News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

T Congress: కాంగ్రెస్ సీనియర్ల భేటీ కలకలం, అధిష్ఠానం మాట వినని నేతలు - ఇది సీరియస్, డ్రామాలు నడవవు: జగ్గారెడ్డి

Jaggareddy మాట్లాడుతూ.. VH పిలిచినందున ఆ భేటీకి తాను వెళ్తున్నట్లు వివరించారు. రెండ్రోజుల క్రితమే తనను పిలిచినట్లు చెప్పారు. అన్ని విషయాలు మాట్లాడుకొని ఢిల్లీకి వెళ్తామని వివరించారు.

FOLLOW US: 
Share:

Telangana Congress News: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు హైదరాబాద్‌లోని అశోకా హోటల్‌లో (Ashoka Hotel) సమావేశం అయ్యారు. అయితే, ఈ సమావేశంపై హైకమాండ్ సీరియస్ అయింది. సమావేశం రద్దు చేసుకోవాలని ఆదేశించారు. అయితే, హైకమాండ్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సీనియర్ లీడర్లు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్ (V Hanmath Rao) మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను (Telangana Congress) బతికించుకొనేందుకే ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లుగా వీహెచ్ వెల్లడించారు. బెదిరింపులు చేస్తే తాను భయపడబోనని అన్నారు. మీటింగ్ రద్దు చేసుకోవాలని అందరూ కోరుతున్నారని, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్ (Manickam Tagore) తనతో మాట్లాడితే మీటింగ్ రద్దు చేస్తానని, లేదా సోనియా (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi) అపాయింట్ మెంట్ ఇప్పించాలంటూ వ్యాఖ్యానించారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Jaggareddy) మాట్లాడుతూ.. వీహెచ్ పిలిచినందున ఆ భేటీకి తాను వెళ్తున్నట్లు జగ్గారెడ్డి వివరించారు. రెండ్రోజుల క్రితమే తనను పిలిచినట్లు చెప్పారు. అన్ని విషయాలు మాట్లాడుకొని ఢిల్లీకి వెళ్దామని వివరించారు. ‘‘మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నా బయటికేమీ చెప్పొద్దని నిర్ణయించుకున్నాం. మీడియాతో ఏ అంతర్గత విషయాలు చెప్పొద్దని అనుకున్నాం. పార్టీలో సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించుకొనేందుకు సరైన పద్ధతి పాటించడం లేదు. ఆ విషయంపైనే సీనియర్లు చర్చలు జరుపుతున్నారు.’’

" ఫాల్తు గాళ్లు ఫోన్లు చేసి బెదిరిస్తే మేం భయపడం. బోస్ రాజు గారు ఫోన్ చేశారని తెలిసింది. ఈ మీటింగ్ గురించి ఏ నిర్ణయమైనా వీహెచ్ తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో వీహెచ్ కే కాకుండా, సీనియర్లు ఎవరికి మర్యాద లభించడం లేదు. వర్కింగ్ కమిటీ, పీఏసీ కమిటీ, జూమ్ యాప్‌ తదితరాలు అన్ని నామమాత్రానికే ఉన్నాయి. ఆల్రెడీ రేవంత్ రెడ్డి, ఠాకూర్ నిర్ణయాలు తీసుకొని మహేశ్ గౌడ్‌కు సమాచారం ఇస్తున్నారు. మహేశ్ గౌడ్ మాకు మెసేజ్‌లు పెడుతున్నారు. గతంలో పీఏసీ కమిటీ అంటే చాలా విలువైనదిగా ఉండేది. రేవంత్ రెడ్డి పీసీసీ కాకముందు వరకూ కూడా వర్కింగ్ కమిటీ కూడా చాలా వ్యాల్యూ ఉండేది. ఇప్పుడు అవేమీ లేవు. ఇప్పుడు ఠాకూర్, రేవంత్, మహేశ్ గౌడ్ ఇంతే నడుస్తున్నది. "
-జగ్గారెడ్డి

‘‘జగ్గారెడ్డి ఎవ్వరు రమ్మన్నా పోలేడు. ఇది జగమెరిగిన సత్యం. 2018 తర్వాత కూడా గవర్నమెంట్ నాపై ఎంత ఒత్తిడి చేసినా కాంగ్రెస్ నుంచి పోలే. అలాంటి నాపై, 2017లో భారీ బహిరంగ సభ సంగారెడ్డిలో చేసిన నాపైనే ఠాకూర్, రేవంత్ కలిసి మహేశ్ గౌడ్ ద్వారా కేసీ వేణుగోపాల్‌కు తప్పుడు ప్రచారంతో లేఖ రాశారు. నేను టీఆర్ఎస్‌ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నానని కుట్ర చేశారు. ఇదంతా పార్టీ పెంచడానికా, పార్టీని ముంచడానికా? ఢిల్లీలో సోనియా, రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ దొరికితే వారిని కలుస్తా. కేసీ వేణుగోపాల్‌ను కూడా కలుస్తా. ఉన్న విషయాలు చెప్పి, మా సిన్సియారిటీ మీద బురద జల్లితే ఊరుకోం. ఈ డ్రామాలు నడవవు.’’ అని జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేశారు.

Published at : 20 Mar 2022 11:48 AM (IST) Tags: telangana congress news Telangana Congress Jaggareddy TPCC CHiEF Congress leaders at Ashoka hotel Jaggareddy on Revanth Reddy

ఇవి కూడా చూడండి

JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

JNV: నవోదయ విద్యాలయాల్లో 11వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ

TSRTC Dasara Offer: దసరాకు ఇంటికెళ్లే వాళ్లకు ఆర్టీసీ స్పెషల్ ఆఫర్ - 10 శాతం రాయితీ

JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

JNV: నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్‌ ఎంట్రీ ప్రవేశాలు, ఎంపిక ఇలా!

Breaking News Live Telugu Updates: పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్

Breaking News Live Telugu Updates: పుంగనూరు, అంగళ్లు కేసుల్లో టీడీపీ నేతలకు బెయిల్

Telangana News: వర్షాకాలంలోనూ వేసవి స్థాయిలో కరెంటు వినియోగం, ఎక్చేంజీల్లో విద్యుత్ కొంటున్న డిస్కంలు

Telangana News: వర్షాకాలంలోనూ వేసవి స్థాయిలో కరెంటు వినియోగం, ఎక్చేంజీల్లో విద్యుత్ కొంటున్న డిస్కంలు

టాప్ స్టోరీస్

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్

వచ్చే ఏడాది జనవరిలో పాకిస్థాన్‌లో ఎన్నికలు, ప్రకటించిన ఎలక్షన్ కమిషన్

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో టైఫాయిడ్‌తో రిమాండ్‌ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం

రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో టైఫాయిడ్‌తో రిమాండ్‌ ఖైదీ మృతి- చంద్రబాబు భద్రతపై లోకేష్ అనుమానం

Kalki 2898 AD Movie: షేర్ చేస్తే చర్యలే, లీకు వీరులకు వైజయంతి మూవీస్ సీరియస్ వార్నింగ్

Kalki 2898 AD Movie: షేర్ చేస్తే చర్యలే, లీకు వీరులకు వైజయంతి మూవీస్ సీరియస్ వార్నింగ్

Ayyanna : జనసేనతో పొత్తు కోసం త్యాగానికి రెడీ - పోలీసుల తీరుపై అయ్యన్న కీలక వ్యాఖ్యలు !

Ayyanna :  జనసేనతో పొత్తు కోసం త్యాగానికి రెడీ - పోలీసుల తీరుపై అయ్యన్న కీలక వ్యాఖ్యలు !