అన్వేషించండి

CBI Enquiry On Kaleshwaram Project : కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై సీబీఐ సమాచార సేకరణ- విచారణ డ్యూటీ ఎక్కిన దర్యాప్తు సంస్థ  

CBI Enquiry On Kaleshwaram Project : కాళేేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై విచారణకు సీబీఐ రెడీ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ సేకరిస్తోంది.

CBI Enquiry On Kaleshwaram Project : తెలంగాణలో రాజకీయ వివాదాలకు కేంద్రంగా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు మరోసారి హాట్ డిబేట్‌గా మారబోతోంది. ప్రాజెక్టులో జరిగిన అక్రమాల నిగ్గు తేల్చేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. ఈ కేసులో ప్రాథమిక సమాచారాన్ని సేకరిస్తోంది. ఈ కేసులో కీలకంగా భావించే పీసీ ఘోష్ కమిషన్ నివేదికను, ఇతర వివరాలను తెప్పించుకుంటోంది. ఆలస్యమవుతుందని అనుకున్న విచారణ ఇప్పుడు వేగం పుంజుకునే అవకాశం ఉంది.  

కాళేశ్వరం ప్రాజెక్టు కేంద్రంగా చాలా రాజకీయాలు జరిగాయి. ఇందులో పిల్లర్లు కుంగిపోవడంతో ఆ రాజకీయాలు పీక్స్‌కు చేరాయి. దీనిపై వస్తున్న ఆరోపణల్లో ఉన్న వాస్తలు తేల్చేందుకు తెలంగాణ ప్రభుత్వం పీసీ ఘోష్‌ కమిషన్‌ వేసింది. ఆయన సుదీర్ంగా విచారణ చేశారు. ఇందులో కీలకంగా ఉన్న వారందర్నీ విచారించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో మంత్రులుగా ఉన్న ఈటల రాజేందర్, హరీష్‌రావును కూడా విచారించారు.

కమిషన్ అడిగిన ప్రశ్నలు, వాళ్లు ఇచ్చిన సమాచారంతో తుది నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ మంత్రివర్గంలో తీవ్రంగా చర్చించారు. అనంతరం దీనిలో ఉన్న మరిన్ని వాస్తవాలు వెలుగులోకి తీసుకొచ్చేందుకు విచారణ బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీబీఐకి సమాచారం చేరవేశారు. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు కేసును టేకప్ చేసిన సీబీఐ దర్యాప్తుకు ఓకే చెప్పింది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి, అధికారుల నుంచి, పీసీ ఘోష్ కమిషన్ నుంచి వివరాలు సేకరిస్తోంది. 

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నుంచి అనేక వివాదాలు అలుముకున్నాయి. కోర్టుల చుట్టూ తిరిగాయి. అయితే ప్రభుత్వం మారిన తర్వాత అన్నింటినీ చెక్ పెట్టే ప్రయత్నాల్లో విచారణ దశకు వెళ్లింది. ఈ విచార దశకు వెళ్లే క్రమంలో కూడా కోర్టుల్లో పిటిషన్‌లు దాఖలు అయ్యాయి. ఈ కాళేశ్వరంపై ప్రభుత్వం వేసిన ఏక సభ్య కమిషన్ పీసీ ఘోష్ కమిషన్‌కు చట్టబద్ధత లేదని కేసీఆర్‌ హైకోర్టులో పిటిషన్ వేశారు.దాన్ని కోర్టు కొట్టేసింది. తర్వాత కమిషన్ రిపోర్డు బహిర్గతం చేయొద్దని కూడా పిటిషన్ వేశారు. దీనిపై ప్రభుత్వానికి కోర్టు కొన్ని సూచనలు చేసింది. 

కోర్టు ఆదేశాల మేరకు ఇంత వరకు పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో ఏముందో బయటకు రాలేదు. అయినా ఇంతలో కేసుకు వెళ్లింది. ఇది ఎవరూ ఊహించలేదు. కానీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయంతో కేసు మరో మలుపులు తిరిగింది. అయితే నివేదికలోని కొన్ని విషయాలపై ప్రభుత్వం లీకులు ఇచ్చింది. ఎక్కడా అధికారికంగా ఎలాంటి వివరాలు అందించకపోయినా నివేదికలో ఏముందో తెలిసింది. అసెంబ్లీలో కూాడా చర్చకు పెట్టింది. వాటి ప్రకారం ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. దీని ఆధారంగానే ఈ కేసు విచారణ బాధ్యతను తీసుకున్న సీబీఐ రంగంలోకి దిగింది. తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయో అన్న ఆసక్తి తెలుగు రాష్ట్రాల్లో ఉంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Telangana Budget 2026-27: తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
తెలంగాణ బడ్జెట్‌ 2026-27లో మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! 
Telangana Indiramamma Kutumba Jeevita Beema Scheme : తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!
తెలంగాణలో ప్రజలకు ఆర్థిక భరోసా! జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభం! ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రక్షణ!
Telangana Budget 2026-27 Live Updates: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం... వారికి 2 వేల స్కాలర్షిప్
Chiranjeevi : ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి - ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్
ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి - ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్

వీడియోలు

Petrolium Ministry on LPG Shoratge | ఎల్పీజీ సిలిండర్ల కొరత లేదంటూనే కేంద్రం సూచనలు | ABP Desam
Negative Campaign on SRH | IPL 2026 కి ముందు సన్ రైజర్స్ పై ఫేక్ పోస్టులు | ABP Desam
CSK Video on Shivam Dube | IPL 2026 కి ముందు చెన్నైలో క్రికెట్ బాల్స్ ఆందోళన | ABP Desam
Virat Kohli Home Coming RCB | IPL 2026 యుద్ధానికి తిరిగొచ్చిన మహారాజు | ABP Desam
Ishan Kishan Interim Captain SRH | ఇషాన్ వైపే ఆరెంజ్ ఆర్మీ మొగ్గు చూపింది అందుకే | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Price Hike: షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
షాకిచ్చిన చమురు కంపెనీలు - పెరిగిన ప్రీమియం పెట్రోల్ ధరలు!
Iran War Updates: హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
హెర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత - ఇరాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా భారీ వ్యూహం!
Lakshmir Bhandar:మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
మహిళలకు ప్రతి నెల ఇచ్చే ఆర్థిక సాయం రూ. 500 పెంచిన మమత! 10 హామీలతో టీఎంసీ మేనిఫెస్టో విడుదల!
MNM Election Symbol: లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
లోకనాయకుడికి సింబల్ చిక్కులు! కాగడా వదిలి సూర్యుడి వెలుగులోకి రమ్మని పిలుస్తున్న స్టాలిన్!
Pradip Guruji: మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
మంచి పనులు చేయడానికి డబ్బుల్లేవని దొంగ నోట్లు ముద్రించాడట - ఈ గురూజీ మామూలోడు కాదు!
Electric Vehicles: ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
ఇరాన్ చమురు సంక్షోభంతో ఈవీల వెంట పరుగులు తీస్తున్న జనం! పెరిగిన BYD, విన్‌ఫాస్ట్ విక్రయాలు!
Vijayd Deverakonda Rashmika : చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
చిన్నారిపై విరోష్ కపుల్ ముద్దుల వర్షం - చిట్టి ఫ్యాన్‌కు లడ్డూలు, పులిహోర స్పెషల్... క్యూట్ వీడియో
Telangana new education system: తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కొత్త విద్యావిధానంలో టెన్త్ పరీక్షలు ఉండవు - మీడియా చిట్ చాట్‌లో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Embed widget