అన్వేషించండి

ఈడీ విచారణకు హాజరైన ఎల్ రమణ- క్యాసినో లింకులపై ప్రశ్నలు

క్యాసినో కేసులో దర్యాప్తును ఈడీ స్పీడప్ చేసింది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులను విచారించిన దర్యాప్తు సంస్థ... మరికొంతమందిని పిలుస్తోంది. అందులో భాగంగానే ఈడీ విచారణకు ఎల్‌ రమణ హాజరయ్యారు

తెలంగాణలో క్యాసినో కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐదురోజులుగా కొనసాగుతున్న దర్యాప్తులో చాలా మంది ప్రజాప్రతినిధులను ఈడీ విచారిస్తోంది. తాజాగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్‌ రమణను పిలిచి రెండో రోజు విచారిస్తోంది. ఆయన విదేశాల్లో క్యాసినో ఆడినట్టు అనుమానిస్తోంది దర్యాప్తు సంస్థ. 

క్యాసినో కేసులో దర్యాప్తును ఈడీ స్పీడప్ చేసింది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులను విచారించిన దర్యాప్తు సంస్థ... మరికొంతమందిని పిలుస్తోంది. అందులో భాగంగానే ఈడీ విచారణకు ఎల్‌ రమణ హాజరయ్యారు. ఈడీ ఇచ్చిన నోటీసుల మేరకు దర్యాప్తునకు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ వచ్చారు. వారి సూచించినట్టుగానే బ్యాంకు స్టేట్‌మెంట్లతో ఈడీ ముందుకు వచ్చారు రమణ. 

ఇప్పటికే ఈ కేసులో చాలా మందిని విచారించిన ఈడీ అధికారులు... వాళ్లు ఇచ్చిన సమాచారంతోనే రమణను విచారిస్తున్నారు. ఆయన విదేశాల్లో క్యాసినో ఆడినట్టు వాళ్లు చెప్పిన ఆధారాలతో రమణను క్వశ్చన్ చేస్తున్నారు. చికోటి ప్రవీణ్‌, ఇతరులతో నేరుగా సంబంధాలపైకూడా ఆరా తీస్తున్నారు. ఎక్కడెక్కడ క్యాసినో ఆడారు... అక్కడకు వెళ్లిన తర్వాత జరిగిన లావాదేవీలపై ప్రశ్నలు సంధిస్తున్నారు. 

ఇప్పటికే కొందరు నేతలను విచారించిన ఈడీ

కేసినో కింగ్ చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ వంద మందికి నోటీసులు జారీ చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ గురువారం ఈడీ ఎదుట హాజరయ్యారు. బుధవారమే మంత్లి తలసాని సోదరులు విచారణకు హాజరయ్యారు. చీకోటి ప్రవీణ్ కేసినో ఖాతాదారుల్లో తెలంగాణ నుంచే కాదు.. ఏపీ నుంచి కూడా  ప్రముఖులు ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఆయన కూడా విచారణకు హాజరయ్యారు. అనంతపురం అర్బన్‌ నుుంచి గతంలో కాంగ్రెస్,  వైఎస్ఆర్‌సీపీ తరపున ఎమ్మెల్యేలగా గెలిచారు గుర్నాథ్ రెడ్డి. ప్రస్తుతం వైఎస్ఆర్‌సీపీలోనే ఉన్నారు. 

ఈడీ ఎదుటకు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, మాజీ ఎంపీ బుట్టా  రేణుక సోదరుడు 

అనూహ్యంగా గుర్నాథ్‌ రెడ్డితో పాటు యుగంధర్ అనే వ్యక్తి కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. ఆయన వైఎస్ఆర్‌సీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక సోదరుడు అని తెలుస్తోంది. వీరిద్దరూ చీకోటి ప్రవీణ్ నిర్వహించిన కేసినోల్లో పాల్గొనడానికి ఇతర దేశాలకు వెళ్లారని.. హవాలా మార్గం ద్వారా డబ్బులు చెల్లించారన్న  ఆరోపణలపై ఈడీ ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇప్పటి వరకూ వంద మందికి ఈడీ నోటీసులు జారీ చేసింది. కేసినో అంటే.. లక్షల్లో ఉండే వ్యవహారం కావడం.. ఎక్కువగా బ్లాక్ మనీతోనే  లావాదేవీలు నిర్వహిస్తారు కానీ.. రాజకీయ నేతలు.. వారితో సంబంధాలున్నవారే ఈ కేసుల్లో ఉన్నారు. దీంతో నోటీసులు అందుకున్న వారి పేర్లు బయటకు వచ్చే కొద్దీ సంచలనం అవుతున్నాయి. 

