అన్వేషించండి

Telangana Assembly Monsoon Sessions 2025: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై తుపాను: కేసీఆర్, హరీష్ రావులపై చర్యలుంటాయా? బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ!

Telangana Assembly Monsoon Sessions 2025: అధికార పార్టీకి, బీఆర్ఎస్ కు మధ్య కాళేశ్వరం విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana Assembly Monsoon Sessions 2025:  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి(30/08/2025) నుంచి  ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు నాలుగైదు రోజులు జరుగుతాయని చర్చ జరుగుతున్నప్పటికీ, ఎన్ని రోజులు సమావేశాలు జరపాలి అనే అంశంపై బీఏసీ సమావేశం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ పై పీసీ ఘోష్ కమిటీ సమర్పించిన నివేదికపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది.

కాళేశ్వరం నివేదిక ప్రధాన ఎజెండా

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ లోపాలు, అవినీతి అంశాలపై రేవంత్ ప్రభుత్వం పీసీ చంద్ర ఘోష్ కమిటీని నియమించడం, ఆ నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆ నివేదిక తప్పుల తడక అని, దాని ఆధారంగా చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, అసెంబ్లీలో చర్చించకుండా ఏ చర్య తీసుకోబోమని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇవ్వడంతో హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పరిణామం తర్వాత వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం చర్చకు దారి తీసింది.

అసెంబ్లీ సమావేశాల్లో పీసీ ఘోష్ నివేదికను సభలో ప్రవేశపెట్టి చర్చించే అవకాశాలున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా ముఖ్య నాయకులు ఫాంహౌస్‌లో సమావేశమై ఇదే అంశాన్ని చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే ఈ సమావేశాల్లో అధికార పార్టీకి, బీఆర్ఎస్ కు మధ్య కాళేశ్వరం విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశాలు ముగిశాక, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సహా, ఈ ప్రాజెక్టు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీశ్ రావు, ఇతర నాయకులు, అధికారులపై చర్యలు ఉంటాయా అనే చర్చ కూడా సాగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ

ఈ శాసన సభ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం గడువు విధించడంతో ఈ అంశం కూడా శాసన సభలో ప్రధాన ఎజెండా కానుంది. ఈ ఎన్నికలు నిర్వహించాలంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి గవర్నర్ ఆమోదానికి పంపగా, పరిశీలన నిమిత్తం గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపారు. ఇప్పటి వరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీనిని ఎన్డీఏ ప్రభుత్వం అడ్డుకుంటుందనే ఆరోపణలను ప్రభుత్వ పెద్దలు పలు వేదికలపై చేసిన పరిస్థితి ఉంది. అయితే, జీవో ద్వారా అమలు చేద్దామా అనే చర్చ కూడా శాసన సభలో జరిగే అవకాశం ఉంది. జీవో ఇస్తే అది న్యాయస్థానాల ముందు నిలబడదన్న విషయం అన్ని పార్టీలకు తెలిసిందే. అయితే, దీనిపై సభలో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలను అధికార పార్టీ తెలుసుకోనుంది.

శాసన సభ సమావేశాలకు ముందు రాష్ట్ర క్యాబినెట్ భేటీ

ఈ శాసన సభ ప్రారంభానికి ముందే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సభ నిర్వహణ, ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి ప్రధాన అంశాలన్నీ ఈ క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించనున్నారు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?

వీడియోలు

నేడు భారత్, సౌతాఫ్రికా మధ్య రెండో టీ20.. బ్యాటింగే డౌటు!
రోహిత్ ఒక్కటే చెప్పాడు.. నా సెంచరీ సీక్రెట్ అదే!
ఆళ్లు మగాళ్లురా బుజ్జె! రోకోకి ప్రశంసలు.. గంభీర్‌కి చురకలు!
అప్పుడు కోహ్లీ.. ఇప్పుడు రోహిత్.. 2025లో 2019 రిపీట్
North Pole vs South Pole | ధృవాల గురించి ఈ విషయాలు తెలుసుకుంటే షాక్ అయిపోతారు | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi: తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ క్లాస్ - పని చేయడం లేదని అసంతృప్తి - టార్గెట్లు ఇచ్చి పంపారుగా!
Fake liquor case: తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలు
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత జయచంద్రారెడ్డి అరెస్ట్ -ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కీలక మలుపు
YSRCP Leader Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
జంట హత్య కేసులో కోర్టులో లొంగిపోయిన వైసీపీ నేతలు పిన్నెల్లి సోదరులు
Mohan Lal : దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
దిలీప్ మూవీలో మలయాళ స్టార్ మోహన్ లాల్ - నెట్టింట తీవ్ర విమర్శలు... అసలు రీజన్ ఏంటంటే?
Telangana Panchayat Elections 2025:తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
తెలంగాణలో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ గ్రామ పంచాయతీ పోలింగ్‌- లెక్కింపు ప్రారంభం
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
హైదరాబాద్‌లోని యువకుడి హత్య కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన విషయాలు వెల్లడించిన యువతి తల్లి!
Tirupati Outer Ring Road: తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
తిరుపతి వాసులకు గుడ్ న్యూస్- ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టే ప్రతిపాదనపై సర్వే ప్రారంభం
Pragathi : సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
సరదాగా అనుకున్నా... డెడికేషన్‌తో ఇంటర్నేషనల్ మెడల్స్ సాధించారు - నటి ప్రగతిపై నాగబాబు ప్రశంసలు
Embed widget