అన్వేషించండి

Telangana News: భూముల క్రమబద్ధీకరణకు గడువు పెంపు - 2020 జూన్ 2 కటాఫ్‌ డేట్

Telangana News: రాష్ట్రంలోని ప్రభుత్వ భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని చాలా కాలంగా జీవిస్తున్న పేదలు ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు సర్కారు మరో అవకాశం ఇచ్చింది.

Telangana News: తెలంగాణలో దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న పేదలు ఆ స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. వారికి హక్కులు కల్పించేందుకు మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. సింగరేణి సంస్థకు చెందిన భూముల్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి కూడా మరోసారి క్రమబద్ధీకరణ వెసులుబాటు కల్పించింది.

పేదల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు జీవో 58, జీవో 59 కింద భూముల క్రమబద్ధీకరణ, హక్కుల బదలాయింపు కోసం మరోసారి దరఖాస్తు చేసుకునే అకాశం కల్పించింది ప్రభుత్వం. కటాఫ్ తేదీని 2020 జూన్ 2వ తేదీ వరకు పొడగించింది. ఈ క్రమంలోనే రెవెన్యూ శాఖ శుక్రవారం రోజు జీవో నెంబర్ 28, 29 జారీ చేసింది. పట్టణాల్లోని భూముల క్రమబద్ధీకరణ దరఖాస్తులకు 30 రోజులు అవకాశం ఇవ్వగా.. సింగరేణి పరిధిలో దరఖాస్తులకు మూడు నెలలు అవకాశం ఇచ్చింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో జీవో 58, 59 కింద పట్టణ పేదలకు మరోసారి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో కటాఫ్ తేదీని పొడగించింది. 

ఎన్నికల కోడ్ ఎత్తివేయడంతో ఉత్తర్వులు జారీ

అయితే వెంటనే మార్గదర్శకాలు విడుదల చేయాలని భావించినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. శుక్రవారం కోడ్ ఎత్తివేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి పరిధిలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, పెద్దపెల్లి, జగిత్యాల జిల్లాల పరిధిలో సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ భూములు నివాసం ఉంటున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడేనాటికి అంటే 2014 జూన్ 2వ తేదీ నాటికి పట్టణాల పరిధిలో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి శాశ్వత హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 2014 డిసెంబర్ 30వ తేదీన జీవో 58, 59ను విడుదల చేశారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించారు. 

ఆన్ లైన్ ద్వారా తగ్గిన అవినీతి..

పలు కారణాల వల్ల కొందరు దరఖాస్తు చేసుకోలేకపోయారని గుర్తించిన సర్కారు... గత ఏడాది ఫిబ్రవరిలో మరోసారి దరఖాస్తుకు అవకాశం కల్పించింది. ఈ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. సింగరేణి పరిధిలోనూ జీవో 58, 59 కింద 2014లో ఒకసారి, 2019లో మరోసారి దరఖాస్తులకు అవకాశం కల్పించింది. అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించారు. ఇలా ఇప్పటి వరకు జీవో 58 కింది.. లక్షా 45 వేల 668 మంది పట్టాలు పొందారు. జీవో 59 కింద 42 వేల మందికి వారి ఇండ్లపై హక్కులు సంక్రమించాయి. తాజాగా పేదలకు మరోసారి దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. కటాఫ్ తేదీని ఆరేళ్లు పొడగించింది. 2020 జూన్ 2వ తేదీకి మార్చింది. ఈ నిర్ణయంతో లక్షల మందికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్గనుంది. గతంలో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు పెద్ద ఎత్తున అవినీతి జరిగేది. స్థానిక నాయకులు పెద్ద మొత్తంలో డబ్బులు అడిగేవారు. కానీ తెలంగాణ సర్కారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు తీసుకోవడం వల్ల చాలా వరకు అవినీతి తగ్గింది.

ఎవరెవరు ఎంత డబ్బులు చెల్లించాలి..

అయితే క్రమబద్ధీకరణకు కొత్త కటాఫ్ తేదీ 2020 జూన్ 2వ తేదీ. అలాగే పట్టణాల్లో దరఖాస్తుల గడువు తేదీ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 30 వరకు. సింగరేణి పరిధిలో ఏప్రిల్ 1 నుంచి జూన్ 30వ తేదీ వరకు. 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్న వారికి ఉచితంగా క్రమబద్ధీకరణ. 126-250 చదరపు గజాల వరకు ఆక్రమించిన వారు భూమి మార్కెట్ ధరలో 50 శాతం ఫీజు చెల్లించాలి. 251-500 చదరపు గజాల వరకు విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకున్న వారు మార్కెట్ ధరలో 75 శాతం ఫీజు చెల్లించి క్రమబబద్ధీకరించుకోవచ్చు. 500 నుంచి వెయ్యి గజాల వరకు ఉంటే ప్రభుత్వ ధరను 100 శాతం చెల్లించాలి. నివాసేతర భూములకు ధర 100 శాతం చెల్లించాలి. మీసేవ కేంద్రాల్లో క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ స్థలంలో కటాఫ్ తేదీ కన్నా ముందు నుంచే నివాసం ఉంటున్నట్లు ధ్రువపత్రాలను సమర్పించాలి. ఆర్డీఓ ఛైర్మన్ గా, తహసీల్దార్ సభ్యులుగా ఉండే కమిటీ దరఖాస్తులను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ICC Champions Trophy 2025 Team India | అగార్కర్ తో డ్రెస్సింగ్ రూమ్ లో Gambhir డిష్యూం డిష్యూం | ABP DesamChhatrapati Sambhaji Maharaj 'Sambar' | సాంబార్ చరిత్ర తెలిస్తే షాక్ అవుతారు | ABP DesamVicky Kaushal Bollywood Super Star | Chhava తో కొత్త సూపర్ స్టార్ పుట్టాడా.? | ABP DesamMLC Candidate Aviash Jadhav Interview | పదిహేను నా లక్కీ నెంబర్ ఎందుకంటే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Ramanaidu:  మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
మత్స్యకారులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం.. వారి ఖాతాల్లో రూ.20వేలు
Revanth Reddy:  ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఏసీ గదులు వీడడం లేదు.. అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Priyanka Chopra: హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
హైదరాబాద్ చేరుకున్న ప్రియాంకచోప్రా - మళ్లీ రాజమౌళి, మహేశ్ బాబు 'SSMB29' షూట్‌లోకి.. జక్కన్న కొత్త రూల్ ఏంటో తెలుసా?
IPL Schedule 2025: ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది.. వచ్చేనెల 22 నుంచి స్టార్ట్.. ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్ లు
Hyderabad Crime News మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
మేడ్చల్‌లో యువకుడి దారుణహత్య, నడిరోడ్డుపై కత్తులతో దాడి కేసులో ఊహించని ట్విస్ట్
First GBS Death in AP: ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
ఏపీలో తొలి జీబీఎస్ పేషెంట్ మృతి, నిర్ధారించిన గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్
WPL Result Update: గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
గార్డెనర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ బోణీ, 6 వికెట్లతో యూపీ చిత్తు
Who Is Mastan Sai: ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
ఐఐటీలో బీటెక్ నుంచి డ్రగ్స్ పెడ్లర్, బ్లాక్ మెయిలర్ వరకు.. ఎవరీ మస్తాన్ సాయి, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.