అన్వేషించండి

CBI Enquiry On Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ సమాచార సేకరణ- విచారణ డ్యూటీ ఎక్కిన దర్యాప్తు సంస్థ  

CBI Enquiry On Kaleshwaram Project : కాళేేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణకు సీబీఐ రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సేకరిస్తోంది.

CBI Enquiry On Kaleshwaram Project : తెలంగాణలో రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు మరోసారి హాట్ డిబేట్‌గా మారబోతోంది. ప్రాజెక్టులో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ కేసులో కీలకంగా భావించే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను, ఇతర వివరాలను తెప్పించుకుంటోంది. ఆలస్యమవుతుందని అనుకున్న విచారణ ఇప్పుడు వేగం పుంజుకునే అవకాశం ఉంది.  

కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగా చాలా రాజకీయాలు జరిగాయి. ఇందులో పిల్లర్లు కుంగిపోవడంతో ఆ రాజకీయాలు పీక్స్‌కు చేరాయి. దీనిపై వస్తున్న ఆరోపణల్లో ఉన్న వాస్తలు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్‌ కమిషన్‌ వేసింది. ఆయన సుదీర్ంగా విచారణ చేశారు. ఇందులో కీలకంగా ఉన్న వారందర్నీ విచారించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, హరీష్‌రావును కూడా విచారించారు.

కమిషన్ అడిగిన ప్రశ్నలు, వాళ్లు ఇచ్చిన సమాచారంతో తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ మంత్రివర్గంలో తీవ్రంగా చర్చించారు. అనంతరం దీనిలో ఉన్న మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీబీఐకి సమాచారం చేరవేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసును టేకప్ చేసిన సీబీఐ దర్యాప్తుకు ఓకే చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి, పీసీ ఘోష్ కమిషన్ నుంచి వివరాలు సేకరిస్తోంది. 

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి అనేక వివాదాలు అలుముకున్నాయి. కోర్టుల చుట్టూ తిరిగాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అన్నింటినీ చెక్ పెట్టే ప్రయత్నాల్లో విచారణ దశకు వెళ్లింది. ఈ విచార దశకు వెళ్లే క్రమంలో కూడా కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలు అయ్యాయి. ఈ కాళేశ్వరంపై ప్రభుత్వం వేసిన ఏక సభ్య కమిషన్ పీసీ ఘోష్ కమిషన్‌కు చట్టబద్ధత లేదని కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు.దాన్ని కోర్టు కొట్టేసింది. తర్వాత కమిషన్ రిపోర్డు బహిర్గతం చేయొద్దని కూడా పిటిషన్ వేశారు. దీనిపై ప్రభుత్వానికి కోర్టు కొన్ని సూచనలు చేసింది. 

కోర్టు ఆదేశాల మేరకు ఇంత వరకు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏముందో బయటకు రాలేదు. అయినా ఇంతలో కేసుకు వెళ్లింది. ఇది ఎవరూ ఊహించలేదు. కానీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో కేసు మరో మలుపులు తిరిగింది. అయితే నివేదికలోని కొన్ని విషయాలపై ప్రభుత్వం లీకులు ఇచ్చింది. ఎక్కడా అధికారికంగా ఎలాంటి వివరాలు అందించకపోయినా నివేదికలో ఏముందో తెలిసింది. అసెంబ్లీలో కూాడా చర్చకు పెట్టింది. వాటి ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. దీని ఆధారంగానే ఈ కేసు విచారణ బాధ్యతను తీసుకున్న సీబీఐ రంగంలోకి దిగింది. తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
పోలీసులు వచ్చింది నిజమే ! పవన్ వ్యాఖ్యలపై స్పందించిన ప్రొఫెసర్ నాగేశ్వర్.. ABP దేశంతో ఏమన్నారంటే
Rains Alert: మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మరో 24 గంటలపాటు వర్షాలు.. ఎండల నుంచి ఉపశమనం- 10 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
DAY NRLM Scheme: డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల లోన్.. వడ్డీ రాయితీ కూడా!
డ్వాక్రా మహిళలకు బంపర్ ఆఫర్.. పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల లోన్.. వడ్డీ రాయితీ కూడా!
CM Revanth Reddy: గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రభుత్వం గుడ్‌న్యూస్.. జీతాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

వీడియోలు

Dharmendra Receives Padma Vibhushan Award | ధర్మేంద్రకు పద్మవిభూషణ్ అవార్డు
Student Jokes On MI Nita Ambani | నీతా అంబానీ ముందే ముంబై ఇండియన్స్‌పై పంచ్
RCB vs GT IPL Match 2026 Prediction | నేడు బెంగళూరుతో తలపడుతున్న గుజరాత్ టైటాన్స్
Hardik Pandya Decoding 07:07 Insta Post | ముంబైని వీడుతున్న హార్దిక్ పాండ్యా ?
RR vs MI Match Playoffs IPL 2026 | కెప్టెన్సీపై రియాన్ పరాగ్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Byjus Founder Byju Raveendran: బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు 6 నెలల జైలు, భారీ జరిమానా! రోడ్డున పడ్డ బిలియనీర్
Chandrababu Speech At Mahanadu: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక పార్టీ టీడీపీ, విజన్ పాలిటిక్స్‌కు నాంది: చంద్రబాబు
BRS Aggressive Politics: బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
బీఆర్ఎస్ యువనేతల దూకుడు.. ఆవేశంలో మునిగిపోతున్న ఆలోచన! లాభమా..నష్టమా?
Mahesh Babu: 'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
'వారణాసి' తర్వాత... పాన్ ఇండియా యాక్షన్ ఫిలిమ్స్ దర్శకుడితో మహేష్ సినిమా?
Mancherial Crime News: రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
రూ.2 కోట్ల ఇన్సురెన్స్ నగదు కోసం సుపారీ ఇచ్చి భర్త హత్య.. మంచిర్యాల జిల్లాలో దారుణం
Driving Without Insurance: ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనం నడిపితే ఏమవుతుంది? పెరుగుతున్న జరిమానాలు, ప్రమాదాలు
AIADMK MLAs resignation: ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
ఉపఎన్నికల కొరివితో గోక్కుంటున్న విజయ్ - తేడా వస్తే నిలబడటం కష్టమే ?
AP FDC Chairman: ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్ భరత్ భూషణ్‌కు ఛాంబర్ సత్కారం... చదలవాడ శ్రీనివాస రావుకు కూడా
Embed widget