అన్వేషించండి

Telangana Meeseva Charges: తెలంగాణలో మీసేవ ఛార్జీలు భారీగా పెంపు! ఏయే సర్టిఫికెట్‌కు ఎంతు తీసుకుంటారు?

తెలంగాణ ప్రభుత్వం మీ సేవ కేంద్రాల ద్వారా అందించే పౌర సేవల వినియోగ ఛార్జీలను 50 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి అదనంగా 18 శాతం జీఎస్టీతో కలిసి 78 శాతం భారం పడనుంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మీసేవ కేంద్రాలలో పౌర సేవలకు జీఎస్టీతో పాటు ఛార్జీలు పెరిగాయి.
  • వర్గం A సేవల రుసుము 35 నుండి 62 రూపాయలకు, వర్గం B 45 నుండి 80కి పెరిగింది.
  • జీఎస్టీతో కలిపి మొత్తం భారం 77% వరకు పెరిగింది.
  • మీసేవ నిర్వాహకుల కమీషన్ కూడా గణనీయంగా పెరిగింది.

Telangana Meeseva Charges: తెలంగాణ రాష్ట్రంలో పౌర సేవలను డిజిటల్‌ రూపంలో ప్రజలకు చేరవేసే మీ సేవ కేంద్రాల ఛార్జీల విషయంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. 15 ఏళ్లుగా ఉన్న పెంపు డిమాండ్‌ను ఇన్ని రోజులు నెరవేర్చారు. ఇప్పుడు పెరిగిన ఛార్జీల ప్రకారం ఏయే సర్టిఫికెట్లకు ఎంత వసూలు చేస్తారో చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణారావు ఉత్తర్వుల మేరకు, బుధవారం నుంచి అన్ని రకాల పౌరసేవలపై వినియోగ ఛార్జీలు పెరిగాయి. గతంలో కేవలం వినియోగ ఛార్జీలు మాత్రమే ఉండగా, ఇప్పుడు ప్రభుత్వం వీటికి 18 శాతం జీఎస్టీని అదనంగా చేర్చింది. 

చార్జీల పెంపు ఎలా ఉందంటే?

మీ సేవలో అందించే సేవలను ప్రధానంగా రెండు కేటగిరీలుగా విభజిస్తారు. కేటగిరి ఏలో ఉండే డాక్యుమెంట్ స్కాన్ లేదా సంబంధిత విభాగాల విచారణ అవసరం లేని సేవలు ఉంటాయి. గతంలో దీనికి 35 రూపాయలు వసూలు చేసే వారు. ఇప్పుడు దీన్ని 62 రూపాయలకు పెంచారు. 

కేటగిరి బీలో వివిధ శాఖల విచారణ లేదా పరిశీలిన తర్వాత అందించే సేవలు వస్తాయి. ఈ కేటగిరి కింద అందించే సేవలకు 45 రూపాయలు తీసుకునే వాళ్లు. ఇప్పుడు దాన్ని 80 రూపాయలకు పెంచారు. వాస్తవానికి ప్రభుత్వం ప్రకటించిన పెంపు 50శాతమే అయినప్పటికీ జీఎస్టీని కూడా పరిగణలోకి తీసుకుంటే ఈ భారం 77 శాతం నుంచి 78 వరకు పెరుగుతుంది. 

ఎవరిపై ఎలాంటి భారం పడుతుంది?

ఈ ధరల పెంపు ముఖ్యంగా సర్టిఫికెట్లు కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లి వారిపై ప్రభావం చూపనుంది. ఇప్పటి వరకు కుల ధ్రువీకరణ పత్రం తీసుకునే వారు కేవలం 45 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ సర్టిఫికెట్ కోసం 80 రూపాయలు చెల్లించాలి. గతంలో దరఖాస్తుతోపాటు నాలుగు కంటే ఎక్కువ పేజీలు స్కాన్ చేయాల్సి వస్తే పేజీకి రెండు రూపాయలు వసూలు చేసే వాళ్లు ఇప్పుడు అది 2.50కు పెంచారు. 

