అన్వేషించండి

Shirisha Murder Case: శిరీషది హత్యేనని తేల్చిన పోలీసులు, కళ్లల్లో బీరుబాటిల్‌తో పొడిచి నీటి కుంటలో తొక్కి చంపిన బావ!

Shirisha Murder Case: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ శిరీషది హత్యేనని పోలీసులు తేల్చారు. ఆమె బావ.. అతని స్నేహితుల ఇద్దరి సాయంతో హత్య చేసినట్లు గుర్తించారు. 

Shirisha Murder Case: తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల శిరీష మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఇంట్లో జరిగిన గొడవనే హత్యకు కారణం అని పోలీసులు తేల్చారు. మద్యం మత్తులో శిరీష బావ, అతని ఇద్దరు స్నేహితుల సాయంతో హత్య చేసినట్లు గుర్తించారు. శిరీష చనిపోయినప్పటి నుంచి గ్రామస్థులంతా అది హత్యేనని చెప్పగా.. పోలీసులు శిరీష ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావించారు. కానీ చివరకు అసలు నిజం వెలుగులోకి వచ్చింది. మూడ్రోజులుగా శిరీష బావ అనిల్ నోరు మెదపడం లేదు. ఈక్రమంలోనే పోలీసులు అనిల్ కాల్ డేటాను పరిశీలించి.. విచారణ చేపట్టారు. శిరీష ఫోన్ స్విచ్ఛాఫ్ అయినప్పటి నుంచి అనిల్ ఎక్కువగా మాట్లాడిన అతడి ఇద్దరి స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

అసలేం జరిగిందంటే?

శిరీష చెప్పిన మాట వినడం లేదని.. ఎప్పుడూ ఫోన్ చూస్తూనే ఉంటుందని శిరీషతో అనిల్ గొడవ పడ్డాడు. అయితే బావతో వాదించడం ఇష్టం లేని ఆమె.. మరో గదిలోకి వెళ్లి ఆత్మహత్యాయత్నం చేసుకోబోయింది. వెంటనే అనిల్ గది తలుపులు పగులగొట్టి ఆమెను బయటకు తీసుకొచ్చాడు. అనంతరం అతను పరిగి వెళ్లిపోయాడు. తీవ్ర మనస్థాపానికి గురైన శిరీష బయటకు వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. శిరీష ఇంట్లో నుంచి వెళ్లిపోయిన విషయాన్ని ఆమె తమ్ముడు.. అనిల్ కు ఫోన్ చేసి చెప్పాడు. అప్పటికే తన మిత్రులతో కలిసి అనిల్ ఫుల్లుగా మద్యం సేవించాడు. మరో బీర్ తీసుకొని స్నేహితుడితో కలిసి కాళ్లాపూర్ బయలుదేరాడు. గ్రామ శివారులో ఉన్న మైసమ్మ గుడి దగ్గర అతనికి శిరీష కనిపించింది. ఆగ్రహంతో శిరీషపై అనిల్ చేయి చేసుకున్నాడు. అక్కడే ఉన్న కుంటవైపు లాక్కెళ్లి వెంట తెచ్చుకున్న బీరు బాటిల్ ను పగులగొట్టిన అనిల్ స్నేహితుడు.. శిరీష కళ్లలో గుచ్చినట్లు సమాచారం. 

బాటిల్ గుచ్చడంతో అయిన గాయాలకు శిరీష కన్నీరుమున్నీరుగా విలపించింది. తనను వదిలేయమంటూ ఎంతగానో వేడుకుంది. మద్యం మత్తులో ఉన్న ఆ క్రూరులు.. మోకాళ్ల లోతు ఉన్న నీటి కుంటలో పడేశారు. ఆపై అనిల్ సహా అతని ఇద్దరు స్నేహితులు శిరీష చనిపోయే వరకూ ఆమెపైనే నిల్చున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే శిరీష చనిపోయినట్లు నిర్ధారించుకున్న తర్వాత నిందితులు అక్కడి ఆనవాళ్లను మాయం చేశారు. కుంటలో పడేసి ఇంటికి వెళ్లిపోయారు.

ఆమె కనిపించడం లేదని వెతుకుతున్నట్లుగా నాటకం ఆడడం ప్రారంభించారు. ఆపై పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఈ కథంతా జరగడం అందరికీ తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలను పోలీసులు వెల్లడించలేదు. పోలీసుల కస్టడీలోని ఇద్దరు నిందితులూ ఉన్నట్లు సమాచారం. మరికొన్ని గంటల్లో ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయి. 

ఆరోజు ఏమైందంటే?

వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లాపూర్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల శిరీష.. శనివారం (జూన్ 10) రోజు రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. ఎంతసేపు అవుతున్నా ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. తెలిసిన స్నేహితులు, బంధువులు అందరికీ ఫోన్ లు చేశారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. అయితే ఆదివారం రోజు ఉదయం గ్రామ సమీపంలోని నీటి కుంటలో శిరీష శవమై తేలింది. విషయం గుర్తించిన స్థానికులు.. కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలిపారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. మృతదేహాన్ని బయటకు తీశారు. అయితే శిరీష మృతదేహంపై రక్తపు మరకలు ఉండడంతో ఆమెను ఎవరో హత్య చేసినట్లు భావించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. ఆమెది దారుణమైన హత్య అని తేలింది. 

టాప్ హెడ్ లైన్స్

Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Cheyutha Pensions: తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
తెలంగాణలో కొత్త పెన్షన్లకు దరఖాస్తుల ఆహ్వానం.. అప్లికేషన్ ఫారం కోసం క్లిక్ చేయండి
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Embed widget