చీకోటి ప్రవీణ్ దగ్గర లభించిన ఆధారాలతో  ఈడీ నోటీసులు 

విదేశాల్లో క్యాసినో నిర్వహణ, ఆర్థిక లావాదేవీల వంటి అంశాలపై ఆరా తీశారు. ఫెమా యాక్ట్ నిబంధనలు, మనీలాండరింగ్‎పై ఈడీ కూపీ లాగుతోంది.   చీకోటి ప్రవీణ్, మాధవ్‎రెడ్డి కాల్‎డేటా ఆధారంగా వివరాలు సేకరించారు.  ట్రావెల్ ఏజెన్సీ ద్వారా ఫ్లైట్ బుకింగ్స్ వివరాలు సేకరించిన ఈడీ వాటి ఆధారంగా అనుమానితులను విచారణకు పిలుస్తున్నారు. గతంలో చీకోటి ప్రవీణ్‌ను ఈడీ నాలుగు రోజుల పాటు ప్రశ్నించింది. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులు, స్థిరాస్తి వ్యాపారాలు అనేక మంది క్యాసినోలకు వెళ్లినట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. దీనిపై కూడా ప్రవీణ్ బృందాన్ని లోతుగా ప్రశ్నించింది.   క్యాసినోలో జూదం ఆడాలంటే విదేశీ మారక ద్రవ్యం కావాలి. పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యం తీసుకు వెళ్లడం సాధ్య పడదు. ఈ క్రమంలోనే తమకు కావాల్సిన విలువకు తగ్గట్టు నగదు చెల్లిస్తే ప్రవీణ్, అతని అనుచరులు ఇక్కడే టోకెన్లు ఇచ్చే వారని, వాటితోనే విదేశాల్లో జూదం ఆడేవారని తెలుస్తోంది. ఫెమా నిబంధనల ప్రకారం ఇది చట్ట విరుద్ధం. దీనిపైనే ప్రస్తుతం ఈడీ విచారిస్తోంది. 

అక్రమంగా  డబ్బులు తరలించిన కోణంలోనే విచారణ

హవాలా మార్గంలో ద్రవ్య మారకం జరిగనట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో దాని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారని ఈడీ లోతుగా విచారిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలులోని ప్రజాప్రతినిధులు, ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. విదేశీ మారక ద్రవ్యానికి సంబంధించి వీరి ప్రమేయం ఉన్నట్లు బయట పడితే... రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా సంచలనం అయ్యే అవకాశం ఉంది.  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Deputy CM Pawan Kalyan త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Crime News: ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
Dhoni Magic Stumping: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP DesamCSK vs MI Match Highlights IPL 2025 | ముంబైపై 4 వికెట్ల తేడాతో చెన్నై జయభేరి | ABP DesamSRH vs RR IPL 2025 Match Highlights | రాజస్థాన్ పై 44 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy CM Pawan Kalyan త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
త్రిభాషా విధానం, డీలిమిటేషన్ అంశాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
Hyderabad Crime News: ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
ఎంఎంటీఎస్‌ రైలులో యువతిపై అత్యాచారయత్నం, భయంతో కిందకి దూకేసిన బాధితురాలు
Dhoni Magic Stumping: మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
మెరుపు వేగంతో ధోనీ స్టంపింగ్, సూర్యకుమార్ షాక్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో
Robinhood Trailer: నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
నేను వస్తే లైఫ్ లాంగ్ క్వారంటైన్ - నితిన్ 'రాబిన్ హుడ్' ట్రైలర్ వేరే లెవల్ అంతే.. వార్నర్ ఎంట్రీ అదుర్స్..
CM Chandrababu: పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
పోలవరానికి మరోసారి సీఎం చంద్రబాబు, ఈ 27న ప్రాజెక్టుపై అక్కడే సమీక్ష
KTR Comments: బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
బీఆర్ఎస్ ఓటమిలో ప్రజల తప్పు లేదు, కానీ సీఎం కుర్చీలో దొంగ !: కేటీఆర్
IPL 2025 CSK VS MI Result Update: చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
చెన్నైదే పైచేయి.. ముంబైపై ఉత్కంఠ భ‌రిత విజ‌యం.. రుతురాజ్ కెప్టెన్స్ ఇన్నింగ్స్, రాణించిన రచిన్
AP Police: బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
బెట్టింగ్లు ప్రమోట్ చేసేవాళ్లనే కాదు.. ఆడేవాళ్ళనీ వదిలేది లేదు: ఏపీ డీజీపీ వార్నింగ్
Embed widget