అన్వేషించండి

Hyderabad News: ఎలక్షన్స్ ఎఫెక్ట్! ఖాళీ అవుతున్న హైదరాబాద్‌ - టికెట్లు దొరక్క జనం ఇబ్బందులు

AP Elections 2024: ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే హైదరాబాద్ ప్రజలు వెళ్లడానికి సరిపడా బస్సులను టీఎస్‌ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఏపీఎస్ఆర్టీసీ కూడా ఇలాంటి ప్రకటనే చేసింది.

APSRTC TSRTC News: హైదరాబాద్ సహా తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ ఆంధ్రప్రదేశ్ వాసులు సొంతూర్లకు పయనం అవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అదే రోజు తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలను మొత్తం ఒకే విడతలో నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, అంతకుముందు రెండు రోజులు వారాంతపు సెలవులు కూడా కావడంతో ఆంధ్రా ప్రజలు తమకు ఓటు హక్కు ఉన్న సొంతూర్లకు పయనం అవుతున్నారు. 

మామూలు రోజుల్లో అయితే, హైదరాబాద్ నుంచి శుక్ర, శని, ఆదివారాల్లో ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాలకు 2 వేలకు పైగా ప్రైవేటు, ఆర్టీసీ బస్సులన్నీ దాదాపు 100 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తాయి. కానీ గత వారం రోజులుగా ప్రతిరోజూ బస్సులు ఫుల్ ఆక్యుపెన్సీతో ఉన్నట్లుగా ట్రావెల్స్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రానున్న ఐదారు రోజుల్లో అయితే, రిజర్వేషన్లకు ఫుల్ డిమాండ్ ఉందని చెబుతున్నారు. అటు ఏపీ వైపు వెళ్లే అన్ని రైళ్లలోనూ టికెట్లన్నీ బుక్ అయి.. వందల కొద్దీ వెయిటింగ్ లిస్ట్ లు ఉన్నాయి. ఈ రద్దీ కారణంగా ఆర్టీసీ, రైల్వే యాజమాన్యం ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది.

టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఏపీలో ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే హైదరాబాద్ ప్రజలు వెళ్లడానికి సరిపడా బస్సులను టీఎస్‌ఆర్టీసీ నడుపుతున్నట్లుగా రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ బి.రాజు తెలిపారు. ఈ నెల 9 నుంచే ఏపీకి రద్దీ ఉంటుందని అంచనా వేశామని.. శని, ఆదివారాల్లో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలోని గ్రామాలకు వెళ్లాలనుకునే వారు కూడా ఇబ్బందులు లేకుండా స్వస్థలాలకు వెళ్లేలా ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. పోలింగ్ రోజు తెల్లవారుజాము నుంచి తిరిగి వచ్చేందుకు అర్ధరాత్రి వరకు బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ రోజూ నడిచే 3,450 బస్సులే కాక, మరో వెయ్యికి పైగా బస్సులను నడుపబోతోంది. దాదాపు 200 బస్సుల్లో రిజర్వేషన్‌ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఈనెల 9 నుంచి 12 వరకు రోజూ నడిచే 352 బస్సులకు అదనంగా 500 బస్సులను నడుపుతున్నామని ఏపీఎస్‌ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ కిషోర్‌నాథ్‌ తెలిపారు. అదనపు బస్సుల్లోనూ రిజర్వేషన్‌ సౌకర్యం ఉంటుందని ఆయన తెలిపారు.

రేట్లు పెంచేసిన ప్రైవేటు ట్రావెల్స్
పోలింగ్ సందర్భాన్ని ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు క్యాష్ చేసుకుంటున్నాయి. రిజర్వేషన్లకు బాగా డిమాండ్ ఉండడంతో ఒక టిక్కెట్ ధరను ఇష్టారీతిన మూడు నాలుగు రెట్లు పెంచేశారు. రూ.500 టిక్కెట్ రూ.1500 వరకూ ఉంటోంది. విజయవాడ వెళ్లాలంటే రూ.వెయ్యి దాకా టికెట్ ఉంటోందని ప్రయాణికులు వాపోతున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget