Medaram Jatara: ఆర్టీసీ బస్సు ఆగినచోటే రిపేర్.. మేడారం జాతర భక్తులకోసం రంగంలోకి 10వేల సిబ్బంది
మేడారం జాతరకు తెలంగాణ ఆర్టీసీ పకడ్బంధీ ఏర్పాట్లు చేసింది. నిత్యం లక్షలాది మంది భక్తులను మేడారం చేర్చేందుకు , 24గంటలపాటు బస్సు సర్వీసులను నడుపుతూ, ఎక్కడా బస్సు ఆగకుండా చర్యలు చేపట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగ, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం నిర్వహణకు సర్వం సిద్దమైయ్యింది. ఈ నెల 28వ తేది నుండి 31వ తేది వరకూ జరగనున్న సమ్మక్కా సారలమ్మ జాతర నేపధ్యంలో తెలంగాణ ఆర్టీసీ గతంలో ఎన్నడూ లేనంతగా భారీ స్దాయిలో, పక్కా ప్రణాళికతో తెలుగు రాష్ట్రాల భక్తులను మేడారం చేర్చేందుకు వ్యూహాత్మకంగా వెళ్లబోతోంది.
మేడారం బయలుదేరిన ఆర్టీసీ బస్సు ఎక్కడ ఆగినా వెంటనే స్పాట్ కు చేరుకునే లా మెబైల్ టీమ్ లను సిద్దం చేసింది. 24గంటలపాటు ఆర్టీసి బస్సులు తిరిగేలా సిబ్బందిని అందుబాటులో ఉంచింది. బస్సుల సంఖ్య పెంచడమేకాదు, ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వారిని నేరుగా అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని గద్దెల దగ్గరకు తీసుకువెళ్తామంటూ బంపర్ ఆఫర్ ఇస్తోంది.
4వేల బస్సులు.. 42వేల ట్రిప్పులు..
ప్రతీ రెండేళ్లకొసారి జరిగే మేడారం జాతరకు ఈ ఏడాది విపరీతమైన ప్రచారం, ప్రభుత్వం సైతం అంతే స్దాయిలో కనివినీ ఎరుగని రీతిలో ఆలయ అభివృద్దితోపాటు భారీ ఏర్పాట్లు చేయడంతో గతంలో కంటే ఈ సారి భక్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల నుండి మాత్రమేకాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం మేడారం జాతర చూసేందుకు భక్తులు తరలివస్తుంటారు.
మేడారం జాతరకు వచ్చే ప్రయాణికుల కోసం 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసి. అంతేకాదు ఈ బస్సులు పగలు, రాత్రి తేడా లేకుండా నిత్యం మేడారంకు భక్తులను తరలించేలా సన్నాహాలు చేసింది. మేడారం జాతరకు వెళ్లేవారిలో కొందరు సొంత వాహనాలు, డీసీఎంలు, ఆటోలు ఇలా వివిధ మార్గాల ద్వారా వెళితే, 40 నుండి 50లక్షల మంది భక్తులు ఆర్టీసీ బస్సుల ద్వారానే ప్రయాణాలు చేస్తుంటారు. అందులోనూ ఈసారి మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లో ఉన్న నేపధ్యంలో మహిళా ప్రయాణికుల సంఖ్యకూడా విపరీతంగా పెరగనుంది.
మేడారం జాతకు తెలంగాణలో వివిధ ప్రాంతాలు కలిసేలా 51 పాయింట్ల నుండి 4వేల బస్సులను , 42 వేల ట్రిప్పులు తిప్పేందుకు ప్రత్యేక ఏర్పాటు చేసింది తెలంగాణ ఆర్టీసీ.ఈ నేపధ్యంలో మేడారం ఆలయం సమయంలో 50 ఎకరాల విస్తీర్ణంలో 50కిపైగా క్యూ లైన్లతో తాక్కాలిక బస్టాండ్ లు సైతం నిర్మించింది.10,450మంది ఆర్టీసి సిబ్బంది మేడారం జాతర విధుల్లో షిఫ్టుల వారిగా 24గంటలూ అందుబాటులో ఉండనున్నారు. వీారిలో 7వేల మంది డ్రైవరల్లు, 1850 మంది కండక్టర్లు, 770 మంది భద్రతా సిబ్బంది, 155 మంది స్పెషల్ ఆఫీసర్లు ఎనీటైమ్ అందుబాటులో ఉండనున్నారు.
బస్సు ఆగినచోటే స్పాట్ లో రిపేర్...
మేడారం జాతరకు వెళ్లే మార్గం అటవీప్రాంతం కావడంతో రోడ్లు కాస్త అసౌక్యంగా ఉంటాయి.అందులోనూ ప్రయాణికులు రద్దీ విపరీతంగా ఉంటుంది. బస్సులు ఓవర్ లోడ్ తో ప్రాయాణించాల్సిన పరిస్దితులు ఉంటాయి. ఈ నేపధ్యంలోొ సాధారణంగా బస్సులో అప్పడప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తడం, రిపేర్ రావడం, ఆర్టీసి బస్సులు మేడారం వెళ్లే మార్గ మధ్యలో ఆగిపోవడం జరుగుతుంది. అలా బస్సు ఆగితే ప్రయాణికులు నరకం చూడాల్సిన పరిస్దితులు ఎదురువుతాయి. ఈ నేపధ్యంలో ఈసారి అటువంటి అవకాశం లేకుండా బస్సు ఆగిన వెంటనే స్పాట్ లో రిపేర్ చేసేలా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. కేవలం బస్సుల రిపేర్ కోసమే 36 బృందాలు ఏర్పాటు చేశారు. ఒక్కో టీమ్ లో ఓ ఎలక్ట్రీషియన్ , ఇద్దరు అసిస్టెంట్లు, ఓ మెకానిక్, ఇన్ ఛార్జ్ .. ఇలా 5గురు సభ్యులుంటారు.
మేడారానికి వెళ్లే బస్సు అక్కడ ఆగినా ఈ ప్రత్యేక బృందాలు ఇట్టే వాలిపోాతాయి.వీటిలో 13 బృందాాలు వరంగల్ నగర శివారు గుడెప్పాడ్ నుండి మేడారం వరకూ డే అండ్ నైట్ తిరుగుతుంటారు. మార్గ మధ్యలో మరో 15 మేంటినెన్స్ టీమ్స్ సేవలందిస్తుంటాయి. అక్కడ కూడా మెకానిక్స్, ఎలక్ట్రీషియన్ తోపాటు స్పేర్ పార్ట్ సైతం అందుబాటులో ఉంటాయి. మరో 8 బైక్ టీమ్ లు సైతం మేడారం జాతరకు వెళ్లే మార్గంలో నిత్యం తిరుగుతుంటాయి. ఈ బైక్ టీమ్ లో ఓ మెకానిక్ , హెల్పర్ ఉంటారు. వీళ్లు మేడారం నుండి తాడ్వాయి , తాడ్వాయి నుండి పస్రా మార్గంలో బస్సులు ఆగకుండా గస్తీ కాస్తుంటారు.ఇలా ఈ ప్రత్యేక ఆర్టీసీ టీమ్ లు ఈనెల 26వ తేది నుండే విధుల్లో అందుబాటులో ఉంటారు.
ట్రెండింగ్ వార్తలు






















