అన్వేషించండి

Bhu Bharathi Portal Telangana: భూరికార్డుల్లో తప్పులు ఉంటే ఎలా సరిచేసుకోవాలి?భూభారతిలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటీ?

Bhu Bharathi Portal Telangana:సమస్యల్లో ఉన్న భూముల వివాదాల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. అందుకే భూభారతిపై నేటి నుంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఇంతకీ వివాదాలు ఉంటే ఏం చేయాలి?

Bhu Bharathi Portal Telangana: ధరణి కారణంగా వచ్చిన సమస్యలు రిపీట్ కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం భూభారతి పేరుతో సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చింది. మార్పులు చేర్పులు, సమస్యల పరిష్కారం మరింత సులభం అవుతుందని మంత్రులు చెబుతూ వస్తున్నారు. దీనికి సంబంధించిన కీలక రూల్స్‌ కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ భూ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తున్నట్టు అందులో పేర్కొంది. అంతే కాకుండా మార్పులు చేర్పులు చేసే అధికారులం ఆర్డీవోల, జిల్లా కలెక్టర్లకు ఇచ్చింది. 

ఇప్పటి వరకు ఉన్న డేటాతోనే భూభారతి పోర్టల్ అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.  ప్రత్యేకంగా ఎలాంటి సర్వేగానీ, భూరికార్డుల్లో మార్పులు చేర్పులు చేయలేదని స్పష్టం చేసింది. ధరణిలో ఉన్న డేటానే ఈ భూభారతిలో ఉందని తెలిపింది. ఇందులో ఉన్న భూరికార్డుల్లో ఏమైన తప్పులు ఉంటే సరిచేసుకునే అవకాశం కల్పించింది. ఏ తప్పులు ఎలా సరిచేసుకోవాలో కూడా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాల్లో వెల్లడించింది. 

వీలునామా, వారసత్వ సమస్యలు ఉంటే మ్యుటేషన్ కోసం భూభారతి పోర్టల్‌లోనే తహసీల్దార్‌కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అప్లై చేసినప్పుడు వారసులందరీ అంగీకార పత్రం సబ్‌మిట్ చేయాలి. దీనికి సర్వే మ్యాప్ కూడా జత చేయాలి. ఈ అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఎంఆర్వో కార్యాలయం ప్రత్యేకంగా నోటీసులను తహసీల్దార్ ఆఫీస్‌, గ్రామపంచాయతీ ఆఫీసుల్లో అంటిస్తుంది. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే అధికారులకు చెప్పవచ్చు. దీనికి ఏడు రోజుల సమయం ఇస్తారు. ఉన్న సమస్య తెలియజేసేందుకు ప్రత్యేకంగా ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. 

మీ వివాదాస్ప ల్యాండ్‌పై అనుమానం ఉంటే అధికారులు నేరుగా మీ భూమిని పరిశీలించవచ్చు. ఎన్ని విచారణలు చేసినప్పటికీ 30 రోజుల్లో సమస్యను పరిష్కరించాలి. ఇలా పరిష్కరించి పట్టాదార్‌ పాస్‌బుక్ ఇవ్వాల్సి ఉంటుంది.  
ఇలా మ్యుటేషన్ సమస్యలే కాకుండా తప్పులు కూడా సరిచేసకునే అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. ఇప్పటి నుంచి ఏడాది లేదా. భూమికి సంబంధించిన వివరాలు రికార్డు చేసినప్పటి నుంచి ఏడాది లోపు ఫిర్యాదు చేయాలి. దానికి తగ్గ ఆధారాలు సమర్పించాలి. అప్పుడే దాన్ని పరిశీలనలోకి తీసుకుంటారు. ఇలా దరఖాస్తు చేసిన తర్వాత సంబంధిత హక్కుదారులకు నోటీసులు జారీ చేస్తారు. గ్రామపంచాయతీలో కూడా నోటీసులు ప్రచురిస్తారు.దీనిపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు. దీనికి కూడా ఆధారాలు సమర్పించాలి. ఏదైనా సరే ఏడు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలి. అనంతరం అధికారులు పరిశీలించి ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ల పేరు మీద భూరికార్డులు నమోదు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యేసరికి రెండు నెలల సమయం పడుతుంది. 

కోర్టుల ద్వారా, ప్రభుత్వం ఇచ్చిన భూములపై హక్కులు పొందిన వాళ్లు ఆర్టీవోకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై వాళ్లు నోటీసులు ఇస్తారు. అభ్యంతరాలు ఉంటే ఏడు రోజుల్లో సమర్పించాలి. లేకుంటే ముఫ్ఫై రోజుల్లో సమస్యను పరిష్కరించి ఆదేశాలు జారీ చేస్తారు. ఎలాంటి వివాదాలు లేని భూములకు త్వరలోనే భూధార్ ఇచ్చేందుకు కూడా అధికారులు సిద్ధపడుతున్నారు. పట్టాదార్ పాస్ పుస్తకం కోసం భూభారతిలోనే దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫైడ్ కాపీల కోసం కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు.  

గతంలో ప్రజలు ఫేస్ చేసిన ఇబ్బందులు తొలగించాలనే ప్రభుత్వం ఫోకస్‌ చేసింది. ముందుగా వాటి పని పట్టాలని బావిస్తోంది. అందుకే నేటి నుంచి గ్రామాల్లో పట్టణాల్లలో విస్తృతంగా అవాగాహన కార్యక్రమాలు చేపట్టనుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ

వీడియోలు

రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు
Ind vs Pak Under 19 Asia Cup | నేడు ఆసియా అండర్‌-19 ఫైనల్‌
Rohit Sharma T20 World Cup | హిట్మ్యాన్ లేకుండా తొలి వరల్డ్ కప్
Ishan Kishan about T20 World Cup | ప్రపంచ కప్‌ ఎంపికైన ఇషాన్ కిషన్ రియాక్షన్
Sanju Samson about Opener Place | ఓపెనర్ ప్లేస్ సంజు రియాక్షన్ ఇదే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KCR Warns Congress Government: రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
రాష్ట్ర ప్రభుత్వం తోలు తీస్తాం.. ఇప్పటివరకు ఓ లెక్క, ఇకనుంచి మరోలెక్క: కేసీఆర్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
India U19 vs Pakistan U19 Final highlights: అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్.. ఫైనల్లో భారత్‌పై 191 రన్స్ తేడాతో ఘన విజయం
Kishan Reddy Letter to Sonia Gandhi: 6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
6 గ్యారంటీలు, అభయహస్తమే భస్మాసుర హస్తంగా మారతాయి- సోనియా గాంధీకి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ
Avatar OTT: 'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
'అవతార్ 3' కాదు... ఫస్ట్ రెండు పార్టులు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసా?
KCR About Chandrababu: హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
హైప్ ఆద్యుడు చంద్రబాబు, బిజినెస్ మీట్స్‌లో వంటవాళ్లతో MOUలు చేసుకున్నాడు: కేసీఆర్
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Maruti S Presso నుంచి టాటా పంచ్ వరకు.. దేశంలోని చౌకైన ఆటోమేటిక్ కార్లు, వాటి ధర
Who is Sameer Minhas: వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా బ్యాటింగ్ చేసిన సమీర్ మిన్హాస్.. ఇంతకీ ఎవరితను
వైభవ్ సూర్యవంశీ కంటే వేగంగా బ్యాటింగ్ చేసిన సమీర్ మిన్హాస్.. ఇంతకీ ఎవరితను
Embed widget