అన్వేషించండి

Telangana Assembly Monsoon Sessions 2025: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై తుపాను: కేసీఆర్, హరీష్ రావులపై చర్యలుంటాయా? బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ!

Telangana Assembly Monsoon Sessions 2025: అధికార పార్టీకి, బీఆర్ఎస్ కు మధ్య కాళేశ్వరం విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana Assembly Monsoon Sessions 2025:  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి(30/08/2025) నుంచి  ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు నాలుగైదు రోజులు జరుగుతాయని చర్చ జరుగుతున్నప్పటికీ, ఎన్ని రోజులు సమావేశాలు జరపాలి అనే అంశంపై బీఏసీ సమావేశం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ పై పీసీ ఘోష్ కమిటీ సమర్పించిన నివేదికపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది.

కాళేశ్వరం నివేదిక ప్రధాన ఎజెండా

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ లోపాలు, అవినీతి అంశాలపై రేవంత్ ప్రభుత్వం పీసీ చంద్ర ఘోష్ కమిటీని నియమించడం, ఆ నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆ నివేదిక తప్పుల తడక అని, దాని ఆధారంగా చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, అసెంబ్లీలో చర్చించకుండా ఏ చర్య తీసుకోబోమని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇవ్వడంతో హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పరిణామం తర్వాత వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం చర్చకు దారి తీసింది.

అసెంబ్లీ సమావేశాల్లో పీసీ ఘోష్ నివేదికను సభలో ప్రవేశపెట్టి చర్చించే అవకాశాలున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా ముఖ్య నాయకులు ఫాంహౌస్‌లో సమావేశమై ఇదే అంశాన్ని చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే ఈ సమావేశాల్లో అధికార పార్టీకి, బీఆర్ఎస్ కు మధ్య కాళేశ్వరం విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశాలు ముగిశాక, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సహా, ఈ ప్రాజెక్టు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీశ్ రావు, ఇతర నాయకులు, అధికారులపై చర్యలు ఉంటాయా అనే చర్చ కూడా సాగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ

ఈ శాసన సభ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం గడువు విధించడంతో ఈ అంశం కూడా శాసన సభలో ప్రధాన ఎజెండా కానుంది. ఈ ఎన్నికలు నిర్వహించాలంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి గవర్నర్ ఆమోదానికి పంపగా, పరిశీలన నిమిత్తం గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపారు. ఇప్పటి వరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీనిని ఎన్డీఏ ప్రభుత్వం అడ్డుకుంటుందనే ఆరోపణలను ప్రభుత్వ పెద్దలు పలు వేదికలపై చేసిన పరిస్థితి ఉంది. అయితే, జీవో ద్వారా అమలు చేద్దామా అనే చర్చ కూడా శాసన సభలో జరిగే అవకాశం ఉంది. జీవో ఇస్తే అది న్యాయస్థానాల ముందు నిలబడదన్న విషయం అన్ని పార్టీలకు తెలిసిందే. అయితే, దీనిపై సభలో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలను అధికార పార్టీ తెలుసుకోనుంది.

శాసన సభ సమావేశాలకు ముందు రాష్ట్ర క్యాబినెట్ భేటీ

ఈ శాసన సభ ప్రారంభానికి ముందే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సభ నిర్వహణ, ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి ప్రధాన అంశాలన్నీ ఈ క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించనున్నారు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Hyderabad Road Accident: నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
నిన్న రాజమండ్రిలో వైద్య విద్యార్థి! నేడు హైదరాబాద్‌లో రిటైర్డ్ జవాన్‌! ప్రాణాలు తీస్తున్న మద్యం మత్తు!
Priyanka Death Case:రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
రాజమండ్రి మెడికో విద్యార్థి ప్రియాంక మృతిపై దర్యాప్తు వేగవంతం! రాజకీయం చేయొద్దని తండ్రి విజ్ఞప్తి!
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget