అన్వేషించండి

TSRTC Special Bus: మరో పుణ్యక్షేత్రానికి టీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు - మూడ్రోజుల టూరిస్ట్ ప్యాకేజీ ఇదిగో

Ganagapur Special Bus: కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ ఆలయానికి టీఎస్ ఆర్టీసీ స్పెషల్ టూరిస్ట్ బస్సులను నడుపుతోంది. మూడ్రోజుల పాటు ఈ యాత్ర సాగనుంది. 

Ganagapur Special Bus: కర్ణాటకలోని గానుగాపూర్‌ దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్లాలని అనుకునే వాళ్లకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెబుతోంది. యాత్రికుల కోసం హైదరాబాద్ నుంచి నేరుగా గానుగాపూర్ చేరుకునేందుకు స్పెషల్ టూరిస్ట్ బస్సులను ఏర్పాటు చేసింది. గానుగాపూర్ తో పాటుగా మహారాష్ట్రలోని పండరీపురం, తుల్జాపూర్ లోని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించే అవకాశాన్ని ఈ ప్యాకేజీ ద్వారా కల్పిస్తోంది. ఈ పుణ్యక్షేత్రాల యాత్ర జులై 31 జులై నుంచి ప్రారంభం అవుతుంది. ఆగస్టు 2వ తేదీన ముగుస్తుంది. జులై 31వ తేదీన హైదరాబాద్ ఎంజీబీఎస్ లో సాయంత్రం ఆరు గంటలకు బస్సు ప్రారంభం అవుతుంది.

అదే రోజు రాత్రి 11.30 గంటలకు గానుగాపూర్ చేరుకుంటారు. మరుసటి రోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకుని మధ్యాహ్నం 12 గంటలకు పండరీపురానికి బయల్దేరి సాయంత్రం 4 గంటలకు చేరుకుంటారు. ఇక్కడ పాండురంగ స్వామిని దర్శించుకొని తల్జాపూర్ కు బయలు దేరుతారు. మూడో రోజు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ కు ప్రయాణం అవుతారు. మూడోరోజు ఉదయం 8.30 గంటలకు ఎంజీబీఎస్ చేరుకోవడంతో యాత్ర పూర్తి అవుతుంది. 

ఈ నెల 31న ప్రారంభమయ్యే ఈ సర్వీస్ ముందస్తు రిజర్వేషన్ ప్రస్తుతం కొనసాగుతోంది. భక్తులు http://tsrtconline.in వెబ్ సైట్ లోకి వెళ్లి తమ టికెట్లను బుకింగ్ చేసుకోవాలి. అలాగే బుకింగ్స్ లో ఏవైనా సందేహాలు ఉంటే 944056379, 99259226257, 9959224911 నెంబర్లకు సంప్రదించవచ్చని వివరించింది. టికెట్ బుకింగ్ ఛార్జీలు కూడా రూ.2,560గా టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. అయితే దర్శనం, భోజన, వసతి సదుపాయాలు భక్తుల బాధ్యతే అని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.  

శ్రీశైలానికి ప్రతీ శనివారం స్పెషల్ బస్సులు

ఈ శ్రీశైలం టూర్ ప్యాకేజీ ధరను పెద్దలకు రూ.2,700, పిల్లలకు రూ.1,570గా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఈ ఛార్జీల్లో భాగంగా రవాణా, బస, ఆలయ శీఘ్ర దర్శనం, శిఖరం ప్రవేశ ఛార్జి ప్యాకేజీలో ఉంటుంది. ఆహారం, అల్పాహారం, ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు లాంటి ఇతర ఖర్చులను ప్రయాణికులే చెల్లించుకోవాల్సి ఉంటుంది. ప్రతి శనివారం ఉదయం ఈ టూర్‌ ప్రారంభమవుతుంది. తొలి రోజు హైదరాబాద్‌ లోని జేబీఎస్‌ నుంచి ఉదయం 7 గంటలకు సూపర్‌ లగ్జరీ బస్సు ఉంటుంది.

8 గంటలకు ఎంజీబీఎస్‌.. మీదుగా మధ్యాహ్నం 1.30 గంటలకు శ్రీశైలానికి చేరుకుంటుంది. ముందుగా బస కోసం డైరెక్ట్ గా హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడే మధ్యాహ్న భోజనాలు ఉంటాయి. తర్వాత 3 గంటలకు పాతాళ గంగకు తీసుకెళ్తారు. కృష్ణానదిలో బోటింగ్‌ కూడా ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీ భ్రమరాంబిక అమ్మ వారి దర్శనాన్ని భక్తులు చేసుకోవాలి. శీఘ్ర దర్శన సదుపాయం అక్కడ అందుబాటులో ఉంటుంది. రాత్రికి ఆ హోటల్లోనే బస ఉంటుంది.

రెండో రోజు షెడ్యూల్ ఇలా

రెండో రోజైన ఆదివారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు భక్తులు ఆలయంలో అభిషేకం, ప్రత్యేక పూజలు చేసుకోడానికి వీలు కల్పించారు. తర్వాత అల్పాహారం ఉంటుంది. హోటల్‌ చెక్‌అవుట్‌ చేయాలి. అక్కడి నుంచి శివాజి స్పూర్తి కేంద్రం, చెంచులక్ష్మి ట్రైబల్‌ మ్యూజియం లాంటి స్థానిక ప్రాంతాలు చూడవచ్చు. అక్కడి నుంచి తిరుగు ప్రయాణంలో సాక్షి గణపతి ఆలయ దర్శనంతో పాటు పాలధార, పంచధార, శిఖరం, శ్రీశైలం డ్యాం లాంటివి చూసే ఏర్పాట్లు ఉంటాయి. తిరుగు ప్రయాణం మధ్యలో మధ్యాహ్న భోజనం కోసం బస్సు ఆపుతారు. తర్వాత రాత్రి 7.30 గంటలకు బస్సు ఎంజీబీఎస్‌కు, 8.30 గంటలకు జేబీఎస్‌కు చేరుతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Durgam Cheruvu ABP Country Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Mana Shankara Varaprasad Garu Review : ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్..

వీడియోలు

WPL 2026 RCB vs GG | ఆర్‌సీబీకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు
Sunil Gavaskar Comments on Team India | టీమిండియాపై సునీల్ గవాస్కర్ కామెంట్స్
Simon Doule about Rohit Sharma | రోహిత్ పై కివీస్ మాజీ ప్లేయర్ కామెంట్స్
Shubman Gill, Jadeja in Ranji Trophy | రంజీ ట్రోఫీలో ఆడనున్న గిల్, జడేజా
Kavitha Meetings With Prashant Kishor | తెలంగాణ రాజకీయాల్లోకి ప్రశాంత్ కిశోర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Durgam Cheruvu ABP Country Effect: దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
దుర్గం చెరువు దుస్థితిపై ఏబీపీ దేశం కథనాలకు హైడ్రా స్పందన - ఇక బాధ్యత తమదేనని రంగనాథ్ ప్రకటన
Traffic challan: వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
వాహనదారులకు హైకోర్టు బిగ్ రిలీఫ్ - రోడ్లపై బలవంతపు చలాన్ల వసూళ్లకు చెక్
Mana Shankara Varaprasad Garu Review : ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
ఇది సంక్రాంతి 'బాస్' బస్టర్ - 'మన శంకరవరప్రసాద్ గారు'పై బన్నీ రివ్యూ
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్.. ఫీచర్లు, ధర వివరాలివే
ఎలక్ట్రిక్ కారు Toyota Urban Cruiser EV లాంచ్ చేసిన జపాన్, 500 కి.మీ కంటే ఎక్కువ రేంజ్..
Tamilnadu assembly: తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర గీతమే ఫస్ట్ - ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ - ఈ వివాదం ఎప్పటిదో?
తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర గీతమే ఫస్ట్ - ప్రసంగించకుండా గవర్నర్ వాకౌట్ - ఈ వివాదం ఎప్పటిదో?
Medaram Jatara 2026: ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ విశిష్టత మీకు తెలుసా? చరిత్ర చెబుతున్నదేంటి..?
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క సారలమ్మ విశిష్టత మీకు తెలుసా? చరిత్ర చెబుతున్నదేంటి..?
Chandrababu at Davos: ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
ఏపీలో ఫుడ్ ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు యూఏఈ నిర్ణయం.. దావోస్‌లో సీఎం చంద్రబాబు
Kerala: కేరళలో మగవాళ్లు అంతా అట్టపెట్టెలు చుట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా?
కేరళలో మగవాళ్లు అంతా అట్టపెట్టెలు చుట్టుకుని తిరుగుతున్నారు. ఎందుకో తెలుసా?
Embed widget