అన్వేషించండి

Jagtial News: నేడు జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన- విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు

Jagtial News: జగిత్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

Jagtial News: సీఎం కేసీఆర్ నేడు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జగిత్యాలలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంతోపాటు, టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం ప్రారభించనున్నారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన తర్వాత భారీ బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. జిల్లా అధికారులతో సమీక్షా నిర్వహిస్తారు.

ఉదయం 12 గంటలకు సీఎం కేసీఆర్ హెలికాప్టర్ ద్వారా ఎర్రవెల్లిలోని ఫాం హౌస్ నుంచి బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జగిత్యాలకు చేరుకుంటారు. 12.40 నుంచి 12.55 వరకు మొదట టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు 110 కోట్ల తో ఏర్పాటు కానున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలకు శంకుస్థాపన చేస్తారు. తర్వాత 1.15కి  నూతన కలెక్టరేట్ ప్రారంభిస్తారు. తరువాత జిల్లా అధికారులు, ప్రజాప్రతనిధులతో కలిసి నూతన కలెక్టర్ కార్యాలయంలో 3 గంటల వరకు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం ప్రత్యేక బస్సు ద్వారా రోడ్డు మార్గాన 3.10కి బహిరంగ సభకు చేరుకుంటారు. అనంతరం మోతె రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి 4 గంటల వరకు ప్రసంగించనున్నారు. 

ఏర్పాట్లు చేస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్..

బహిరంగ సభలో పాల్గొననున్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చొప్పదండి వేములవాడ, కోరుట్ల ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. అనంతరం 4.15 కి హెలికాప్టర్ హైదరాబాద్ పయనం కానున్నారు. సాయంత్రం 4.45 కి తిరిగి ఎర్రవెల్లి ఫాం హౌస్ కి చేరుకుంటారు. సభ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్ సమీక్షిస్తున్నారు. జగిత్యాల, ధర్మపురితోపాటు సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి, కరీంనగర్, నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నిజాంబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, పెద్దపెల్లి జిల్లాలోని పెద్దపెల్లి నియోజకవర్గల నుంచి జనాల్ని సమీకరిస్తున్నారు. సుమారు ఐదు జిల్లాల నుంచి 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ సింధు శర్మ నేతృత్వంలో 2,325 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మొత్తం ఎడుగురు అడిషనల్ ఎస్పీలు, 11 మంది డీఎస్పీలు, 44 మంది సీఐలు, ముగ్గురు మహిళా సీఐలు, 165  ఎస్ఐలు, 13 మంది మహిళా ఎస్సైలు ఉండనున్నారు.

 సీఎం కేసీఆర్ రాబోతున్న సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని అంగడి బజార్ వద్ద స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ఎదుట విగ్రహం ఎదుట కూడా ప్లెక్సీలు పెట్టారు. అయితే ఆ ఫ్లెక్సీలు కారణంగా విగ్రహం కనిపించడం లేదనే కోపంతో ఓ యువుకుడ ఫ్లెక్సీలను దహనం చేశాడు. 

"కొండా లక్ష్మణ్ బాపూజీ మన తెలంగాణ జాతిపిత. మన తెలంగాణ జాతిపితకు అడ్డంగా ఫ్లెక్సీ కట్టారు. ఫ్లెక్సీ తీసేయమని కన్వీనర్ నిన్ననే చెప్పిర్రు. అయినా ఈ ఫ్లెక్సీ తీయకుండా అట్లనే ఉంచిర్రు. అందుకే నేను ఈ ఫ్లెక్సీని కాలవెడ్తున్న. మళ్లీ వచ్చి ఎవరు ఇలా అడ్డంగా ఫ్లెక్సీ కట్టినా నేను ఇలాగే చేస్తాం."- జగిత్యాల యువకుడు

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనేసీఎస్‌కేలోకి అన్‌క్యాప్డ్‌ ప్లేయర్‌గా ఎమ్‌ఎస్ ధోని, రిటెన్షన్ కొత్త రూల్స్‌తో సస్పెన్స్తిరుమలలో మరోసారి చిరుత కలకలం, సీసీటీవీ ఫుటేజ్‌తో సంచలనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget