అన్వేషించండి

Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 

Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం

Key Events
Independence Day 2022 Celebration in AP and Telangana Breaking News Telugu Live Updates 15 August 2022 Breaking News Telugu Live Updates: కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 
ప్రతీకాత్మక చిత్రం

Background

నేడు యావత్ భారతావని స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకుంటోంది. అందులోనూ 75వ ఇండిపెండెన్స్ డే కావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్పెషల్ డేని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ గా నిర్వహిస్తోంది. అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలు 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. భారత ఇండిపెండెన్స్ డే సందర్భంగా సెర్చింజన్ గూగుల్ సైతం ఇందులో భాగస్వామి అయింది. ఆగస్టు 15న దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని సూచిస్తూ ప్రత్యేకంగా గూగుల్ డూడుల్ తయారుచేసింది.

నేటి ఇండిపెండెన్స్ డే గూగుల్ డూడుల్‌ను కేరళకు చెందిన ఆర్టిస్ట్ నీతి క్రియేట్ చేశారు. ఈ ప్రత్యేక రోజు సందర్భానికి పండుగ టచ్ ఇస్తూ గూగుల్ డూడుల్ తయారుచేశారు. ఎప్పటినుంచో వస్తున్న సంప్రదాయం.. పతంగుల పండుగను సూచిస్తూ డూడుల్ ఉంది. స్వేచ్ఛ, స్వాతంత్ర్యానికి ప్రతీకగా గాలి పటాలు ఎగురవేస్తారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని తెలియజెప్పేలా గూగుల్ ఈ ట్రెడీషనల్ టచ్ ఇస్తూ భారతీయులకు స్పెషల్ డూడుల్‌ను డెడికేట్ చేసింది.

అల్పపీడనం వాయుగుండంగా మారి, తీవ్ర వాయుగుండంగా ఉత్తర ఒడిశా వైపు కదులుతోంది. మరికొన్ని గంటల్లో తీరాన్ని దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణతో పాటు యానాం, ఒడిశాలో వర్షాలు కురుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం సైతం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, వర్ష సూచన ఉన్న మరిన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉంది.

అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతోంది. దీని ప్రభావంతో సోమవారం, మంగళవారం సైతం తెలంగాణలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయని కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. 

తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ 5 జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తీరంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లడం అంత క్షేమదాయకం కాదని అధికారులు హెచ్చరించారు. 

ఆగస్టు 15వ తేదీకి వైజాగ్ కలెక్టర్ కార్యాలయ భవనానికి విచిత్రమైన సంబంధం ఉంది. ఆగస్టు 15 అనగానే భారత స్వాతంత్య్ర దినోత్సవం అందరికీ గుర్తొస్తుంది. ఆరోజు దేశ వ్యాప్తంగా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకుంటాం. అయితే 1947కు ముందు ఆ తేదీకి పెద్దగా ప్రాధాన్యత ఏమీ లేదు. కానీ వైజాగ్ కలెక్టరేట్ బిల్డింగ్ కి మాత్రం ఆ డేట్ చాలా ప్రత్యేకం. ఎందుకంటే స్వాతంత్య్రం రావడానికి 34 ఏళ్ల ముందు ఆగస్టు 15 వ తేదీన వైజాగ్ కలెక్టరేట్ బిల్డింగ్ ప్రారంభమైంది. అంటే 34 ఏళ్లపాటు బ్రిటీష్ జెండా ఎగిరిన చోటే భారత జాతీయ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది.

20:52 PM (IST)  •  15 Aug 2022

కర్ణాటక బీదర్ లో ఘోర రోడ్డు ప్రమాదం, ఐదుగురు హైదరాబాద్ వాసులు మృతి 

కర్ణాటక బీదర్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన ఐదుగురు మృతిచెందారు. దేవదర్శనం కోసం వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడ్డారు. కంటైనర్‌ను కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  నలుగురు ఘటనాస్థలిలోనే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందతూ చనిపోయారు. మృతులు హైదరాబాద్ బేగంపేట వాసులుగా తెలుస్తోంది.  

19:39 PM (IST)  •  15 Aug 2022

రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరు కానీ సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు 

Governor At Home తెలంగాణ రాజ్ భవన్ ఎట్ హోమ్ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ ప్రొగ్రామ్ రద్దు చేసుకున్నారు. అంతకు ముందు సీఎం కేసీఆర్ హాజరవుతారని సీఎంవో నుంచి గవర్నర్ కార్యాలయానికి సమాచారం వచ్చింది. కానీ ఆఖరి నిమిషంలో సీఎం కేసీఆర్ ప్రొగ్రామ్ రద్దు అయింది. 

