అన్వేషించండి

Sridhar Babu: త్వరలోనే హైదరాబాద్ బెంగళూరును దాటేయబోతోంది - శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు

Telangana News: సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో అతి త్వరలోనే బెంగళూరును అధిగమిస్తామని.. 25 శాతం వృద్ది సాధిస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సచివాలయంలో మీడియా ప్రతినిధులతో ఈ వ్యాఖ్యలు చేశారు.

Duddilla Sridhar Babu: సాఫ్ట్ వేర్ ఎగుమతుల్లో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అమెరికా పర్యటన సందర్భంగా తనను శనివారం (ఆగస్టు 4) నాడు సచివాలయంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. గత మార్చి31 వరకు ఐటీ ఎగుమతులు రూ. 2.7 లక్షల కోట్లు ఉండగా జూన్ చివరి నాటికి అది రూ.2.9 లక్షల కోట్లకు పెరిగిందని శ్రీధర్ బాబు వెల్లడించారు. 11.28 శాతం వృద్ధిని నమోదు చేసామని తెలిపారు. ప్రస్తుతం రూ.7 లక్షల కోట్ల సాఫ్ట్ వేర్ ఉత్పత్తుల ఎగుమతితో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని వివరించారు. వచ్చే మూడేళ్లలో తాము బెంగళూరును అధిగమించి ముందుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు చెప్పారు. 

రోడ్ మ్యాప్ రెడీ
వృద్ధి రేటును 11.28 శాతం నుంచి 25 శాతానికి తీసుకెళ్లే రోడ్ మ్యాప్ సిద్ధమైందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఆవిర్భావంతో దేశంలోనే కాక ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక పెద్ద ఏఐ హబ్ గా రూపొందుతుందని అన్నారు. కృత్రిమ మేథ వల్ల లక్షలాది మంది కోడింగ్ ఇంజనీర్లు ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదాన్ని గుర్తించే మొట్టమొదటిగా ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కోడింగ్ లో నైపుణ్యం ఉన్న 2 లక్షల మంది ఇంజనీర్లను ఏఐ లో నిపుణులుగా తయారు చేస్తామని వెల్లడించారు. కొత్తగా వేలాది మంది ఉపాధి పొందగలుగుతారని చెప్పారు. తాము ప్రారంభించబోయే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తెలంగాణా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను డిజిటిల్ క్లాసుల ద్వారా నూతన అవకాశాలను అందిపుచ్చుకునేలా తీర్చిదిద్దుతుందని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి దూరదృష్టి కలిగిన నాయకుడని ప్రస్తుత అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చేలా ఇండస్ట్రీ దిగ్గజాలతో ఆయన సంప్రదింపుల్లో ఉన్నారని వెల్లడించారు. కృత్రిమ మేథ రంగంలో యావత్తు ప్రపంచం తెలంగాణా వైపు చూసేలా తాము భవిష్యుత్తు ప్రణాళికలు రూపొందించినట్టు శ్రీధర్ బాబు చెప్పారు.

బ్యాంకింగ్, ఫైనాన్సియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) కన్సార్టియం హైదరాబాద్ లో మొదటి ఏడాది 2 వేల మందికి శిక్షణనిచ్చి ఉద్యోగాలకు రెడీ చేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు. ప్రస్తుతం ఫిన్ టెక్ రంగంలో 20 వేల ఉద్యోగ ఖాళీలు ఉన్నా నిపుణులైన మానవ వనరులు లేని పరిస్థితి నెలకొని ఉందని చెప్పారు. బికాం, బిబిఏ లాంటి కోర్సులు చదివిన విద్యార్థులను సెకండియర్, థర్డ్ ఇయర్ లో ఎంపిక చేసి శిక్షణ ద్వారా జాబ్ రెడీ చేస్తామని వివరించారు. దేశంలో ఈ దిశలో మనమే ముందు కార్యాచరణ ప్రారంభించినట్టు శ్రీధర్ బాబు చెప్పారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nandamuri Balakrishna on Padmabhushan | పద్మభూషణ్ పురస్కారంపై నందమూరి బాలకృష్ణ ఇంటర్వ్యూ | ABP DesamBobbili Battle Completes 268 Years | బొబ్బిలి యుద్ధం ఆనవాళ్లు నేటికీ పదిలం | ABP DesamGuntakal Railway Track Incident | రైల్వే ట్రాక్ చిక్కుపడిపోయిన ఆర్టీసీ బస్సు | ABP DesamJr NTR Kalyan Ram Tweet NBK Padma Bhushan | బాలకృష్ణకు పద్మభూషణ్ రావటంతో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సంతోషం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rythu Bharosa: అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
అర్ధరాత్రి దాటగానే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ - పేదలకు త్వరలోనే సన్నబియ్యం ఇస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి
At Home Event: తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
తెలుగు రాష్ట్రాల్లో ఆహ్లాదకరంగా 'ఎట్ హోం' - హాజరైన సీఎంలు, అధికారులు
Hyderabad News: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం - రెండు బోట్లు దగ్ధం, ప్రయాణికులు సేఫ్
Dharmavaram: ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
ధర్మవరంలో తీవ్ర ఉద్రిక్తత - టీడీపీ, వైసీపీ నేతల మధ్య వివాదం, వాహనాలు ధ్వంసం
Mahakumbh 2025 : మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
మహా కుంభమేళా స్పెషల్ మౌని అమావాస్య - 10 కోట్ల మంది వస్తారని అంచనా, ఏర్పాట్లు ఎలా ఉన్నాయంటే?
Kandula Durgesh: ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
ఇష్టం వచ్చినట్టు టికెట్ రేట్లు పెంచేది లేదు... కొత్త పాలసీ తీసుకొస్తున్నాం: ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్
Aus Open Champ Sinner: సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
సిన్నర్‌దే ఆస్ట్రేలియన్ ఓపెన్ - రెండో ఏడాది విజేతగా నిలిచిన ఇటాలియన్, జ్వెరెవ్‌కు మళ్లీ నిరాశ
Crime News: నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
నడిరోడ్డుపై మహిళను జుట్టు పట్టి ఈడ్చుకెళ్లారు - విశాఖలో దారుణం
Embed widget