మీసేవ నిర్వాహకులకు పెరిగిన కమిషన్ 

ప్రజలపై భారం వేసిన ప్రభుత్వం మీ సేవ కేంద్రాల నిర్వాహకులకు ఊరట కల్పించింది. వారి కమిషన్లు పెంచింది. కేటగిరి ఏలో సేవలకు గతంలో 13 రూపాయల కమీషన్ ఉండేది. దీన్ని ఇప్పుడు 40.34 రూపాయలకు పెంచారు. కేటగిరి బీ సేవలకు 52.10 రూపాయాల కమిషన్ ఇస్తారు. 

ఎక్కువ తీసుకుంటే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

ప్రభుత్వం నిర్ణయించిన ఈ కొత్త ధరల కంటే మీ సేవ కేంద్రాల నిర్వాహకులు అదనంగా వసూలు చేయడానికి లేదు. అలా ఎవరైనా వసూళ్లకు పాల్పడిదే 1100 లేదా 18004251110 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు లేదా. meesevasupport@telangana.gov.inకు మెయిల్ చేయవచ్చు.    

Frequently Asked Questions

మీసేవా ఛార్జీలు ఎప్పటినుంచి పెరిగాయి?

బుధవారం నుంచి అన్ని రకాల పౌరసేవలపై వినియోగ ఛార్జీలు పెరిగాయి. దీనికి అదనంగా 18% GST కూడా చేర్చబడింది.

వర్గం A లోని సేవలకు పాత మరియు కొత్త ఛార్జీలు ఏమిటి?

వర్గం A (డాక్యుమెంట్ స్కాన్ లేదా విచారణ అవసరం లేనివి) లోని సేవలకు గతంలో 35 రూపాయలు వసూలు చేసేవారు, ఇప్పుడు 62 రూపాయలకు పెంచారు.

వర్గం B లోని సేవలకు పాత మరియు కొత్త ఛార్జీలు ఏమిటి?

వర్గం B (వివిధ శాఖల విచారణ అవసరమైనవి) లోని సేవలకు గతంలో 45 రూపాయలు వసూలు చేసేవారు, ఇప్పుడు 80 రూపాయలకు పెంచారు.

కుల ధ్రువీకరణ పత్రం కోసం ఎంత చెల్లించాలి?

ఇప్పటివరకు కుల ధ్రువీకరణ పత్రం కోసం 45 రూపాయలు చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడు 80 రూపాయలు చెల్లించాలి.

మీసేవా కేంద్రాలు నిర్ణయించిన ధర కంటే ఎక్కువ వసూలు చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?

మీసేవా కేంద్రాలు నిర్ణయించిన ధరల కంటే అదనంగా వసూలు చేస్తే 1100 లేదా 18004251110 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు లేదా meesevasupport@telangana.gov.in కు మెయిల్ చేయవచ్చు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Metro Pillar 1043 Crack: అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
అమీర్‌పేట అగ్నిప్రమాదంతో మెట్రోకు ముప్పు - పిల్లర్ 1043కి క్రాక్ - ఎమర్జెన్సీ చర్యలు
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News:
"ఒక్కో ఉద్యోగం 40 లక్షలు" టీటీడీ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీపై భూమన కరుణాకర్ రెడ్డి సంచలన ఆరోపణలు 
Hyderabad Metro Fact Check:
"అమీర్‌పేట అగ్ని ప్రమాదంలో మెట్రో పిల్లర్‌కు నష్టం జరగలే, పగుళ్లు ప్రచారం ఫేక్" హైదరాబాద్‌ మెట్రో ఎండీ ప్రకటన
Andhra Pradesh Rajya Sabha Elections:అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
అన్నామలై ఎఫెక్ట్‌! ఏపీలో రాజ్యసభ సీటు వదులుకున్న బీజేపీ! కూటమిలో కొత్త లెక్కలేంటీ?
Karnataka Minister Ramalinga Reddy : కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
కర్ణాటక సీఎం డీకేకు షాక్! పోర్ట్‌పోలియోపై అసంతృప్తితో మంత్రి రామలింగారెడ్డి రాజీనామా!
Embed widget