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Delhi Crime News: పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
Viveka murder case:  వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
India China Relations: అమెరికాతో విభేదాల మధ్య భారత్ కీలక నిర్ణయం.. చైనా ఫుల్ హ్యాపీ, ఎవరికి ప్రయోజనం!
అమెరికాతో విభేదాల మధ్య భారత్ కీలక నిర్ణయం.. చైనా ఫుల్ హ్యాపీ, ఎవరికి ప్రయోజనం!
Manchu Manoj : మంచు మనోజ్ న్యూ జర్నీ స్టార్ట్ - 'మిరాయ్' సక్సెస్ తర్వాత సరికొత్తగా...
మంచు మనోజ్ న్యూ జర్నీ స్టార్ట్ - 'మిరాయ్' సక్సెస్ తర్వాత సరికొత్తగా...
Advertisement

వీడియోలు

India vs South Africa 2nd Test Match | రెండో టెస్ట్ నుంచి శుభమన్ గిల్ అవుట్
Australia Vs England 1st Test Ashes 2025 |  యాషెస్‌లో చెలరేగిన బౌలర్లు
Gambhir Warning to Team India | టీమిండియా ప్లేయర్లకు గంభీర్ వార్నింగ్ ?
Asia Cup Rising Stars 2025 | సెమీ ఫైనల్ లో భారత్ ఓటమి
Akhanda 2 Thaandavam Trailer Reaction | బాబోయ్ బాలయ్యా...వన్ మ్యాన్ ఆర్మీగా మారి యుద్ధం | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Delhi Crime News: పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
పాకిస్తాన్ కుట్ర విఫలం! డ్రోన్లతో భారత్‌లోకి ఆయుధాలు స్మగ్లింగ్.. నలుగురి అరెస్టు
Viveka murder case:  వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
వివేకా హత్య కేసులో మరో మలుపు! దస్తగిరిని జైల్లో బెదిరించిన ఘటనపై విచారణకు ప్రత్యేక టీం ఏర్పాటు!
India China Relations: అమెరికాతో విభేదాల మధ్య భారత్ కీలక నిర్ణయం.. చైనా ఫుల్ హ్యాపీ, ఎవరికి ప్రయోజనం!
అమెరికాతో విభేదాల మధ్య భారత్ కీలక నిర్ణయం.. చైనా ఫుల్ హ్యాపీ, ఎవరికి ప్రయోజనం!
Manchu Manoj : మంచు మనోజ్ న్యూ జర్నీ స్టార్ట్ - 'మిరాయ్' సక్సెస్ తర్వాత సరికొత్తగా...
మంచు మనోజ్ న్యూ జర్నీ స్టార్ట్ - 'మిరాయ్' సక్సెస్ తర్వాత సరికొత్తగా...
Budget Friendly Cars: టాటా, మహీంద్రా నుంచి హ్యుందాయ్ వరకు 5 సీట్లు ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఇవే..
టాటా, మహీంద్రా నుంచి హ్యుందాయ్ వరకు 5 సీట్లు ఉండే బడ్జెట్ ఫ్రెండ్లీ కార్లు ఇవే..
Varanasi: రాజమౌళి విలన్ రహస్యం.. ముగ్గురు రాక్షసుల భయంకర రూపం! రణకుంభ పాట వెనుక అసలు అర్థం తెలిస్తే వణికిపోతారు?
రాజమౌళి విలన్ రహస్యం.. ముగ్గురు రాక్షసుల భయంకర రూపం! రణకుంభ పాట వెనుక అసలు అర్థం తెలిస్తే వణికిపోతారు?
Hyderabad Regional Ring Road: హైదరాబాద్ RRR పై వ్యతిరేకత, పంచాయతీ ఆఫీసులో అధికారులను బంధించిన రైతులు
హైదరాబాద్ RRR పై వ్యతిరేకత, పంచాయతీ ఆఫీసులో అధికారులను బంధించిన రైతులు
iBOMMA Ravi : iBOMMA రవి రాబిన్ హుడ్... - RGV లాజిక్... నెటిజన్లకు షాక్
iBOMMA రవి రాబిన్ హుడ్... - RGV లాజిక్... నెటిజన్లకు షాక్
Embed widget