అన్వేషించండి

Rythu Bandhu Scheme: కరోనా సమయంలోనూ రైతుబంధు ఆపలేదు, వందశాతం ధాన్యం కొన్నాం: మంత్రి నిరంజన్‌ రెడ్డి

Rythu Bandhu Scheme: రాష్ట్రంలో సంక్షేమ పథకాలను వియవంతంగా అమలు చేస్తున్నామని, కరోనా సమయంలో కూడా రైతు బంధు నిధుల పంపకం ఆపలేదని మంత్రి నిరంజన్‌ రెడ్డి చెప్పారు.

Rythu Bandhu Scheme: దేశానికి అన్నం పెట్టే రైతులు ఇబ్బంది పడకూడదని, వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని తెలంగాణ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను వియవంతంగా అమలు చేస్తున్నామని, కరోనా సమయంలో కూడా రైతు బంధు నిధుల పంపకం ఆపలేదని మంత్రి చెప్పారు. దేశంలో రైతుల నుంచి వంద శాతం ధాన్యం కొనుగోలు చేసిన ఘనత తెలంగాణ సీఎం కేసీఆర్‌దేనని అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా విపక్ష నేతలు పెట్టుకున్నారని నిరంజన్ రెడ్డి విమర్శించారు.

కొనసాగుతున్న రైతు బంధు నిధుల విడుదల 
డిసెంబర్ 28న తెలంగాణలో రైతుబంధు నిధుల విడుదల ప్రకియ మొదలైంది. అందరూ రైతులకు నిధులు చేరే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రతి ఏడాది తరహాలోనే రైతులకు ఖరీఫ్, రబీ పంట సీజన్లలో పెట్టుబడి సాయం కింద రూ.5 వేల చొప్పున ప్రతి ఏడాది వారికి పది వేల రూపాయాలు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. తాజాగా పదవ విడత రైతు బంధు సాయం ప్రక్రియ కొనసాగుతోంది. 8 లక్షల 53 వేల 409.25 ఎకరాలకు రూ.426.69 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. వీటిని 1,87,847 మంది రైతుల ఖాతాలో నిధులను జమ చేస్తున్నామని చెప్పారు. రైతు బంధు పథకం కింద ఈ దఫాలో ఇప్పటివరకు 56,58,484 మంది రైతుల ఖాతాల్లో రూ.475.64 కోట్లు జమ చేసినట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.

పంట పెట్టుబడికి రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు సీజన్లలో ఎకరాకు రూ.5000 చొప్పున పంట సాయం అందిస్తోంది. ప్రస్తుతం యాసంగి పంట కాలానికిగానూ 7,600 కోట్ల రూపాయలను, రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నది. ప్రతి ఏడాది, ఖరీఫ్ సీజన్ తరహాలోనే మొదట ఒక ఎకరం రైతులకు రైతు బంధు నిధులు జమ చేస్తారు. ఆపై అధిక ఎకరాలు ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం పంట పెట్టుబడి కోసం రైతు బంధు సాయాన్ని అందిస్తోంది. ధరణి పోర్టల్ నమోదు చేసుకున్న పట్టాదారులు, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులు అర్హులని తెలిపారు.  మొదటిసారి పెట్టుబడి సాయం తీసుకోబోయే రైతులు క్షేత్రస్థాయిలో సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం సూచించింది. 

ప్రపంచ వ్యాప్తంగా రైతుబంధు ఇచ్చే రాష్ట్రం మరొకటి లేదు. రైతు బీమా ఇచ్చే దేశం లేదని, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్ ఇటీవల అన్నారు. తెలంగాణ రైతుల బతుకులు ఓదరికి రావాలని, అప్పులు తీరాలని.. అనాలోచితంగా తీసుకువచ్చిన పథకం రైతు బంధు కాదన్నారు. భారతదేశంలో ప్రభుత్వం కూడా ధాన్యం మొత్తం కొనుగోలు చేయదని, ఎక్కడా లేని విధంగా 7 వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండించిన పంటను ఎక్కడ అమ్ముకోవాలనే సమస్య లేకుండా విక్రయించిన పంటకు వారం రోజుల్లోనే బ్యాంకులో డబ్బులు జమ చేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan Health News: పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!
Pawan Kalyan Health News: పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!
CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
Vivo Y200i: 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Madhavi Latha vs Asaduddin Owaisi | బీఫ్ జిందాబాద్ అన్న ఓవైసీ... కౌంటర్ వేసిన మాధవిలత | ABP DesamIVF Cows at Tirumala | TTD | ఆవుల్లో అద్దె గర్భాలు.. ఎలాగో ఈ వీడియోలో తెలుసుకోండి | ABPBJP Madhavi Latha | ప్రచారంలో మాధవిలతకు ఝలక్.. వైరల్ వీడియో | ABP DesamGems Sikakulam Mdical College Studnets on AP Elections | 2024 ఎన్నికలపై స్టూడెంట్స్ మనోగతం | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan Health News: పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!
Pawan Kalyan Health News: పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారంటే!
CM Revanth Reddy :  ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌తో  పోల్చుకుని
ఎన్టీఆర్ డైలాగ్‌తో కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి వార్నింగ్ - హైటెన్షన్ కరెంట్ వైర్‌ తో పోల్చుకుని ...
Rana Naidu 2: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
Vivo Y200i: 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వివో వై200ఐ - ధర ఎంత ఉందంటే?
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
Pawan Kalyan: పిఠాపురంలో నేను గెలిస్తే వర్మ గెలిచినట్లే, కూటమి విజయమే ఉమ్మడి లక్ష్యం: పవన్ కళ్యాణ్
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
TSPSC: 'గ్రూప్‌-2' అభ్యర్థులకు అలర్ట్, రివైజ్డ్‌ ఖాళీల వివరాలు వెల్లడి
ITR 2024: ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాల్సిన విషయాలివి
ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాల్సిన విషయాలివి
Telangana Candidates Assets: ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
ఇల్లు లేని బండి, కేసుల్లేని కిషన్ రెడ్డి- తెలంగాణలో లోక్‌సభ అభ్యర్థుల ఆస్తులు-అప్పుల వివరాలు ఇవే
Embed widget