అన్వేషించండి

Viral News: జోరందుకుంటున్న సేవ్ దామగుండం ఫారెస్ట్ క్యాంపెయిన్ - ఈ 22న హైదరాబాద్‌లో నిరసన

#SaveDamagundamForest | వికారాబాద్ జిల్లాలోని దామగుండం అటవీ భూములను కాపాడుకునేందుకు సేవ్ దామగుండం ఫారెస్ట్ ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. సెప్టెంబర్ 22న ధర్నా చౌక్ వద్ద నిరసనకు పిలుపునిచ్చారు.

Save Damagundam Forest Campaign | పూడూరు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని అనంతగిరి కొండల మధ్య ఉన్న దామగుండం అటవీ భూములను వెరీ లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ కోసం భారత నావికాదళానికి కేటాయించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయానికి నిరసనగా తెలంగాణలోని కొంతమంది ఎన్విరాన్మెంటల్ ఆక్షన్ కార్యకర్తలు ఆందోళనలు చేపడుతున్నారు.

ఈ రాడార్ స్టేషన్ ప్రాజెక్ట్ దాదాపు రూ. 2500 కోట్ల వ్యయంతో చేపడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టనానికి సంబంధిత తూర్పు నావికాదళ కమాండ్ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం ఇచ్చేందుకు యోచిస్తున్నందున, ఈ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.


Viral News: జోరందుకుంటున్న సేవ్ దామగుండం ఫారెస్ట్  క్యాంపెయిన్ - ఈ 22న హైదరాబాద్‌లో నిరసన

ఈ ప్రాజెక్ట్ ప్రారంభిస్తే, వికారాబాద్ అడవుల్లో సహజ వనరులు కోల్పోవడం, ఆహ్లాదకర వాతావరణం కోల్పోవడం, వన్యప్రాణుల మనుగడకు ముప్పు కలగడం వంటి సమస్యలు ఎదురవ్వచ్చు అని కొందరు పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు అభిప్రాయ పడుతున్నారు. అంతే కాకుండా కొన్ని వందల అరుదైన ఔషధ వృక్షాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణం లో #SaveDamagundamForest క్యాంపెయిన్ పేరిట సోషల్ మీడియాలో ఆందోళనలు ఊపందుకుంటున్నాయి.

2010 నుండి ప్రతిపాదన దశలో ఉన్న నావికాదళ రాడార్ ప్రాజెక్టు 2024లో పురోగతి సాధించనుంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా దాదాపు 2900 ఎకరాల అటవీ భూములను అధికారులు స్వాధీనం చేసుకోబోతున్నారు, దీనిలో సుమారు 12 లక్షల చెట్లను నరికివేయాల్సి వస్తుంది.

వికారాబాద్ దామగుండం పరిసరాల్లోని 20 గ్రామాల్లో సుమారు 60,000 మంది ప్రజల జీవితం ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభావితమవుతుందని అంచనా వేస్తున్నారు. అడవిపై ఆధారపడిన కూలీలు, రైతులు, పశువులను పెంచే కుటుంబాల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతినవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Viral News: జోరందుకుంటున్న సేవ్ దామగుండం ఫారెస్ట్  క్యాంపెయిన్ - ఈ 22న హైదరాబాద్‌లో నిరసన

2020లో నమోదైన పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ (PIL) ద్వారా తెలిసింది ఏంటంటే గత ఐదేళ్లలో 12,12,753 చెట్లను నరికివేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతించిందని ఇది దేశంలోనే అత్యధిక అటవీ నిర్మూలన రేటుగా ఉందని వారు వాపోతున్నారు. గతంలో ఈ ప్రాజెక్టుకు తెలంగాణ హై కోర్టు నాలుగు సంవత్సరాల పాటు స్టే విధించింది, అయితే 2024 జనవరిలో ఈ ప్రాజెక్టు తిరిగి ముందుకు కదిలింది. ప్రభావిత ప్రాంతాల స్థానికులతో సరైన సంప్రదింపులు కూడా జరగలేదు అని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ మూసీ నది పై కూడా ప్రతికూల ప్రభావం చూపవచ్చని, రేడియేషన్ మరియు చెట్లు తొలగించడం ప్రజలు, వన్యప్రాణుల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలు కలిగించే ప్రమాదం ఉందని ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్టులు హెచ్చరిస్తున్నారు.

Viral News: జోరందుకుంటున్న సేవ్ దామగుండం ఫారెస్ట్  క్యాంపెయిన్ - ఈ 22న హైదరాబాద్‌లో నిరసన

Also Read: India Last Village : సర్పంచ్‌కు అరవై మంది భార్యలు - ఇండియాలో చిట్టచివరి గ్రామంలో వింతలుు, విశేషాలు ఇవిగో

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
BSNL 5G Testing: ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pant Equals MS Dhoni Test Centuries | ఎంఎస్ ధోని సెంచరీల రికార్డును సమం చేసిన పంత్ | ABP DesamAP Govt Permission Devara Special Shows | ఏపీలో దేవర స్పెషల్ షోలకు స్పెషల్ పర్మిషన్ | ABP Desamఅయోధ్య ఉత్సవంలోనూ అపచారం, రామయ్య వేడుకల్లో తిరుమల లడ్డూలుమైసూరు ప్యాలెస్‌లో ఏనుగుల బీభత్సం, ఉన్నట్టుండి బయటకు పరుగులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Weather Alert: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం, పిడుగులు పడుతున్నాయా అన్నట్లు ఉరుములు, మెరుపులు
Tirumala Laddu: గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
గవర్నర్ ను కలిసిన షర్మిల, తిరుపతి లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ చేపట్టాలని రిక్వెస్ట్
Tirumala Laddu | తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
తిరుమలలో అపచారం - జగన్, టీటీడీ ఛైర్మన్‌లపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ లో ఫిర్యాదు
BSNL 5G Testing: ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
ఫాస్ట్‌గా పరిగెడుతున్న బీఎస్ఎన్ఎల్ - 5జీ ట్రయల్స్ వేగవంతం!
One Nation One Elections: వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌తో దేశాన్ని కబ్జా చేసేందుకు బీజేపీ ప్రయత్నం- రేవంత్ తీవ్ర ఆరోపణలు 
MG Baas Explained: కారు బ్యాటరీకి అద్దె - భారీగా తగ్గిపోనున్న ఎలక్ట్రిక్ కార్ల ధరలు - ఎంజీ సూపర్ స్కీమ్!
కారు బ్యాటరీకి అద్దె - భారీగా తగ్గిపోనున్న ఎలక్ట్రిక్ కార్ల ధరలు - ఎంజీ సూపర్ స్కీమ్!
Amazon Great Indian Festival 2024: అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
అమెజాన్ బిగ్గెస్ట్ సేల్ తేదీ ఇదే - మొబైల్స్, టీవీలపై భారీ ఆఫర్లు - ఎంత తగ్గనుంది?
KTRs Corruption allegations against Revanth : బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
బావమరిది కోసం రేవంత్ భారీ అవినీతి - కేటీఆర్ సంచలన ఆరోపణలు
Embed widget