అన్వేషించండి

Telangana Assembly Monsoon Sessions 2025: తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరంపై తుపాను: కేసీఆర్, హరీష్ రావులపై చర్యలుంటాయా? బీసీ రిజర్వేషన్లపై కీలక చర్చ!

Telangana Assembly Monsoon Sessions 2025: అధికార పార్టీకి, బీఆర్ఎస్ కు మధ్య కాళేశ్వరం విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Telangana Assembly Monsoon Sessions 2025:  తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఇవాల్టి(30/08/2025) నుంచి  ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు నాలుగైదు రోజులు జరుగుతాయని చర్చ జరుగుతున్నప్పటికీ, ఎన్ని రోజులు సమావేశాలు జరపాలి అనే అంశంపై బీఏసీ సమావేశం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ పై పీసీ ఘోష్ కమిటీ సమర్పించిన నివేదికపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేసే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది.

కాళేశ్వరం నివేదిక ప్రధాన ఎజెండా

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ, నిర్వహణ లోపాలు, అవినీతి అంశాలపై రేవంత్ ప్రభుత్వం పీసీ చంద్ర ఘోష్ కమిటీని నియమించడం, ఆ నివేదికను ఇటీవలే ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. దీనిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఆ నివేదిక తప్పుల తడక అని, దాని ఆధారంగా చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే, అసెంబ్లీలో చర్చించకుండా ఏ చర్య తీసుకోబోమని ప్రభుత్వం కోర్టుకు హామీ ఇవ్వడంతో హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ పరిణామం తర్వాత వెంటనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం చర్చకు దారి తీసింది.

అసెంబ్లీ సమావేశాల్లో పీసీ ఘోష్ నివేదికను సభలో ప్రవేశపెట్టి చర్చించే అవకాశాలున్నట్లు అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు సహా ముఖ్య నాయకులు ఫాంహౌస్‌లో సమావేశమై ఇదే అంశాన్ని చర్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ చూస్తే ఈ సమావేశాల్లో అధికార పార్టీకి, బీఆర్ఎస్ కు మధ్య కాళేశ్వరం విషయంలో తీవ్ర స్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభ దద్దరిల్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమావేశాలు ముగిశాక, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సహా, ఈ ప్రాజెక్టు విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హరీశ్ రావు, ఇతర నాయకులు, అధికారులపై చర్యలు ఉంటాయా అనే చర్చ కూడా సాగుతోంది.

స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అమలుపై చర్చ

ఈ శాసన సభ సమావేశాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం గడువు విధించడంతో ఈ అంశం కూడా శాసన సభలో ప్రధాన ఎజెండా కానుంది. ఈ ఎన్నికలు నిర్వహించాలంటే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంటుంది. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ చేసి గవర్నర్ ఆమోదానికి పంపగా, పరిశీలన నిమిత్తం గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపారు. ఇప్పటి వరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి సమాచారం లేదు. దీనిని ఎన్డీఏ ప్రభుత్వం అడ్డుకుంటుందనే ఆరోపణలను ప్రభుత్వ పెద్దలు పలు వేదికలపై చేసిన పరిస్థితి ఉంది. అయితే, జీవో ద్వారా అమలు చేద్దామా అనే చర్చ కూడా శాసన సభలో జరిగే అవకాశం ఉంది. జీవో ఇస్తే అది న్యాయస్థానాల ముందు నిలబడదన్న విషయం అన్ని పార్టీలకు తెలిసిందే. అయితే, దీనిపై సభలో చర్చించి అన్ని పార్టీల అభిప్రాయాలను అధికార పార్టీ తెలుసుకోనుంది.

శాసన సభ సమావేశాలకు ముందు రాష్ట్ర క్యాబినెట్ భేటీ

ఈ శాసన సభ ప్రారంభానికి ముందే రాష్ట్ర క్యాబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో సభ నిర్వహణ, ఎన్ని రోజులు నిర్వహించాలి, సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. దాంతో పాటు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వంటి ప్రధాన అంశాలన్నీ ఈ క్యాబినెట్ మీటింగ్‌లో చర్చించనున్నారు.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు, ప్లంబర్లు, సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
గ్రూప్ 1 పేపర్లను ఎలక్ట్రిషియన్లు, డ్రైవర్లు,సెక్యూరిటీ గార్డులు దిద్దారు: చంద్రబాబు
Telangana SIR Voter List: తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
తెలంగాణలో సగం  ఓట్లు పెండింగ్.. నాలుగో వంతు మాయం.. ఏంటీ SIR మాయాజలం.. ? 
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Embed widget