అన్వేషించండి

IAS Srilakshmi: హైకోర్టులో ఐఏఎస్‌ ఆఫీసర్ శ్రీలక్ష్మికి చుక్కెదురు, ఇక రంగంలోకి దిగనున్న సీబీఐ

Obulapuram mining case | తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌ ఆఫీసర్ శ్రీలక్ష్మికి చుక్కెదురైంది. తనను నిర్దోషిగా ప్రకటించాలని దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.

IAS Srilakshmi petition in Obulapuram mining case | హైదరాబాద్‌: ఐఏఎస్‌ ఆఫీసర్ శ్రీలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో శుక్రవారం ఎదురుదెబ్బ తగిలింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో తనపై నమోదైనే కేసును కొట్టివేయాలంటూ ఆమె హైకోర్టులో రివిజన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తనను నిర్దోషిగా ప్రకటించాలని పిటిషన్‌లో శ్రీలక్ష్మీ కోరారు. ఐఏఎస్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. సీబీఐ, ప్రతివాదుల వాదనలను పరిగణనలోకి తీసుకుంది. తాజాగా ఆమె పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మైనింగ్ కేసులో ఇదివరకే కోర్టు ఆమెను నిందితురాలిగా తేల్చింది. తెలంగాణ కోర్టు తీర్పు రావడంతో ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మీ పాత్రపై సీబీఐ విచారణ చేపట్టనుంది. 

గతంలో సుప్రీంకోర్టు షాక్, ఇప్పుడు హైకోర్టులోను చుక్కెదురు

ఓబులాపురం కేసు నుంచి ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి  బయటపడ్డారని అంతా అనుకున్నారు. కానీ కేసులో శిక్షలు ఖరారైన మరుసటి రోజే సుప్రీంకోర్టు ఆమెకు షాకిచ్చింది. ఈ కేసు నుంచి శ్రీలక్ష్మిని హైకోర్టు గతంలోనే డిశ్చార్జ్ చేసింది. అయితే హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు  ఐఏఎస్ శ్రీలక్ష్మి పాత్రపై విచారణ చేయాలని ఆదేశించింది. త్వరలో విచారణ చేయాలని మే మొదటి వారంలోనే కోర్టు సీబీఐకి సూచించింది. 

శ్రీలక్ష్మీకి గతంలో హైకోర్టులో ఊరట

కర్ణాటకకు చెందిన బిజినెస్ మ్యాన్ గాలి జనార్ధన్ రెడ్డికి సంబంధించిన ఓబులాపురం మైనింగ్ కేసులో అప్పటి ప్రభుత్వంలో మైనింగ్ శాఖ ఉన్నతాధికారిగా ఐఏఎస్ శ్రీలక్ష్మి ఉన్నారు. అవకతవకలకు పాల్పడి గాలి జనార్ధన్ రెడ్డికి అర్హత లేకపోయినా లీజులు కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది. ఆమె పలు తప్పిదాలు చేసినట్లు సీబీఐ కేసులు నమోదు చేసి విచారణ జరిపింది.  గాలి జనార్ధన్ రెడ్డికి సహాయం చేసినందుకు ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందినట్లుగా అభియోగాలు ఉన్నాయి. ఈ కేసుతో తనకు సంబంధం లేదని మొదట సీబీఐ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేయగా, కోర్టు కొట్టి వేసింది. తరువాత హైకోర్టులో పిటిషన్ వేశారు. 2022లో హైకోర్టు ఆమెను కేసు నుంచి డిశ్చార్డ్ చేస్తూ తీర్పిచ్చింది.  

సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ
తాము చూపించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోకుడా హైకోర్టు శ్రీలక్ష్మీని కేసు నుంచి డిశ్చార్జ్ చేశారని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు మూడు నెలల్లోగా విచారణ చేయాలని సీబీఐకి సూచించింది. దాంతో శ్రీలక్ష్మీకి మళ్లీ కష్టాలు మొదలయ్యాయి.

ఓబుళాపురం మైనింగ్ కేసులో నిందితుడు గాలి జనార్ధన్ రెడ్డికి సీబీఐ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. గాలి జనార్ధన్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి, రాజగోపాల్, అలీఖాన్‌లతో పాటు ఓఎంసీ కంపెనీని సీబీఐ కోర్టు దోషులుగా తేల్చింది. ఇందులో ఏ1గా ఉన్న శ్రీనివాసరెడ్డి సహా నిందితులందరికీ 7 ఏళ్లు జైలుశిక్ష విధించారు. ఓఎంసీ కంపెనీకి లక్ష జరిమానా విధించారు.  ఏపీ (అనంతపురం), కర్ణాటక సరిహద్దుల్లో పర్మిషన్ కు మించి ఐరన్ ఓర్ తవ్వేసి.. రాష్ట్ర సరిహద్దులు సైతం చెరిపేశారని కేసులున్నాయి. 2009లో సీబీఐ రంగంలోకి దిగింది. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బళ్లారి నుంచి గాలి జనార్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. కొన్నేళ్ల జైల్లో ఉన్న తరువాత బెయిల్ మీద వ్యాపారవేత్త విడుదలయ్యారు.     

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
Embed widget