది సభ్యులం ఉన్నాం. కాంగ్రెస్ కు ఇంకా ఆటగాళ్లే దొరకడం లేదు. బీఆర్ఎస్ కు టీమ్ సభ్యులున్నా నిరాశలో ఉన్నారు. - బండి సంజయ్ 

6 గ్యారంటీలు అమలు చేశారా? 
వంద రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు మోసం చేశారు.. రైతులు అరిగోస పడుతున్నరు. పంట నష్టం రాకపోగా.. ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రాల్లో రాశులు పోసినా కొనే నాధుడు లేడు. దళారులు దోచుకుంటున్నా సర్కార్ పట్టించుకోవడం లేదు.. వడ్లకు కనీస మద్దతు ధరతోపాటు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ మోసం చేసింది. రూ.3 లక్షల వడ్డీలేని రుణం ఇస్తామని దగా చేసింది. రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోవడంతో రైతులను బ్యాంకర్లు డిఫాల్టర్లుగా ప్రకటించాయి. మహిళలకు మహాలక్ష్మీ పథకంతో రూ.2,500లు ఇస్తామని చెప్పిన హామీ నెరవేర్చలేదు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ అని నమ్మించి మోసం చేశారు. అర్హులైన పేదలకు జాగాతోపాటు రూ.5 లక్షల నగదు సాయం చేస్తామన్నారు. విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు ఇవ్వలేదు. రైతులకు ఎకరాకు రూ.15 వేల భరోసా అందడం లేదు.   - బండి సంజయ్ 

‘కరీంనగర్ పార్లమెంట్ కోసం రూ.12 వేల కోట్లకుపైగా తీసుకొచ్చి ప్రధానితో జాతీయ రహదారుల విస్తరణ పనులు ప్రారంభించాం. తమ వల్లే అని బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణానికి నాటి BRS ప్రభుత్వం నిధులియ్యకుంటే... సేత బంధన్ స్కీం ద్వారా కేంద్రం నుంచి మొత్తం నిధులు తీసుకొచ్చాను. సిగ్గు లేకుండా బీఆర్ఎస్ నేతలు కొబ్బరికాయ కొట్టారు. స్మార్ట్ సిటీ నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చిన ఘనత బీజేపీదే. కరీంనగర్ లో చేసిన అభివృద్ధిపై బుక్ లెట్ ముద్రించి ఇంటింటికీ పంపిస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ శ్వేతపత్రం కావాలంటున్నారు. బీఆర్ఎస్ పై మేం పోరాడితే కాంగ్రెస్ ఫలాలు అనుభవిస్తోందని’ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bijapur Encounter: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా ఎన్‌కౌంటర్‌! మంగుడు, హితేష్‌ సహా 12 మంది మావోయిస్టులు మృతి
Road Safety Cess in Telangana : కారుపై రూ. 5000, బైక్‌పై రూ.2000 భారం - తెలంగాణలో కొత్త రిజిస్ట్రేషన్లపై రోడ్‌ సేఫ్టీ సెస్‌
తెలంగాణలో కొత్త బండ్లకు భారీ షాక్‌ - బైక్‌ నుంచి కారు వరకు అదనపు బాదుడు
BCCI on Mustafizur Rahman: KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
KKR నుంచి ముస్తాఫిజుర్ ఔట్? బంగ్లాదేశ్ వివాదం తర్వాత BCCI కీలక ఆదేశాలు!
AP DSC 2026: ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
ఫిబ్రవరిలో ఏపీలో డీఎస్సీ 2026 నోటిఫికేషన్, 2500 ఉద్యోగాల భర్తీకి కసరత్తు! సిలబస్‌లోకి ఇంగ్లీష్‌, కంప్యూటర్ సబ్జెక్ట్‌లు!
The Raja Saab Run Time : ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
ప్రభాస్ 'ది రాజా సాబ్' రన్ టైం ఫిక్స్! - 3 గంటల్లోపే డార్లింగ్ హారర్ కామెడీ థ్రిల్లర్
Durgam Cheruvu Cable Bridge: నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
నాడు వెలుగులు - నేడు చీకట్లు - దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిని పట్టించుకోని ప్రభుత్వం
Salary Account Benefits : ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
ఏదైనా బ్యాంకులో మీకు శాలరీ అకౌంట్‌ ఉందా? ఈ 10 అదనపు ప్రయోజనాలు గురించి తెలుసా?
Akhanda 2 OTT : ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి బాలయ్య 'అఖండ 2' - ఎప్పటి నుంచి, ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ అంటే?
Embed widget