అన్వేషించండి

Revanth Reddy: చంద్రబాబు, వైఎస్సార్ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారు: రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Telangana News | హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరిగిందని, బీజేపీ నేతలు కలిసొస్తే హైదరాబాద్, తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Telangana CM Revanth Reddy | హైదరాబాద్: హైదరాబాద్ నగరం అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చారిత్రక కట్టడాలతో హైదరాబాద్ అద్భుత నగరంగా విలసిల్లిందన్నారు. హైదరాబాద్ ను రాబోయే వందేళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని హైడ్రాను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. భిన్నాభిప్రాయాలున్నప్పటికీ చంద్రబాబు, వైఎస్సార్ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. అందుకే ఈ ఆక్రమణలను నియంత్రించే బాధ్యత హైడ్రా తీసుకుంటుంది. గతంలో గంటకు 2 సెం.మీ వర్ష పడటాన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో డ్రైనేజ్ వ్యవస్థ రూపొందించారు. అయితే వాతావరణ మార్పులతో కుంభవృష్టి వరదలు వస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షాల సమయంలోనూ సమస్యల శాశ్వత పరిష్కారానికి హైడ్రాను ఏర్పాటు చేస్తున్నాం. 

హైదరాబాద్‌కు జలాలు తెచ్చింది కాంగ్రెస్ 
హైదరాబాద్ లో నాళాలు ఆక్రమణ చేయాలంటేనే గుండెల్లో గుబులు పుట్టే వ్యవస్థను తీసుకువస్తాం. నగర ప్రజల ఇబ్బందులు తొలగించాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. హైదరాబాద్ సిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం 1965లో మంజీరా జలాలు, 1982 సింగూరు జలాలు, 2004లో కృష్ణా ఫేజ్-1, అదే విధంగా 2008 కృష్ణా ఫేజ్-2 ద్వారా తాగునీరు అందించింది. కృష్ణా ఫెజ్-3 90శాతం పనులు 2014లో కాంగ్రెస్ పూర్తి చేసింది. కానీ 2015లో తామే తెచ్చినట్లు టీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధిని తామే చేసినట్లు ప్రచారం చేసుకున్నారు.

హైదరాబాద్ నగరాన్ని మంచి ప్రణాళికతో అభివృద్ధి చేయబోతున్నాం. ఎక్కువ వర్షం పడినపుడు రోడ్లపై నీళ్లు నిలవకుండా డిజైన్ చేయాలని అధికారులకు సూచించాం. 141 ప్రాంతాలను గుర్తించి డిజాస్టర్ మేనేజ్ మెంట్ (Disaster Management) సిబ్బందిని అప్రమత్తం చేసేలా చర్యలు చేపట్టాం. బీఆరెస్ నేతలు హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయంటూ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీఆర్ఎస్ హయాంలో సంతోష్ నగర్ సింగరేణి కాలనీలో గంజాయి మత్తులో బాలికను రేప్ చేస్తే  కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించిన పాపాన పోలేదు. దిశ ఘటనలో ఆ కుటుంబాన్ని సైతం పరామర్శించ లేదు. మొయినాబాద్ దగ్గర టీఆరెస్ నాయకుడు రేప్, మర్డర్ చేస్తే చర్యలు తీసుకోలేదు’ అని రేవంత్ రెడ్డి ప్రసంగించారు. మిరాలం చెరువుపై 2.6కి.మీ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మిస్తాం, లండన్ ఐ లాంటి టవర్ ను మిరాలం చెరువులో నిర్మిస్తామని రేవంత్ అన్నారు.

బీజేపీ కలిసి వస్తే అభివృద్ధి..
‘హైదరాబాద్ నగర అభివృద్ధికి అందరి సలహాలు తీసుకోవాలని భావిస్తున్నాం. బీజేపీ ఎమ్మెల్యేలు మాతో కలిసి రండి. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులు, నిధులను ఉమ్మడిగా అడిగి తెచ్చుకుందాం. తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని కలిసి అభివృద్ధి చేసుకుందాం. గత ప్రభుత్వం తమ కోసమే ప్రగతి భవన్, ఆఫీసు కోసం సచివాలయం నిర్మించింది కానీ ప్రజల కోసం కాదు. అభివృద్ధి కోసం కలసి పనిచేద్దామని చెప్పినా, తన పాత్ర మిత్రుడికి కోపం వస్తుందని కిషన్ రెడ్డి ముందుకు రాలేదు’ అన్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !

వీడియోలు

Medaram Jathara History Full Story | సమ్మక్క సారలమ్మ జాతరకు..బయ్యక్కపేటకు సంబంధం ఏంటి.? | ABP Desam
Mohammad Shami | ఎస్ఐఆర్ విచారణకు హాజరు కావాలని షమీకి నోటీసులిచ్చిన ఈసీ | ABP Desam
Vaibhav Suryavanshi Record | సౌతాఫ్రికా U19పై రికార్డ్ హాఫ్ సెంచరీ బాదిన వైభవ్ సూర్యవంశీ | ABP Desam
IPL 2026 Ban | ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం విధించిన బంగ్లా ప్రభుత్వం | ABP Desam
BCCI vs BCB | భారత్‌తో గొడవ పెట్టుకోవడం బంగ్లా క్రికెట్‌ని నాశనం చేయబోతోందా? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hilt Policy : హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో డిప్యూటీ సీఎం కీలక ప్రకటన! కుంభకోణమంటూ విషం కక్కడం మానాలని సూచన
YSRCP Leader Roja: నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
నీళ్లు లేని బావిలో దూకండి- ఏపీ పోలీసులపై రోజా సంచలన కామెంట్స్
Sahiti Infra Scam: సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
సాహితి ఇన్‌ఫ్రా నిలువు దోపిడీ; రూ.800 కోట్ల కుంభకోణంపై ఈడీ అదనపు ఛార్జ్‌షీట్‌, విదేశాలకు నిధులు మళ్లించినట్టు అభియోగం!
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Crude Oil Prices: ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
ముడి చమురు ధరలలో భారీ తగ్గుదల! 2026లో చమురు చౌకగా మారుతుందా? నిపుణులు ఏమంటున్నారు
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Gachibowli Housing Board: 12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
12 ఏళ్ల తరువాత నెరవేరిన గచ్చిబౌలి హౌసింగ్ బోర్టు వాసుల సొంతింటి కల; లాటరీ విధానం ద్వారా ఫ్లాట్ల కేటాయింపు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Embed widget