అన్వేషించండి

Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?

Bhu Bharathi Portal Telangana:సమస్యల్లో ఉన్న భూముల వివాదాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే భూభారతిపై నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇంతకీ వివాదాలు ఉంటే ఏం చేయాలి?

Bhu Bharathi Portal Telangana: ధరణి కారణంగా వచ్చిన సమస్యలు రిపీట్ కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం భూభారతి పేరుతో సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. మార్పులు చేర్పులు, సమస్యల పరిష్కారం మరింత సులభం అవుతుందని మంత్రులు చెబుతూ వస్తున్నారు. దీనికి సంబంధించిన కీలక రూల్స్‌ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. అంతే కాకుండా మార్పులు చేర్పులు చేసే అధికారులం ఆర్డీవోల, జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. 

ఇప్పటి వరకు ఉన్న డేటాతోనే భూభారతి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.  ప్రత్యేకంగా ఎలాంటి సర్వేగానీ, భూరికార్డుల్లో మార్పులు చేర్పులు చేయలేదని స్పష్టం చేసింది. ధరణిలో ఉన్న డేటానే ఈ భూభారతిలో ఉందని తెలిపింది. ఇందులో ఉన్న భూరికార్డుల్లో ఏమైన తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పించింది. ఏ తప్పులు ఎలా సరిచేసుకోవాలో కూడా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాల్లో వెల్లడించింది. 

వీలునామా, వారసత్వ సమస్యలు ఉంటే మ్యుటేషన్ కోసం భూభారతి పోర్టల్‌లోనే తహసీల్దార్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసినప్పుడు వారసులందరీ అంగీకార పత్రం సబ్‌మిట్ చేయాలి. దీనికి సర్వే మ్యాప్ కూడా జత చేయాలి. ఈ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఎంఆర్వో కార్యాలయం ప్రత్యేకంగా నోటీసులను తహసీల్దార్ ఆఫీస్‌, గ్రామపంచాయతీ ఆఫీసుల్లో అంటిస్తుంది. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు చెప్పవచ్చు. దీనికి ఏడు రోజుల సమయం ఇస్తారు. ఉన్న సమస్య తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. 

మీ వివాదాస్ప ల్యాండ్‌పై అనుమానం ఉంటే అధికారులు నేరుగా మీ భూమిని పరిశీలించవచ్చు. ఎన్ని విచారణలు చేసినప్పటికీ 30 రోజుల్లో సమస్యను పరిష్కరించాలి. ఇలా పరిష్కరించి పట్టాదార్‌ పాస్‌బుక్ ఇవ్వాల్సి ఉంటుంది.  
ఇలా మ్యుటేషన్ సమస్యలే కాకుండా తప్పులు కూడా సరిచేసకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటి నుంచి ఏడాది లేదా. భూమికి సంబంధించిన వివరాలు రికార్డు చేసినప్పటి నుంచి ఏడాది లోపు ఫిర్యాదు చేయాలి. దానికి తగ్గ ఆధారాలు సమర్పించాలి. అప్పుడే దాన్ని పరిశీలనలోకి తీసుకుంటారు. ఇలా దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత హక్కుదారులకు నోటీసులు జారీ చేస్తారు. గ్రామపంచాయతీలో కూడా నోటీసులు ప్రచురిస్తారు.దీనిపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. దీనికి కూడా ఆధారాలు సమర్పించాలి. ఏదైనా సరే ఏడు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. అనంతరం అధికారులు పరిశీలించి ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ల పేరు మీద భూరికార్డులు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి రెండు నెలల సమయం పడుతుంది. 

కోర్టుల ద్వారా, ప్రభుత్వం ఇచ్చిన భూములపై హక్కులు పొందిన వాళ్లు ఆర్టీవోకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై వాళ్లు నోటీసులు ఇస్తారు. అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లో సమర్పించాలి. లేకుంటే ముఫ్ఫై రోజుల్లో సమస్యను పరిష్కరించి ఆదేశాలు జారీ చేస్తారు. ఎలాంటి వివాదాలు లేని భూములకు త్వరలోనే భూధార్ ఇచ్చేందుకు కూడా అధికారులు సిద్ధపడుతున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం కోసం భూభారతిలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫైడ్ కాపీల కోసం కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు.  

గతంలో ప్రజలు ఫేస్ చేసిన ఇబ్బందులు తొలగించాలనే ప్రభుత్వం ఫోకస్‌ చేసింది. ముందుగా వాటి పని పట్టాలని బావిస్తోంది. అందుకే నేటి నుంచి గ్రామాల్లో పట్టణాల్లలో విస్తృతంగా అవాగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Venkatesh : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్

వీడియోలు

సఫారీల చేతిలో ఈ ఓటమి మర్చిపోలేం.. భారత క్రికెట్ చరిత్రలో అతిపెద్ద ఓటమి
అండర్-19 ఆసియా కప్ లో రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్
USA investing In Pakistan | భారత్‌పై కోపంతో పాక్‌లో పెట్టుబడులకు రెడీ అయిన ట్రంప్ | ABP Desam
Ind vs SA T20 Suryakumar Press Meet | ఓటమిపై సూర్య కుమార్ యాదవ్ కామెంట్స్
Shubman Gill Golden Duck in Ind vs SA | రెండో టీ20లో గిల్ గోల్డెన్ డకౌట్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Apologised : మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
మెస్సీకి మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు! స్టేడియంలో జరిగిన ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు
Janmabhoomi Express Timings: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్‌; ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న టైమింగ్స్‌
Pawan Kalyan : పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో సెల్యూట్ కొట్టాల్సిందే! డబ్బులే కాదు కెప్టెన్ ఊరికి రోడ్డు మంజూరు
Venkatesh : వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
వెంకీ బర్త్ డే స్పెషల్ - మెగాస్టార్‌ మూవీలో ఛార్మింగ్ లుక్... 'మన శంకరవరప్రసాద్ గారు' స్పెషల్ పోస్టర్
Lionel Messi Vs Revanth Reddy: లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
లియోనెల్ మెస్సీతో ఢీ కొట్టనున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి; సాయంత్రం ఉప్పల్‌లో ఇంట్రెస్టింగ్ మ్యాచ్‌
Akhanda 2 First Day Collection : బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
బాలీవుడ్ మూవీ 'ధురంధర్'నే బీట్ చేసిన 'అఖండ 2' - బాక్సాఫీస్ వద్ద బాలయ్య రికార్డుల తాండవం
Ozempic Launched in India: మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
మధుమేహ వ్యాధిగ్రస్తులకు శుభవార్త! ఓజెంపిక్ అమ్మకాలు ప్రారంభం; ధర, ప్రయోజనాలు తెలుసుకోండి
Ponduru Khadi GI Tag: పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
పొందూరు ఖాదీకి జీఐ ట్యాగ్‌ లభ్యం! మహాత్మాగాంధీకి ప్రియమైన వస్త్రాన్ని నేడు ప్రపంచం మెచ్చింది!
Embed widget