అన్వేషించండి

Telangana Death Toll: మృతుల సంఖ్యపై రేవంత్ రెడ్డి తప్పుడు లెక్కలు, 31 మంది మృతి చెందారన్న హరీష్ రావు

Telangana Rains | తెలంగాణలో కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 31 మంది చనిపోయారని, తమ వద్ద సమాచారం ఉందని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రభుత్వం చెప్పేవి తప్పుడు లెక్కలు అన్నారు.

31 People dies during heavy rains in State says Harish Rao | హైదరాబాద్: తెలంగాణలో రెండు, మూడు రోజులు కురిసిన భారీ వర్షాలకు ప్రాణ నష్టం సంభవించింది. తాజాగా కురిసిన వర్షాలు, వరద ప్రవాహం కారణంగా తెలంగాణ వ్యాప్తంగా 16 మంది చనిపోయారని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రకటించారు. సోమవారం ఉదయం సూర్యాపేటలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి జిల్లాలో వర్షాలు, వరద నష్టంపై సమీక్ష నిర్వహించారు. ఆపై ఖమ్మం జిల్లా (Khammam District)లో పర్యటించి, వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో వెళ్లి స్వయంగా పరిశీలించారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వర్షాల కారణంగా పదహారు మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. ఫాం హౌస్ లో కూర్చున్న ఒకరు, అమెరికాలో ఉన్న మరొకరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులను పరామర్శించడం, సాయం చేయడం లాంటివి చేయలేదని రేవంత్ బీఆర్ఎస్ నేతల్ని విమర్శించారు. 

మృతుల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వం తగ్గించి చూపిస్తుందా ?

సీఎం రేవంత్ కామెంట్లపై మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 16 మంది చనిపోయారు అని ప్రభుత్యం చెబుతోందని, అయితే 31 మంది చనిపోయారని తమకు సమాచారం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమని, సీఎం రేవంత్ రెడ్డి వరద బాధితులకు సహాయం చెయ్యకుండా బీఆర్ఎస్ నేతలపై బురుద వేస్తున్నారంటూ మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా తమపై విమర్శలు చెయ్యడమే రేవంత్ రెడ్డికి పనిగా పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు అండగా ఉంటే.. తెలంగాణ సీఎం రేవంత్ హైదరాబాద్ కే పరిమితమయ్యారని విమర్శించారు.

ఆ ముగ్గురు ఖమ్మం మంత్రులు ఫెయిల్
‘ఖమ్మం జిల్లాలో తొమ్మిది సీట్లు ఇస్తే, 9 మందిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడలేకపోయింది. ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులున్నా అంతా ఫెయిల్ అయ్యారు.. వాతావరణ శాఖ చెప్పినా కూడా ముందస్తు చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా మంత్రులు, కాంగ్రెస్ నేతలు బుద్ధి తెచ్చుకోవాలి. తమ తప్పులు సరిదిద్దుకుని, ఆపదలో ఉన్న వారిని కాపాడండి. కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చనిపోయిన వారికి రూ. 25 లక్షల చొప్పున అడిగారు. ఇప్పుడు మీ హయాంలో చనిపోయిన వ్యక్తులకు అలాగే 25 లక్షలు రూపాయలు ఇవ్వండి. సహాయం కోరిన వారిపై సైతం లాఠీఛార్జ్ చేశారు. ప్రజాపాలన అంటే ఇదేనా’ అని ప్రశ్నించారు హరీష్ రావు. ఈ మేరకు ఓ వీడియో సైతం విడుదల చేశారు.

Also Read: Revanth Reddy: వరద సమయంలో బురద రాజకీయాలు వద్దు, 3 రోజుల నుంచి నిద్రలేదు: రేవంత్ రెడ్డి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Arvind Kejriwal: 'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
New Vande Bharat Trains: దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
Vivo T3 Ultra: వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బిగ్‌బీ కేబీసీ షోలో పవన్‌ కల్యాణ్‌పై ప్రశ్న, ఖుష్ అవుతున్న ఫ్యాన్స్మోహన్ బాబు యూనివర్సిటీలో వివాదం, మంచు మనోజ్ సెన్సేషనల్ ట్వీట్Telangana High court on Hydra | తెలంగాణలో హాట్ టాపిక్ 'హైడ్రా' పై హైకోర్టు దృష్టి | ABP DesamSarpanch Unanimous Election | సర్పంచ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామస్థులు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Arvind Kejriwal: 'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
'రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా చేస్తా' - అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన
YS Sharmila: కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
కూటమి సర్కారుకు సిగ్గుచేటు, చంద్రబాబు నోరు విప్పాల్సిందే - షర్మిల డిమాండ్
New Vande Bharat Trains: దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
దేశంలో 7 కొత్త వందేభారత్‌లు, జెండా ఊపి ప్రారంభించిన మోదీ
Vivo T3 Ultra: వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
వివో టీ3 అల్ట్రా వచ్చేసింది - రూ.30 వేలలో బెస్ట్ ఫోన్!
Renu Desai: దేవుడు లేడు అత్యాశే ఉంది- వినాయక చవితి సెలెబ్రేషన్స్‌పై రేణూ దేశాయ్ ఆగ్రహం
దేవుడు లేడు అత్యాశే ఉంది- వినాయక చవితి సెలెబ్రేషన్స్‌పై రేణూ దేశాయ్ ఆగ్రహం
Vijayawada floods: వరదలు నేర్పిన గుణపాఠం - పునరావృతం కాకుండా సన్నద్ధత ఎలా!, నిపుణులు ఏం చెబుతున్నారంటే?
వరదలు నేర్పిన గుణపాఠం - పునరావృతం కాకుండా సన్నద్ధత ఎలా!, నిపుణులు ఏం చెబుతున్నారంటే?
Crime News: తెలంగాణలో దారుణాలు - ఆస్తి కోసం బావమరిది హత్య, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్
తెలంగాణలో దారుణాలు - ఆస్తి కోసం బావమరిది హత్య, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్లాన్
YSRCP : వైఎస్ఆర్‌సీపీకి నాయకుల సమస్య - పార్టీ బాధ్యతలకునో ! తప్పెక్కడ జరిగింది ?
వైఎస్ఆర్‌సీపీకి నాయకుల సమస్య - పార్టీ బాధ్యతలకునో ! తప్పెక్కడ జరిగింది ?
Embed widget