బుధవారం నుంచి అన్ని రకాల పౌరసేవలపై వినియోగ ఛార్జీలు పెరిగాయి. దీనికి అదనంగా 18% GST కూడా చేర్చబడింది.
Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్కు ఎంతు తీసుకుంటారు?
తెలంగాణ ప్రభుత్వం మీ సేవ కేంద్రాల ద్వారా అందించే పౌర సేవల వినియోగ ఛార్జీలను 50 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి అదనంగా 18 శాతం జీఎస్టీతో కలిసి 78 శాతం భారం పడనుంది.

- మీసేవ కేంద్రాలలో పౌర సేవలకు జీఎస్టీతో పాటు ఛార్జీలు పెరిగాయి.
- వర్గం A సేవల రుసుము 35 నుండి 62 రూపాయలకు, వర్గం B 45 నుండి 80కి పెరిగింది.
- జీఎస్టీతో కలిపి మొత్తం భారం 77% వరకు పెరిగింది.
- మీసేవ నిర్వాహకుల కమీషన్ కూడా గణనీయంగా పెరిగింది.
Telangana Meeseva Charges: తెలంగాణ రాష్ట్రంలో పౌర సేవలను డిజిటల్ రూపంలో ప్రజలకు చేరవేసే మీ సేవ కేంద్రాల ఛార్జీల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 15 ఏళ్లుగా ఉన్న పెంపు డిమాండ్ను ఇన్ని రోజులు నెరవేర్చారు. ఇప్పుడు పెరిగిన ఛార్జీల ప్రకారం ఏయే సర్టిఫికెట్లకు ఎంత వసూలు చేస్తారో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఉత్తర్వుల మేరకు, బుధవారం నుంచి అన్ని రకాల పౌరసేవలపై వినియోగ ఛార్జీలు పెరిగాయి. గతంలో కేవలం వినియోగ ఛార్జీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ప్రభుత్వం వీటికి 18 శాతం జీఎస్టీని అదనంగా చేర్చింది.
చార్జీల పెంపు ఎలా ఉందంటే?
మీ సేవలో అందించే సేవలను ప్రధానంగా రెండు కేటగిరీలుగా విభజిస్తారు. కేటగిరి ఏలో ఉండే డాక్యుమెంట్ స్కాన్ లేదా సంబంధిత విభాగాల విచారణ అవసరం లేని సేవలు ఉంటాయి. గతంలో దీనికి 35 రూపాయలు వసూలు చేసే వారు. ఇప్పుడు దీన్ని 62 రూపాయలకు పెంచారు.
కేటగిరి బీలో వివిధ శాఖల విచారణ లేదా పరిశీలిన తర్వాత అందించే సేవలు వస్తాయి. ఈ కేటగిరి కింద అందించే సేవలకు 45 రూపాయలు తీసుకునే వాళ్లు. ఇప్పుడు దాన్ని 80 రూపాయలకు పెంచారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన పెంపు 50శాతమే అయినప్పటికీ జీఎస్టీని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ భారం 77 శాతం నుంచి 78 వరకు పెరుగుతుంది.
ఎవరిపై ఎలాంటి భారం పడుతుంది?
ఈ ధరల పెంపు ముఖ్యంగా సర్టిఫికెట్లు కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లి వారిపై ప్రభావం చూపనుంది. ఇప్పటి వరకు కుల ధ్రువీకరణ పత్రం తీసుకునే వారు కేవలం 45 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ కోసం 80 రూపాయలు చెల్లించాలి. గతంలో దరఖాస్తుతోపాటు నాలుగు కంటే ఎక్కువ పేజీలు స్కాన్ చేయాల్సి వస్తే పేజీకి రెండు రూపాయలు వసూలు చేసే వాళ్లు ఇప్పుడు అది 2.50కు పెంచారు.
మీసేవ నిర్వాహకులకు పెరిగిన కమిషన్
ప్రజలపై భారం వేసిన ప్రభుత్వం మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు ఊరట కల్పించింది. వారి కమిషన్లు పెంచింది. కేటగిరి ఏలో సేవలకు గతంలో 13 రూపాయల కమీషన్ ఉండేది. దీన్ని ఇప్పుడు 40.34 రూపాయలకు పెంచారు. కేటగిరి బీ సేవలకు 52.10 రూపాయాల కమిషన్ ఇస్తారు.
ఎక్కువ తీసుకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
ప్రభుత్వం నిర్ణయించిన ఈ కొత్త ధరల కంటే మీ సేవ కేంద్రాల నిర్వాహకులు అదనంగా వసూలు చేయడానికి లేదు. అలా ఎవరైనా వసూళ్లకు పాల్పడిదే 1100 లేదా 18004251110 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు లేదా. meesevasupport@telangana.gov.inకు మెయిల్ చేయవచ్చు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
Frequently Asked Questions
మీసేవా ఛార్జీలు ఎప్పటినుంచి పెరిగాయి?
వర్గం A లోని సేవలకు పాత మరియు కొత్త ఛార్జీలు ఏమిటి?
వర్గం A (డాక్యుమెంట్ స్కాన్ లేదా విచారణ అవసరం లేనివి) లోని సేవలకు గతంలో 35 రూపాయలు వసూలు చేసేవారు, ఇప్పుడు 62 రూపాయలకు పెంచారు.
వర్గం B లోని సేవలకు పాత మరియు కొత్త ఛార్జీలు ఏమిటి?
వర్గం B (వివిధ శాఖల విచారణ అవసరమైనవి) లోని సేవలకు గతంలో 45 రూపాయలు వసూలు చేసేవారు, ఇప్పుడు 80 రూపాయలకు పెంచారు.
కుల ధ్రువీకరణ పత్రం కోసం ఎంత చెల్లించాలి?
ఇప్పటివరకు కుల ధ్రువీకరణ పత్రం కోసం 45 రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు 80 రూపాయలు చెల్లించాలి.
మీసేవా కేంద్రాలు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
మీసేవా కేంద్రాలు నిర్ణయించిన ధరల కంటే అదనంగా వసూలు చేస్తే 1100 లేదా 18004251110 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు లేదా meesevasupport@telangana.gov.in కు మెయిల్ చేయవచ్చు.
ట్రెండింగ్ వార్తలు





















