అన్వేషించండి

TSPSC గ్రూప్ 1లో 100 మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నిఘా, నేడు ముగిసిన నిందితుల కస్టడీ

TSPSC Group 1 Paper Leakage: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తయింది. నలుగురు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రాజేశ్వర్, డాక్య లను నాంపల్లి కోర్టుకు సిట్ అధికారులు తరలించారు.

TSPSC Paper Leakage: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితుల కస్టడీ పూర్తయింది. నలుగురు నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, రాజేశ్వర్, డాక్య లను నాంపల్లి కోర్టుకు సిట్ అధికారులు తరలించారు. నాంపల్లి కోర్టు లో నలుగురు నిందితులను సిట్ హాజరు పరిచింది. వీరితో పాటు రంజిత్, శ్రీకాంత్, ఆనంద్, శ్రీనివాస్, సుధీర్, విజయ సారధి, హరీష్, కిషోర్ లను సైతం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. మూడు రోజుల పాటు కొనసాగిన సిట్ విచారణ పూర్తయింది. 

TSPSC లీకుల వ్యవహారంలో నిజాలు నిగ్గుతేల్చేందుకు సిట్ విచారణ వేగంవంతం చేసిన సిట్ అధికారులు ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా గ్రూప్ 1లో వంద మార్కులకు పైగా ప్రిలిమ్స్ లో సాధించిన అభ్యర్థులను జల్లెడపట్టే పనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. వంద మార్కులు దాటిన వారిని తమదైన శైలిలో ప్రశ్నలు సంధిస్తూ నిజాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా అభ్యర్థులు లీకైన పేపర్ ద్వారా మార్కులు సాధించలేదని నిర్దారించుకునేందుకు 15 ప్రధాన ప్రశ్నలు సంధిస్తున్నట్లుగా తెలుస్తోంది. లీకేజీ వ్యవహారానికి ఏమాత్రం సంబంధం లేదని నిర్దారించుకున్నతారువాత మాత్రమే ఆ అభ్యర్థుల విషయంలో ఓ క్లారిటీకి వస్తున్నట్లు తెలుస్తోంది.

సిట్ విచారణలో భాగంగా ఇప్పటివరకూ పదిహేను మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రధాన నిందితులులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్, రాజేశ్వర్ చుట్టూ ప్రస్తుతం లీక్ ల వ్యవహారంలో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే సీన్ రికన్ స్ట్రక్షన్ లో భాగంగా  CCS నుండి నిందితులను TSPSC కి తరలించి విచారించడంతోపాటు బోర్డు  నుంచి లీకైన పేపర్ ఆ తరువాత ఎక్కడ నుంచి ఎవరెవరికి చేరింది, ఎందరి చేతులు మారింది. ఒక్కోపేపర్ కు ఎంత మొత్తంలో నగదు ముట్టింది అనే కోణాల్లో విచారణ వేగవంతం చేశారు. 

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాసిన వారిలో 25వేల మంది మెయిన్స్ కు అర్హత సాధించారు. వీరిలో 100 మార్కులు సాధించిన వారే ఇప్పడు సిట్ కు టార్గెట్ గా మారారు. కేసు మూలాలను ఛేదించే పనిలో భాగంగా ద్యాప్తు ముమ్మరం చేశారు సిట్ అధికారులు. ఇప్పటికే ప్రధాన పార్టీల అధ్యక్షులకు సైతం మీ వద్ద సమాచారం ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిద్వారా సిట్ పై నిరాధార ఆరోపణలకు చెక్ పెడుతున్నామనే సంకేతాలు ఇస్తూనే మరోవైపు విచారణ విషయంలో వేగంగా ముందుకు దూసుకుపోతోంది. రాజకీయ విమర్శలు ,ప్రతి విమర్శలు పక్కనపెడితే TSPSC పేపర్ల లీకేజి కేసులో సిట్ తనదైన శైలిలో నిజాలను నిగ్గుతేల్చే పనిలోపడింది. 

TSPSC ప్రశ్నాపత్రాల లీకుల వ్యహారంలో ప్రవీణ్ ,రాజశేఖర్ రెడ్డి చుట్టూ ఉచ్చుబిగుస్తోంది. వీరిద్దరి నుంచి ఏఈ, గ్రూప్ 1, టౌన్ ప్లానింగ్ పేపర్లు బయటకు వెళ్లాయి. ఇక్కడ వీరు డబ్బుకు ఆశపడి రేణుకకు పేపర్లు అమ్మిన సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ఓ చైన్ సిస్టమ్ లా పేపర్లు వాటి జిరాక్స్ లు చేతులు మారుతూ ఎంత మంది అభ్యర్దులకు చేరాయనేది ఇప్పడు ప్రధాన ప్రశ్నగా మారింది.  ఈ క్రమంలో విచారణ ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుల బంధువుల, స్నేహితుల, లేదా వారి సంబంధికులను విచారిస్తున్నారు సిట్ అధికారులు. మొదట ప్రవీణ్ కు డబ్బు ఆశచూపి పేపర్లు బయటకు తెచ్చిన రేణుక నుండి తన భర్త డాక్యనాయక్ అతని ద్వారా మరో ఇద్దరు వ్యక్తులు రాజేంద్రకుమార్, ప్రశాంత్ లకు పేపర్ చేరినట్లు గుర్తించారు. వీరు డాక్యానాయక్ తోపాటు ఉపాధిహామీ పథకంలో సహోద్యోగులుగా ఉన్నారు. రేణుక తమ్ముడు రాజేష్ నాయక్ నుంచి గోపాల్ నాయక్, నీలేష్ నాయక్ పేరు చేరినట్లు ప్రాథమికంగా సిట్ అధికారులు నిర్దారణకు వచ్చినట్లు సమాచారం.

అయితే ఇప్పడు వీరి నుండి మరెంత మందికి గ్రూప్ 1 తో పాటు ఇతర పేపర్లు చేరాయనేది ప్రధాన ప్రశ్నగా మిగిలింది. నిందితులు కొందరి పేర్లు మాత్రమే చెప్పగలరు వారి నుంచి వాట్సప్ ద్వారా మరికొంత మందికి చేరిందని ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో సిట్ అధికారులు ఓవైపు నిందితులను ప్రత్యక్షంగా విచారిస్తూనే మరోవైపు TSPSC గ్రూప్ 1లో వంద మార్కులు దాటిన అభ్యర్దులను విచారిస్తోంది. ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లా గండీడ్, పంచాగుల తండాల్లో విచారణ పూర్తి చేశారు సిట్ అధికారులు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tanikella Bharani : మోదీ గారిని కలిశా... ముట్టుకున్నా... చేతిని ముద్దాడా - తనికెళ్ల భరణి ఎమోషనల్
మోదీ గారిని కలిశా... ముట్టుకున్నా... చేతిని ముద్దాడా - తనికెళ్ల భరణి ఎమోషనల్
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Ashu Reddy : నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
నా ప్రాణ స్నేహితుడా... హీరో భరత్ మృతిపై అషు రెడ్డి ఎమోషనల్
Hyderabad Road Accident: రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం
రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో, కెమెరా మెన్ మృతి.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై విషాదం

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget