అన్వేషించండి

CBI Enquiry On Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ సమాచార సేకరణ- విచారణ డ్యూటీ ఎక్కిన దర్యాప్తు సంస్థ  

CBI Enquiry On Kaleshwaram Project : కాళేేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణకు సీబీఐ రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సేకరిస్తోంది.

CBI Enquiry On Kaleshwaram Project : తెలంగాణలో రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు మరోసారి హాట్ డిబేట్‌గా మారబోతోంది. ప్రాజెక్టులో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ కేసులో కీలకంగా భావించే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను, ఇతర వివరాలను తెప్పించుకుంటోంది. ఆలస్యమవుతుందని అనుకున్న విచారణ ఇప్పుడు వేగం పుంజుకునే అవకాశం ఉంది.  

కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగా చాలా రాజకీయాలు జరిగాయి. ఇందులో పిల్లర్లు కుంగిపోవడంతో ఆ రాజకీయాలు పీక్స్‌కు చేరాయి. దీనిపై వస్తున్న ఆరోపణల్లో ఉన్న వాస్తలు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్‌ కమిషన్‌ వేసింది. ఆయన సుదీర్ంగా విచారణ చేశారు. ఇందులో కీలకంగా ఉన్న వారందర్నీ విచారించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, హరీష్‌రావును కూడా విచారించారు.

కమిషన్ అడిగిన ప్రశ్నలు, వాళ్లు ఇచ్చిన సమాచారంతో తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ మంత్రివర్గంలో తీవ్రంగా చర్చించారు. అనంతరం దీనిలో ఉన్న మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీబీఐకి సమాచారం చేరవేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసును టేకప్ చేసిన సీబీఐ దర్యాప్తుకు ఓకే చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి, పీసీ ఘోష్ కమిషన్ నుంచి వివరాలు సేకరిస్తోంది. 

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి అనేక వివాదాలు అలుముకున్నాయి. కోర్టుల చుట్టూ తిరిగాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అన్నింటినీ చెక్ పెట్టే ప్రయత్నాల్లో విచారణ దశకు వెళ్లింది. ఈ విచార దశకు వెళ్లే క్రమంలో కూడా కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలు అయ్యాయి. ఈ కాళేశ్వరంపై ప్రభుత్వం వేసిన ఏక సభ్య కమిషన్ పీసీ ఘోష్ కమిషన్‌కు చట్టబద్ధత లేదని కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు.దాన్ని కోర్టు కొట్టేసింది. తర్వాత కమిషన్ రిపోర్డు బహిర్గతం చేయొద్దని కూడా పిటిషన్ వేశారు. దీనిపై ప్రభుత్వానికి కోర్టు కొన్ని సూచనలు చేసింది. 

కోర్టు ఆదేశాల మేరకు ఇంత వరకు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏముందో బయటకు రాలేదు. అయినా ఇంతలో కేసుకు వెళ్లింది. ఇది ఎవరూ ఊహించలేదు. కానీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో కేసు మరో మలుపులు తిరిగింది. అయితే నివేదికలోని కొన్ని విషయాలపై ప్రభుత్వం లీకులు ఇచ్చింది. ఎక్కడా అధికారికంగా ఎలాంటి వివరాలు అందించకపోయినా నివేదికలో ఏముందో తెలిసింది. అసెంబ్లీలో కూాడా చర్చకు పెట్టింది. వాటి ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. దీని ఆధారంగానే ఈ కేసు విచారణ బాధ్యతను తీసుకున్న సీబీఐ రంగంలోకి దిగింది. తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. 

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
Rains In AP And Telangana: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీలో ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. తెలంగాణలో పలుచోట్ల తేలికపాటి జల్లులు
Re-NEET UG 2026 Result: నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
నీట్‌ రీటెస్ట్ 2026 ఫలితాలు విడుదల! 11.21 లక్షల మంది అభ్యర్థులు అర్హత!  
Breaking News: పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 
పూరీ జగన్నాథ్ ఆలయంలో తొక్కిసలాట- ఒకరు మృతి- 100 మందికి గాయాలు 

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget